శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనలో 9 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కార్తీక మాసం శనివారం, పైగా ఏకాదశి కావటంతో భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూలైన్లలో తోపులాట జరిగటంతో…. రెయిలింగ్ విరిగిపోవటంతో ఈ విషాదం జరిగినట్టు సమాచారం.

ఇక ఈ ఆలయాన్ని నాలుగేళ్ల క్రితమే ప్రారంభించారు. సుమారు రూ.20 కోట్లతో నిర్మాణ జరిగింది. కొత్తగా నిర్మించిన ఆలయంలో మే నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి. ప్రతి శనివారం ఈ ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తారు. ఈ క్రమంలోనే… ఏకాదశి కావటంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
అత్యంత విషాదం - సీఎం చంద్రబాబు
ఈ ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. “శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటన కలచివేసింది. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయాల పాలైన వారికి మేలైన సత్వర చికిత్స అందించాలని అధికారులను ఆదేశించాను. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా స్థానిక అధికారులను, ప్రజాప్రతినిధులను కోరాను” అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన విడుదల చేశారు.
కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయ తొక్కిలాట దుర్ఘటనపై హోం మంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన గురించి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. “ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందచేయాలని అధికారులను ఆదేశించాను. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలగా అండగా ఉంటుంది” అని పేర్కొన్నారు.
ఘటనాస్థలికి మంత్రి అచ్చెన్నాయుడు
ఈ ఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి హుటాహుటిన బయల్దేరి వెళ్లారు. ఘటన గురించి దేవాలయ అధికారులతో మాట్లాడారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందచేయాలని సూచించారు.
{{/usCountry}}ఈ ఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి హుటాహుటిన బయల్దేరి వెళ్లారు. ఘటన గురించి దేవాలయ అధికారులతో మాట్లాడారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందచేయాలని సూచించారు.
{{/usCountry}}మరోవైపు ఘటనా స్థలంలోని పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలానికి అదనపు పోలీసు బలగాలు తరలిస్తున్నారు.