...
...
Next Story

బాపట్ల వద్ద సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం - గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు…!

Sarkar Express Robbery : బాపట్ల-అప్పిట్ల స్టేషన్ల మధ్య సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు దోపిడీకి యత్నించారు. ప్రయాణికులను బెదిరించి, అడ్డుకున్న రైల్వే పోలీసులపై (GRP) రాళ్లతో దాడి చేయడంతో పోలీసులు గాల్లోకి హెచ్చరిక కాల్పులు జరిపారు.

Published on: Jun 15, 2026, 13:20:21 IST
Advertisement

Sarkar Express Robbery : గుంటూరు జిల్లా పరిధిలో రైలు ప్రయాణికులను భయాందోళనలకు గురిచేసిన ఘటన వెలుగుచూసింది. ఆదివారం రాత్రి బాపట్ల - అప్పిట్ల రైల్వే స్టేషన్ల మధ్య నడుస్తున్న సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక దొంగల ముఠా దోపిడీకి పాల్పడేందుకు సాహసించింది. అర్ధరాత్రి వేళ ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ దొంగతనం యత్నం జరిగిందని రైల్వే పోలీసులు వెల్లడించారు.

గాల్లోకి పోలీసుల కాల్పులు  (representative image)
గాల్లోకి పోలీసుల కాల్పులు (representative image)

పోలీసు అధికారులు అందించిన వివరాల ప్రకారం.. సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్3 (S3), ఎస్6 (S6) బోగీల్లో ప్రయాణిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా దాడికి దిగింది. నిందితులు ప్రయాణికులకు చెందిన బ్యాగులను దొంగిలించి, వాటితో పరారవడానికి ప్రయత్నించారు. అదే సమయంలో బోగీలో ఉన్న ఒక మహిళా ప్రయాణికురాలి మెడలోని బంగారు గొలుసును (గోల్డ్ చైన్) లాక్కోవడానికి దొంగలు ప్రయత్నించారు. దీంతో సదరు మహిళ గట్టిగా కేకలు వేయడంతో తోటి ప్రయాణికులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. అదే రైలులో విధుల్లో ఉన్న గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP) సిబ్బంది కూడా క్షణాల్లో స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు.

పోలీసులపై రాళ్లతో దాడి చేసిన నిందితులు

రైలులో దొంగతనం జరుగుతోందనే సమాచారం అందిన వెంటనే జీఆర్‌పీ పోలీసులు నిందితులను పట్టుకునేందుకు వేగంగా కదిలారు. దొంగలను చుట్టుముట్టి బంధించేందుకు ప్రయత్నించిన క్రమంలో నిందితులు పోలీసులకు లొంగిపోకుండా ఎదురుదాడికి దిగారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు పోలీసు బృందంపై దొంగల ముఠా విచక్షణారహితంగా రాళ్లతో దాడి చేసింది.

పరిస్థితి చేయి దాటిపోతుండటం, దొంగలు రాళ్లతో దాడి చేస్తూ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు నిందితులను భయపెట్టి లొంగదీసుకునేందుకు జీఆర్‌పీ సిబ్బంది గాల్లోకి హెచ్చరిక కాల్పులు జరిపారు. అయినప్పటికీ…. దట్టమైన చీకటిని ఆసరాగా చేసుకుని నిందితులు పోలీసుల కళ్లు గప్పి ఘటనా స్థలం నుండి పారిపోవడంలో విజయం సాధించారు.

ముమ్మరంగా గాలింపు చర్యలు

ఈ ఘటనపై జీఆర్‌పీ డీఎస్పీ అక్కేశ్వరరావు మాట్లాడుతూ….. దొంగతనానికి పాల్పడిన నిందితులను గుర్తించి… వారిని అదుపులోకి తీసుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. "ప్రస్తుతానికి దొంగిలించబడిన రెండు బ్యాగులను స్వాధీనం చేసుకున్నాం. పరారైన దొంగల ముఠాను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి," అని డీఎస్పీ అక్కేశ్వరరావు స్పష్టం చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks