Sarkar Express Robbery : గుంటూరు జిల్లా పరిధిలో రైలు ప్రయాణికులను భయాందోళనలకు గురిచేసిన ఘటన వెలుగుచూసింది. ఆదివారం రాత్రి బాపట్ల - అప్పిట్ల రైల్వే స్టేషన్ల మధ్య నడుస్తున్న సర్కార్ ఎక్స్ప్రెస్లో ఒక దొంగల ముఠా దోపిడీకి పాల్పడేందుకు సాహసించింది. అర్ధరాత్రి వేళ ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ దొంగతనం యత్నం జరిగిందని రైల్వే పోలీసులు వెల్లడించారు.

పోలీసు అధికారులు అందించిన వివరాల ప్రకారం.. సర్కార్ ఎక్స్ప్రెస్లోని ఎస్3 (S3), ఎస్6 (S6) బోగీల్లో ప్రయాణిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా దాడికి దిగింది. నిందితులు ప్రయాణికులకు చెందిన బ్యాగులను దొంగిలించి, వాటితో పరారవడానికి ప్రయత్నించారు. అదే సమయంలో బోగీలో ఉన్న ఒక మహిళా ప్రయాణికురాలి మెడలోని బంగారు గొలుసును (గోల్డ్ చైన్) లాక్కోవడానికి దొంగలు ప్రయత్నించారు. దీంతో సదరు మహిళ గట్టిగా కేకలు వేయడంతో తోటి ప్రయాణికులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. అదే రైలులో విధుల్లో ఉన్న గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP) సిబ్బంది కూడా క్షణాల్లో స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు.
పోలీసులపై రాళ్లతో దాడి చేసిన నిందితులు
రైలులో దొంగతనం జరుగుతోందనే సమాచారం అందిన వెంటనే జీఆర్పీ పోలీసులు నిందితులను పట్టుకునేందుకు వేగంగా కదిలారు. దొంగలను చుట్టుముట్టి బంధించేందుకు ప్రయత్నించిన క్రమంలో నిందితులు పోలీసులకు లొంగిపోకుండా ఎదురుదాడికి దిగారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు పోలీసు బృందంపై దొంగల ముఠా విచక్షణారహితంగా రాళ్లతో దాడి చేసింది.
పరిస్థితి చేయి దాటిపోతుండటం, దొంగలు రాళ్లతో దాడి చేస్తూ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు నిందితులను భయపెట్టి లొంగదీసుకునేందుకు జీఆర్పీ సిబ్బంది గాల్లోకి హెచ్చరిక కాల్పులు జరిపారు. అయినప్పటికీ…. దట్టమైన చీకటిని ఆసరాగా చేసుకుని నిందితులు పోలీసుల కళ్లు గప్పి ఘటనా స్థలం నుండి పారిపోవడంలో విజయం సాధించారు.
ముమ్మరంగా గాలింపు చర్యలు
రైల్వే పోలీసులు నిందితుల కోసం పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు (సెర్చ్ ఆపరేషన్) చేపట్టారు. విచారణలో భాగంగా ఘటనా స్థలం సమీపంలో దొంగలు వదిలివెళ్లిన రెండు బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బ్యాగులు ప్రయాణికుల నుండి దొంగిలించినవేనని ప్రాథమికంగా గుర్తించారు.
{{/usCountry}}రైల్వే పోలీసులు నిందితుల కోసం పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు (సెర్చ్ ఆపరేషన్) చేపట్టారు. విచారణలో భాగంగా ఘటనా స్థలం సమీపంలో దొంగలు వదిలివెళ్లిన రెండు బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బ్యాగులు ప్రయాణికుల నుండి దొంగిలించినవేనని ప్రాథమికంగా గుర్తించారు.
{{/usCountry}}ఈ ఘటనపై జీఆర్పీ డీఎస్పీ అక్కేశ్వరరావు మాట్లాడుతూ….. దొంగతనానికి పాల్పడిన నిందితులను గుర్తించి… వారిని అదుపులోకి తీసుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. "ప్రస్తుతానికి దొంగిలించబడిన రెండు బ్యాగులను స్వాధీనం చేసుకున్నాం. పరారైన దొంగల ముఠాను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి," అని డీఎస్పీ అక్కేశ్వరరావు స్పష్టం చేశారు.