టీటీడీ : ఫిబ్రవరి 8 నుండి 16వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

ఫిబ్రవరిలో శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఏయే తేదీల్లో ఏ వాహన సేవలు నిర్వహిస్తారో తెలుసుకోండి.

Published on: Jan 27, 2026 1:03 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టీటీడీ : శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 8 నుండి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి. ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వహిస్తారు.

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలు

08-02-2026

  • ఉదయం – ధ్వజారోహణం ( కుంభ ల‌గ్నం- ఉ. 8.15 నుండి 8.35 గంటల వరకు)
  • రాత్రి – పెద్దశేష వాహనం

09-02-2026

  • ఉదయం – చిన్నశేష వాహనం
  • రాత్రి – హంస వాహనం

10-02-2026

  • ఉదయం – సింహ వాహనం
  • రాత్రి – ముత్యపుపందిరి వాహనం

11-02-2026

  • ఉదయం – కల్పవృక్ష వాహనం
  • రాత్రి – సర్వభూపాల వాహనం

12-02-2026

  • ఉదయం – పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం)
  • రాత్రి – గరుడ వాహనం

13-02-2026

  • ఉదయం – హనుమంత వాహనం
  • మధ్యాహ్నం- వసంతోత్సవం (మ. 2 నుండి 3 గంటల వరకు)
  • సాయంత్రం – స్వర్ణరథం(సా. 4 నుండి 5 గంటల వరకు)
  • రాత్రి – గజ వాహనం

14-02-2026

  • ఉదయం – సూర్యప్రభ వాహనం
  • రాత్రి – చంద్రప్రభ వాహనం

15-02-2026

  • ఉదయం – రథోత్సవం
  • రాత్రి – అశ్వవాహనం

16-02-2026

  • ఉదయం – చక్రస్నానం(ఉ. 9.55 నుండి 10.15 గంటల వరకు)
  • రాత్రి – ధ్వజావరోహణం( సా. 6 నుండి రాత్రి 7 గంటల వరకు)

ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది.

శ్రీనివాసమంగాపురం అత్యంత ప్రసిద్ధ, ప్రాచీనమైన క్షేత్రం. ఇక్కడ ఉన్న శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుమల తర్వాత అంతటి పవిత్రమైనదిగా భావిస్తారు. స్వామివారు పద్మావతి దేవిని వివాహం చేసుకున్న తర్వాత ఇక్కడే ఆరు నెలల పాటు నివసించారని నమ్ముతారు. నూతన వధూవరులు ఇక్కడ పూజలు చేయడం ప్రత్యేకత. అంతేకాదు అవివాహితులు ఇక్కడకు ఎక్కువగా వస్తారు. కళ్యాణకంకణ ధరించిన వెంటనే వివాహం జరుగుతుంది నమ్మకం.