TTD e Auction : ఖాళీ గోనె సంచుల విక్రయానికి ఈ-వేలం…. ఇలా పాల్గొనొచ్చు
TTD e Auction : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆలయాల్లో వాడిన మూడు రకాల ఖాళీ గోనె సంచులను విక్రయించడానికి ఈ-వేలం నిర్వహించనున్నారు. జూన్ 30న జరిగే ఈ వేలం వివరాలు, అర్హతలు మీకోసం.
TTD e Auction : ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తమ ఆలయాలకు సంబంధించి ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. టీటీడీ అనుబంధ ఆలయాలలో 2026 ఏప్రిల్ 1 నుండి 2027 మార్చి 31 వరకు ఒక ఏడాది కాలంలో వాడిన మూడు రకాల ఖాళీ గోనె సంచులను విక్రయించడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఈ సంచులను “రేట్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన” విక్రయించేందుకు వీలుగా ఒక బహిరంగ ఈ-వేలం (e-Auction) నిర్వహించనున్నారు.

ఈ వేలం ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ వేలం సాగనుంది. ఆసక్తి కలిగిన వ్యాపారులు, వ్యక్తులు పేర్లు నమోదు చేసుకుని ఈ వేలంలో పాల్గొనవచ్చు. దీనికి సంబంధించిన డిజిటల్ వేలం ప్రక్రియ 2026 జూన్ 30న అధికారికంగా ప్రారంభమవుతుంది.
ఈ వేలంలో పాల్గొనడానికి కొన్ని నిబంధనలను విధించారు. వేలంలో భాగస్వాములు కావాలనుకునే వారు రూ.75,000/- (డెబ్బై ఐదు వేల రూపాయలు) ధరఖాస్తు రుసుము లేదా అర్నెస్ట్ మనీ డిపాజిట్ (EMD) కింద చెల్లించాల్సి ఉంటుంది.
ఈ వేలానికి సంబంధించిన పూర్తి వివరాలు, నిబంధనలు తెలుసుకోవడానికి ఆసక్తి గలవారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక కొనుగోలు పోర్టల్ https://konugolu.ap.gov.in ను సందర్శించవచ్చు. ఒకవేళ సాంకేతిక సమస్యలు లేదా ఇతర సందేహాలు ఉంటే నేరుగా తిరుపతిలోని టిటిడి జనరల్ మేనేజర్ (వేలాలు) కార్యాలయాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఇందుకోసం కార్యాలయ ఫోన్ నంబర్: 0877-2264429 లేదా ఈ-మెయిల్ ఐడీ gmauctionsttd@gmail.com ద్వారా అధికారులను సంప్రదించి పూర్తి సమాచారాన్ని సేకరించవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

