స్వాతంత్య్రంవచ్చిన తర్వాత మొదటిసారిగా విద్యుత్ కాంతులను చూసింది అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రోంపల్లి గ్రామ పంచాయతీలోని గూడెం అనే మారుమూల గిరిజన కుగ్రామం. బుధవారం విద్యుత్ లైట్లతో మెరిసిపోయింది. ఈ కొండ ప్రాంతంలో నివసించే 17 కుటుంబాలు ఇన్ని రోజులు చీకటిలోనే ఉన్నారు. ఐదు నెలల క్రితం గ్రామస్తుల విజ్ఞప్తికి స్పందించి విద్యుదీకరణ ప్రాజెక్టును వేగవంతం అయ్యేలా చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.

కేంద్ర ప్రభుత్వం నిధులు, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ సిబ్బందితో కలిసి విద్యుత్ అధికారులు కొండపై ఉన్న గ్రామానికి విద్యుత్ లైన్లను తీసుకెళ్లారు. దాదాపు 9.6 కిలోమీటర్ల దూరం లైన్ వేస్తూ.. 217 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం 17 ఇళ్లకు ఒక్కొక్కరికి ఐదు బల్బులు, ఒక ఫ్యాన్ను అందించింది. అనంతగిరి మండల ప్రధాన కార్యాలయం నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఏఎస్ఆర్ జిల్లాలోని దట్టమైన అడవులలో ఉన్న గూడెం దశాబ్దాలుగా ఆధునిక ప్రపంచం నుండి దాదాపుగా తెగిపోయింది. గ్రామస్తులకు రోడ్లు, సురక్షితమైన తాగునీరు, విద్యుత్ వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలు లేవు.
సంవత్సరాలుగా అధికారులకు పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో ఆయన స్పందించి వెంటనే అధికారులను ఆదేశించారు. ఈ విద్యుదీకరణ ప్రాజెక్టుకు అనేక సవాళ్లు ఉన్నాయి. కొండలు, రాతి భూభాగాలలో 9.6 కిలోమీటర్ల దూరం విద్యుత్ స్తంభాలను వేయాల్సి వచ్చింది. కార్మికులే స్తంభాలను మోసుకెళ్లారు. చాలా క్లిష్ట పరిస్థితుల్లో రాతి కొండలను తవ్వడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మొత్తం ఖర్చు రూ.80 లక్షలకు పైగా ఉంది.
కార్తీక పౌర్ణమి సందర్భంగా, అధికారులు 17 ఇళ్లలోనూ విద్యుత్తును ప్రారంభించారు. కృతజ్ఞతాపూర్వకంగా, నివాసితులు తమ జీవితాలను మార్చిన పవన్ కల్యాణ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పీఎం జనమాన్ పథకం కింద సౌరశక్తి, పవన టర్బైన్లను కలిపి హైబ్రిడ్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతుంది. విద్యుత్ సరఫరా కోసం ఒక ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు.
{{/usCountry}}కార్తీక పౌర్ణమి సందర్భంగా, అధికారులు 17 ఇళ్లలోనూ విద్యుత్తును ప్రారంభించారు. కృతజ్ఞతాపూర్వకంగా, నివాసితులు తమ జీవితాలను మార్చిన పవన్ కల్యాణ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పీఎం జనమాన్ పథకం కింద సౌరశక్తి, పవన టర్బైన్లను కలిపి హైబ్రిడ్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతుంది. విద్యుత్ సరఫరా కోసం ఒక ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు.
{{/usCountry}}