పల్నాడు జిల్లాలోని మాచర్లలో అమానుష ఘటన వెలుగు చూసింది. ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించిన ఓ వ్యక్తి… మహిళపై అత్యాచారం చేశాడు. దాహమని నీళ్లడిగి మెడపై కత్తిపెట్టి అత్యాచారానికి పాల్పడ్డినట్లు తెలిసింది. భాదిత మహిళ… ప్రభుత్వ విభాగంలో ఔట్ సోర్సింగ్ సిబ్బందిగా పని చేస్తున్నట్లు గుర్తించారు.
మంచినీళ్ల కోసం వచ్చి…

పోలీసుల వివరాల ప్రకారం…. ప్రభుత్వ శాఖలో ఔట్ సోర్సింగ్ సిబ్బందిగా పనిచేస్తున్న 32 ఏళ్ల మహిళపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళ తన ఇంట్లో ఒంటరిగా ఉంటున్నట్లు పల్నాడు జిల్లా ఎస్పీ బీ కృష్ణారావు తెలిపారు. ఏప్రిల్ 2న సాయంత్రం 4 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి మంచి నీళ్ల కారణంతో తలుపు తట్టాడు. తరువాత అతను బలవంతంగా ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారం చేశాడు.
సదరు మహిళ తన భర్త నుంచి విడిపోయిన ఒంటరిగా ఉంటోంది. ఆమెకు ఓ కుమార్తె ఉండగా… అమ్మమ్మ వాళ్లతో కలిసి ఉంటుందని తెలిసింది. అత్యాచార ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
అత్యాచారం చేసిన వ్యక్తి కోసం అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఏఎస్పీ) నేతృత్వంలోని బృందాలు అన్వేషిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఇప్పటికే కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
సీఎం చంద్రబాబు ఆరా - పోలీసులకు ఆదేశాలు:
మాచర్ల పట్టణంలో వెలుగు చూసిన ఈ రేప్ ఘటన పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. త్వరితగతిన నిందితుణ్ని అరెస్ట్ చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. పంచాయితీరాజ్ శాఖలో కార్యాలయ సబార్డినేట్గా పనిచేస్తున్న మహిళ ఇంట్లోకి ఒక అగంతకుడు చొరబడి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని అధికారులు తెలిపారు. ఇందుకు సీఎం స్పందిస్తూ…. నిందితుడ్ని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆదేశించారు.
ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి బాధితురాలిని వైద్య పరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్ కు తరలించినట్టు అధికారులు వివరించారు. అదనపు ఎస్పీ నేతృత్వంలో నిందితుణ్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు పోలీసు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా మహిళలపై నేరాలకు పాల్పడే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని చెప్పాలని సీఎం స్పష్టం చేశారు.
{{/usCountry}}ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి బాధితురాలిని వైద్య పరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్ కు తరలించినట్టు అధికారులు వివరించారు. అదనపు ఎస్పీ నేతృత్వంలో నిందితుణ్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు పోలీసు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా మహిళలపై నేరాలకు పాల్పడే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని చెప్పాలని సీఎం స్పష్టం చేశారు.
{{/usCountry}}