...
...
Next Story

'చంద్రబాబు గారు... ఈ 18 నెలల కాలంలో ఏ ఒక్క దీపమైనా వెలిగిందా..?' వైఎస్ జగన్ ప్రశ్నలు

కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో దీపావళి వెలుగులు నింపాల్సింది పోయి చీకటి నింపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు.

Published on: Oct 20, 2025 04:33 PM IST
Advertisement

రాష్ట్ర ముఖ్యమంత్రిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రజల జీవితాల్లో దీపావళి వెలుగులు నింపాల్సింది పోయి చీకటి నింపుతున్నారంటూ దుయ్యబట్టారు. ఈ 18 నెలల కాలంలో ఎవరికైనా సంతృప్తి ఉందా…? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పలు కూటమి ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు.

వైఎస్ జగన్ ప్రశ్నలు…

వైసీపీ అధినేత జగన్
వైసీపీ అధినేత జగన్

“చంద్రబాబు గారు….. మీరూ, మీ కూటమి ఇంటింటా వెలిగిస్తాం అన్న దీపాల్లో ఏ ఒక్క దీపం అయినా… మీ ఈ 18 నెలల కాలంలో వెలిగిందా? ఆ సంతృప్తి ఎవరికైనా ఉందా..?” అని వైఎస్ జగన్ నిలదీశారు. ట్వీట్ లో నిరుద్యోగ భృతి, పెన్షన్లు, ఉచిత గ్యాస్, ఉద్యోగుల హామీల అంశాలను ప్రస్తావించారు.

“నిరుద్యోగులందరికీ నెలకు రూ.3వేల చొప్పున భృతి, ప్రతి అక్కా చెల్లెమ్మకూ నెల నెలా రూ.1500, సంవత్సరానికి రూ.18,000, 50 ఏళ్లకే పెన్షన్‌, నెల నెలా రూ.4 వేలు, ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20,000, పీఎం కిసాన్‌ కాకుండా ఇస్తానంటూ మీరు ఇచ్చిన మాట" ఏమైందని వైఎస్ జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

“ఎంతమంది పిల్లలు ఉన్నా ఆ పిల్లలందరికీ ఏటా రూ.15,000, ప్రతి ఇంటికీ ఏటా 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, ఈ రెండేళ్లలో 6 సిలిండర్లు, అక్క చెల్లెమ్మలందరికీ ఎక్కడికైనా, ఏ బస్సులో అయినా ఉచిత ప్రయాణం, ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు” ఏమైయ్యాయని జగన్ ప్రశ్నించారు. ఇవన్నీ వెలగని దీపాలో…లేక చేశాం అంటే చేశాం అన్నట్టుగా వెలిగించిన అరకొర దీపాలా..? అని ప్రశ్నించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe