ఆహా ఓటీటీలోకి తెలుగు మైథాలజీ వెబ్ సిరీస్.. ఎవరు బకెట్ తన్నేస్తారో చెప్పబోతున్న రాజ్ తరుణ్.. ఆ కమెడియనే డైరెక్టర్..

ఆహా వీడియో ఓటీటీలోకి మరో మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. రాజ్ తరుణ్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సిరీస్ ను గతేడాది అనౌన్స్ చేసిన ఆ ఓటీటీ.. తాజాగా మంగళవారం (జులై 1) ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ టీజర్ త్వరలోనే రాబోతోందని వెల్లడించింది.

Published on: Jul 1, 2025, 12:08:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అందరి ఆయుష్షులు చెప్పడానికి వచ్చేస్తున్నాడు టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్. అతడు నటిస్తున్న మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చిరంజీవ ఆహా వీడియో ఓటీటీలోకి రాబోతోంది. గతేడాది నవంబర్లో ఈ సిరీస్ ను ఆ ఓటీటీ అనౌన్స్ చేసింది. ఇప్పుడు మరోసారి దీనిపై కీలకమైన అప్డేట్ ఇచ్చింది.

ఆహా ఓటీటీలోకి సరికొత్త తెలుగు కామెడీ వెబ్ సిరీస్.. ఎవరు బకెట్ తన్నేస్తారో చెప్పబోతున్న రాజ్ తరుణ్.. ఆ కమెడియనే డైరెక్టర్
ఆహా ఓటీటీలోకి సరికొత్త తెలుగు కామెడీ వెబ్ సిరీస్.. ఎవరు బకెట్ తన్నేస్తారో చెప్పబోతున్న రాజ్ తరుణ్.. ఆ కమెడియనే డైరెక్టర్

చిరంజీవ వెబ్ సిరీస్

రాజ్ తరుణ్ లీడ్ రోల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ చిరంజీవ. ఈ సిరీస్ త్వరలోనే రాబోతోందంటూ ఓ పోస్టర్ ను మంగళవారం (జులై 1) ఆహా వీడియో ఓటీటీ తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసింది. “అందరి ఆయుష్షు అతి త్వరలోనే చెప్పేస్తాం.. చిరంజీవ టీజర్ త్వరలోనే రానుంది” అనే క్యాప్షన్ తో ఈ పోస్టర్ ను తీసుకొచ్చారు.

ఆ పోస్టర్ పై కూడా నెక్ట్స్ బకెట్ తన్నేసేది ఎవరు అనే క్యాప్షన్ ఉంచడం విశేషం. ఈ పోస్టర్ లో రాజ్ తరుణ్ తోపాటు ఓ టైమర్ కూడా కనిపిస్తోంది. దానిపై ఇంకా భూమిపై ఉండటానికి ఎంత సమయం మిగిలి ఉందో రాసి ఉంది. త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు కూడా ఆ పోస్టర్ ద్వారా ఆహా వెల్లడించింది.

చిరంజీవ వెబ్ సిరీస్ గురించి..

చిరంజీవ వెబ్ సిరీస్ ను ప్రముఖ కమెడియన్ అదిరే అభి అలియాస్ అభినయ కృష్ణ డైరెక్ట్ చేస్తుండటం విశేషం. తెలుగులో రాబోతున్న తొలి సూపర్ హీరో వెబ్ సిరీస్ ఇదే. గతేడాది నవంబర్ లో ఈ వెబ్ సిరీస్ ను ఆహా వీడియో ఓటీటీ అనౌన్స్ చేసింది. ఇందులో రాజ్ తరుణ్ లీడ్ రోల్లో నటిస్తున్నాడు.

నిజానికి ఈ ఏడాది జనవరిలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుందని గతంలో చెప్పినా చాలా ఆలస్యమైంది. ఇప్పుడు టీజర్ అతి త్వరలోనే రానుందని మేకర్స్ వెల్లడించారు. ఈ సిరీస్ లో శివ అనే పాత్రలో రాజ్ తరుణ్ నటిస్తున్నాడు. రాహుల్ యాదవ్, సుహాసిని రాహుల్ ఈ సిరీస్ ను నిర్మిస్తున్నారు.

భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ లో పెద్ద ఎత్తున వీఎఫ్ఎక్స్ వాడటంతోపాటు విజువల్ వండర్ గా తీర్చిదిద్దుతున్నారు. చిరంజీవ వెబ్ సిరీస్ అన్ని రకాల వయసు గల ప్రేక్షకులను ఆకట్టుకునే ఆసక్తికరమైన కంటెంట్‌తో అలరిస్తుందని ఆహా టీమ్ చెబుతోంది. అద్భుతమైన విజువల్స్‌తో మంచి అనుభూతిని అందించడం లక్ష్యంగా చిరంజీవ తెరకెక్కిస్తున్నట్లు పేర్కొన్నారు మేకర్స్.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More