అలా చదవడం ఒక రకమైన హింస.. ఈ ఓటీటీ సిరీస్ తల్లిదండ్రులకి గుణపాఠం కావాలి.. బిగ్ బాస్ శివాజీ కామెంట్స్

ఓటీటీలోకి మరో తెలుగు వెబ్ సిరీస్ ఎయిర్ (AIR) డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. జూలై 3 నుంచి ఏఐఆర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఓటీటీ రిలీజ్ కానున్న నేపథ్యంలో తాజాగా జూన్ 28న ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎయిర్ ట్రైలర్ లాంచ్‌లో బిగ్ బాస్ శివాజీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Jun 29, 2025, 06:39:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బిగ్ బాస్ తెలుగు 7తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు హీరో శివాజీ. ఆ తర్వాత ఓటీటీ సిరీస్ 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్, కోర్ట్ మూవీలతో సూపర్ హిట్ కమ్ బ్యాక్ ఇచ్చాడు శివాజీ. తాజాగా బిగ్ బాస్ శివాజీ, హీరో సుహాస్ ముఖ్య అతిథులుగా ఓటీటీ తెలుగు వెబ్ సిరీస్ ఏఐఆర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్ ట్రైలర్ లాంచ్‌కు హాజరయ్యారు.

అలా చదవడం ఒక రకమైన హింస.. ఈ ఓటీటీ సిరీస్ తల్లిదండ్రులకి గుణపాఠం కావాలి.. బిగ్ బాస్ శివాజీ కామెంట్స్
అలా చదవడం ఒక రకమైన హింస.. ఈ ఓటీటీ సిరీస్ తల్లిదండ్రులకి గుణపాఠం కావాలి.. బిగ్ బాస్ శివాజీ కామెంట్స్

ఏఐఆర్ ఓటీటీ రిలీజ్

సందీప్ రాజ్‌ షో రన్నర్‌గా హర్ష రోషన్, భాను, జయతీర్థ ప్రధాన పాత్రల్లో నటించిన సరికొత్త తెలుగు వెబ్ సిరీస్ ఏఐఆర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్. ఈ ఓటీటీ సిరీస్‌కు జోసెఫ్ క్లింటన్ దర్శకత్వం వహించారు. జూలై 3 నుంచి ఈటీవి విన్‌లో ఏఐఆర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

ఈ సందర్భంగా తాజాగా జూన్ 28న ఏఐఆర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏఐఆర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఏఐఆర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో, బిగ్ బాస్ శివాజీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

టైటిల్ వినగానే

హీరో శివాజీ మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. చదువు అనేది చాలా అవసరం. ఆల్ ఇండియా ర్యాంకర్స్.. ఈ టైటిల్ వినగానే ఈటీవీలో #90కి మించి మరో పెద్ద బ్లాక్ బస్టర్ సిరీస్ రాబోతుందని నాకు అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దీనికి కనెక్ట్ అవుతారు" అని అన్నాడు.

"చదువు అనేది నేచురల్‌గా చదవాలి. కేవలం ర్యాంక్స్ కోసం చదవడం అనేది ఒక రకమైన హింస. ఈ ఓటీటీ సిరీస్ అలాంటి తల్లిదండ్రులకి ఒక గుణపాఠం కావాలి. ఈటీవీ సమాజం పట్ల చాలా బాధ్యతగా ఉంటుంది. రామోజీరావు గారు తెలుగు జాతిలో పుట్టిన ఆణిముత్యం. వారి సంస్థ నుంచి వచ్చిన కథల్లో చాలా గొప్ప సందేశం ఉంటుంది" అని శివాజీ తెలిపాడు.

మాతృభాషలో రాసినప్పుడు

"తెలుగులో మాట్లాడితే తెలుగు నటుడుకి ఆ కిక్కు వేరు. అందుకే అందరూ కూడా తెలుగులో స్క్రిప్ట్ రాసుకోవాలని కోరుకుంటున్నాను. తెలుగులో ఉండే మాధుర్యం వేరు. సినిమా అనేది ఎమోషన్. అది మాతృభాషలో రాసినప్పుడు ఇంకా అద్భుతంగా పండుతుంది" అని బిగ్ బాస్ శివాజీ పేర్కొన్నాడు.

"ఈటీవీ విన్ ఓటీటీ కొత్త రకంగా కథల్ని చెప్పాలని ప్రయత్నం చేస్తుంది. ఇది కూడా (ఏఐఆర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్) చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. అందరికీ థాంక్యు"అని హీరో శివాజీ తన స్పీచ్ ముగించాడు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More