బిగ్ న్యూస్.. అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో దిల్ రాజు సినిమా.. కన్ఫమ్ చేసిన ప్రొడ్యూసర్

అల్లు అర్జున్ అభిమానులకు పెద్ద న్యూసే చెప్పాడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. తమ బ్యానర్లో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో బన్నీ మూవీ ఉంటుందని కన్ఫమ్ చేశాడు. ఈ క్రేజీ కాంబినేషన్ పై ఇప్పుడు ఎక్కడ లేని అంచనాలు ఏర్పడ్డాయి.

Published on: Jul 2, 2025, 18:10:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ తెరపైకి రాబోతోంది. ప్రశాంత్ నీల్, ప్రభాస్.. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ తర్వాత ఇప్పుడీ కన్నడ స్టార్ డైరెక్టర్ అల్లు అర్జున్ తోనూ సినిమా తీయబోతున్నాడు. ఈ విషయాన్ని బుధవారం (జులై 2) ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరోసారి కన్ఫమ్ చేశాడు.

బిగ్ న్యూస్.. అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో దిల్ రాజు సినిమా.. కన్ఫమ్ చేసిన ప్రొడ్యూసర్
బిగ్ న్యూస్.. అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో దిల్ రాజు సినిమా.. కన్ఫమ్ చేసిన ప్రొడ్యూసర్

రావణం తీస్తున్నాం: దిల్ రాజు

ప్రశాంత్ నీల్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రావణం అనే మూవీ రాబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ విషయాన్ని దిల్ రాజు కూడా ధృవీకరించాడు. తమ బ్యానర్లోనే ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు స్పష్టం చేశాడు.

తమ్ముడు మూవీ ప్రమోషన్లలో భాగంగా దిల్ రాజు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ ప్రాజెక్టు పట్టాలకు ఎక్కడానికి కొంత సమయం పడుతుందని, అయితే ఇది కచ్చితంగా ఉంటుందని మాత్రం దిల్ రాజు తేల్చి చెప్పాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

రావణం ఎప్పుడు?

అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మూవీ కన్ఫమ్ అయినా అది ఎప్పుడు అన్నది మాత్రం చెప్పడం కష్టం. ప్రస్తుతం ఇటు బన్నీ, అటు ప్రశాంత్ ఇద్దరూ బిజీగా ఉన్నారు. పుష్ప 2 తర్వాత బన్నీ మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. అతడు పాన్ ఇండియా డైరెక్టర్ అట్లీతో ఓ మూవీ చేయబోతున్నాడు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

అటు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత సలార్ 2, కేజీఎఫ్ 3లాంటివి కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మూవీ ఎప్పుడన్నది ఇప్పుడే చెప్పడం కష్టం. అయితే అది కచ్చితంగా ఉంటుందని దిల్ రాజు చెప్పడం మాత్రం అభిమానులకు ఊరటనిచ్చేదే.

తమ్ముడు మూవీ గురించి..

ఇక ప్రస్తుతం దిల్ రాజు తన నెక్ట్స్ మూవీ తమ్ముడు ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. నితిన్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమా వచ్చే శుక్రవారం (జులై 4) థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. రూ.75 కోట్ల బడ్జెట్ తో దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు.

ఇందులో లయ కూడా చాలా రోజుల తర్వాత నటిస్తోంది. ఈ సినిమాపై దిల్ రాజు భారీ అంచనాలే పెట్టుకున్నాడు. అందుకు తగినట్లు మూవీని తెగ ప్రమోట్ చేస్తున్నాడు. అటు నితిన్ కూడా ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More