ఓటీటీలో అదరగొడుతున్న పార్ట్ 1- ఇప్పుడు వెబ్ సిరీస్ పార్ట్ 2 కూడా స్ట్రీమింగ్- అదిరే విజువల్స్- కృష్ణుడు నడిపించే కథ
ఓటీటీలో యానిమేటెడ్ సిరీస్ అదరగొడుతోంది. పార్ట్ 1 ఆడియన్స్ ను తెగ అట్రాక్ట్ చేస్తోంది. విడుదలైన తర్వాత కొన్ని వారాల పాటు ఓటీటీ ట్రెండింగ్ లో కొనసాగింది. ఇప్పుడీ సిరీస్ పార్ట్ 2 కూడా స్ట్రీమింగ్ అవుతోంది. కృష్ణుడు నడిపించే ఈ కథను ఓటీటీలో మిస్సవకుండా చూసేయండి.
ఈ పండుగ నెల ముగియకముందే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వెబ్ సిరీస్ రెండవ భాగాన్ని నెట్ఫ్లిక్స్ విడుదల చేయడంతో మరింత సందడి నెలకొంది. 'కురుక్షేత్ర: ది గ్రేట్ వార్ ఆఫ్ మహాభారత' పార్ట్ 2 ఓటీటీలోకి వచ్చేసింది. సీక్వెల్లో మొత్తం 9 ఎపిసోడ్లు ఉన్నాయి. యానిమేటెడ్ పౌరాణిక విభాగంలో ఇండియాలో తొలి ప్రయత్నంగా, నెట్ఫ్లిక్స్ దీపావళికి ముందు అక్టోబర్ 10న 9 ఎపిసోడ్లతో పార్ట్ 1ను విడుదల చేసింది.
ఓటీటీలోకి వెబ్ సిరీస్ పార్ట్ 2 (Screengrab @YouTube ~ trailer)
కురుక్షేత్ర ఓటీటీ
ప్రపంచంలోని పురాతన ఇతిహాసాలలో ఒకటి, కాలాతీత క్లాసిక్లలో ఒకటైన ఈ కురుక్షేత్ర వెబ్ సిరీస్ హస్తినాపుర సింహాసనం కోసం పాండవులు, కౌరవుల మధ్య 18 రోజుల వంశపారంపర్య యుద్ధాన్ని వివరిస్తుంది. కురుక్షేత్ర పార్ట్ 2 కూడా ఓటీటీలోకి వచ్చేసింది. నెట్ఫ్లిక్స్ అక్టోబర్ 24న కురుక్షేత్ర పార్ట్ 2లోని చివరి తొమ్మిది ఎపిసోడ్లను విడుదల చేసింది. ఈ సిరీస్ పార్ట్ 2 కూడా ఆడియన్స్ తో కేక పెట్టిస్తోంది.
మహాభారత యుద్ధం
పార్ట్ 1 ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే ప్రారంభమయ్యే కురుక్షేత్ర పార్ట్ 2 జయద్రధుని మరణం తర్వాత జరిగిన తీవ్రమైన తొమ్మిది రోజులను చూపిస్తుంది. ఈ కథ యుధిష్ఠిరుని నేతృత్వంలోని పాండవులు, దుర్యోధనుని నేతృత్వంలోని 100 మంది కౌరవ సోదరులకు వ్యతిరేకంగా చేసిన పోరాటం చుట్టూ తిరుగుతుంది. రెండవ భాగం 18 రోజుల కురుక్షేత్ర యుద్ధానికి దారితీసిన చివరి రోజులను కవర్ చేస్తుంది. యోధులు ఎదుర్కొన్న భీకరమైన ఘర్షణలు, నైతిక సందిగ్ధతలను కలిగి ఉన్న ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ మహాభారత యానిమేటెడ్ అనుసరణకు చివరి అధ్యాయం.
కృష్ణుడు నడిపించే కథ
మహాభారత కర్త, కర్మ, క్రియ, సూత్రధారి అన్నీ కృష్ణుడే. అర్జునుడి రథసారథిగా కురుక్షేత్ర యుద్ధాన్ని నడిపిస్తాడు కృష్ణుడు. టిప్పింగ్ పాయింట్ బ్యానర్పై అలోక్ జైన్, అను సిక్కా, అజిత్ అంధారే నిర్మించిన ఈ సిరీస్ ఉత్కంఠభరితమైన ముగింపును అందిస్తుందని హామీ ఇస్తుంది. ఉజాన్ గంగూలీ రచయిత-దర్శకుడిగా ఇది తన కథన నిర్మాణం, మానసిక లోతు కారణంగా ఇతర పౌరాణిక పునఃకథనాల నుండి భిన్నంగా నిలుస్తుంది.
ప్రముఖ కవి, గీత రచయిత గుల్జార్ ఈ సిరీస్కు సాహిత్యం అందించారు, ఇందులో సుమారు 30 నిమిషాల నిడివి గల ఎపిసోడ్లు ఉన్నాయి. మహాభారత యుద్ధంలోని చివరి తొమ్మిది రోజులను కవర్ చేస్తూ, ఈ కథనం తీవ్రమైన సంఘర్షణలు, అర్జునుడు, కర్ణుడి మధ్య ద్వంద్వ యుద్ధం, భీముని చివరి యుద్ధాన్ని అన్వేషిస్తుంది.