బ్రహ్మముడి జులై 21 ఎపిసోడ్: లంచం కేసులో అప్పు సేఫ్- అయినా యామిని స్కెచ్ సక్సెస్- కూతురు రేవతిని ఇంటికి పిలిచిన అపర్ణ!
బ్రహ్మముడి సీరియల్ జులై 21 ఎపిసోడ్లో కోర్టులో వాదనలు జరుగుతుండగా శీను దగ్గరికి వెళ్లిన రాజ్ రౌడీలను చితకబాదుతుంటాడు. ఇంతలో రాజ్ తలపై రౌడీ కర్రతో కొడతాడు. కానీ, కట్ చేస్తే కోర్టుకు శీను వస్తాడు. కోర్టులో అప్పుకు లంచం ఇవ్వలేదని నిజం చెబుతాడు. కూతురు రేవతిని ఇంటికి రమ్మంటుంది అపర్ణ.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో కోర్టులో కావ్యను విచారించాలని లాయర్ చెప్పడంతో బోనులో నిల్చుంటుంది కావ్య. కావ్య బెయిల్ ఇప్పించడాన్ని తప్పు బడతాడు లాయర్. శీను ఇంటికి వెళ్లింది అడిగితే కావ్య వెళ్లినట్లు చెబుతుంది. శీనును బెదిరించడానికి ప్రయత్నించారు. మాట వినకపోవడంతో మాయం చేశారు అని పీపీ లాయర్ అంటాడు.

నువ్ ఇచ్చిన సాక్ష్యంతోనే
అబద్ధం అని కావ్య అరుస్తుంది. నా చెల్లి ఏ తప్పు చేయలేదు. అది అడగడానికే వెళ్లానని కావ్య చెబుతుంది. తర్వాత కావ్యను వెళ్లమంటాడు లాయర్. నేను చెప్పానుగా కావ్య. నువ్వు ఇచ్చిన సాక్ష్యంతోనే నీ చెల్లికి శిక్ష పడుతుంది అని యామిని అంటుంది. అప్పు తన పోలీస్ బ్రెయిన్ ఉపయోగించి అక్కను పంపించారని పీపీ అంటే.. అప్పు తనను తాను డిఫెండర్ చేసుకుంటుంది.
దొరికిపోయాక ఇలా చెబుతున్నారని లాయర్ అంటాడు. కావ్య టెన్షన్ పడుతూ రాజ్కు కాల్ చేస్తుంది. ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుంది. ఇంతలో యామిని వచ్చి భయపడుతున్నావా అని ఎగతాళి చేస్తుంది. నా మాట వినకుంటే అప్పు జైలుకు వెళ్తుంది. నేను చెప్పింది చేయమని అడుగుతుంది. ఇంకోద్దిసేపటిలో జడ్జ్ గారు అప్పుకు శిక్ష వేస్తాడు పదా అని లోపలికి వెళ్తుంది యామిని.
మరోవైపు శీను రౌడీ రంగా వెళ్లనివ్వడు. ఇంతలో రాజ్ వచ్చి వెధవలతో చేతులు కలిపితే ఇలాగే ఉంటుంది అని డైలాగ్ కొడతాడు. రౌడీలను చితకబాది శీనును తీసుకెళ్తాడు. కానీ, వెనుక నుంచి రాజ్ తలపై కర్రతో కొడతాడు రౌడీ రంగా. దాంతో రాజ్ స్పృహ తప్పి కింద కుప్పుకూలిపోతాడు. అప్పులాంటి వల్ల చాలా మందికి అన్యాయం జరుగుతుంది. అప్పుకు శిక్ష వేయాల్సిందిగా కోరుతాడు పీపీ లాయర్.
సరైనా సాక్ష్యాలు తీసుకొస్తాం
డిఫెన్స్ నుంచి వాదనలు ఉన్నాయా అని జడ్జ్ అడిగితే.. అప్పు లాయర్ శీను వస్తేనే నిజాలు తెలుస్తాయి. కాస్తా గడువు ఇస్తే సరైన సాక్ష్యాలు సబ్మిట్ చేస్తానని డిఫెన్స్ లాయర్ అంటాడు. ఇప్పటికే సాక్ష్యులను బెదిరించారు. ఇంకా టైమ్ ఇస్తే మార్చే అవకాశం ఉంది. తక్షణమే అప్పుకు శిక్ష వేసి శీనుకు న్యాయం చేయాలని పీపీ అంటాడు. అందులోనూ పాయింట్ ఉంది అప్పు గారు మీరు గిల్టీ ఫీల్ అవుతున్నారా అని అడుగుతాడు.
అప్పు సైలెంట్గా ఉంటుంది. ఇంతలో శీనును రాజ్ తీసుకొస్తాడు. ఈ కేసులో ముఖ్యమైన సాక్షి శీనును తీసుకొచ్చాను అని రాజ్ చెబుతాడు. దాంతో శీను కోర్టు బోనులో నిల్చుంటాడు. అప్పు గారే కదా మీ దగ్గర లంచం తీసుకుంది అని పీపీ అంటే.. లంచం తీసుకున్నారా అని అడగకుండా కన్ఫర్మ్ చేస్తూ తీసుకుందిగా అని అడుగుతున్నారని డిఫెన్స్ లాయర్ అంటాడు.
దాంతో జడ్జ్ మందలిస్తాడు. పీపీ అలాగే అడుగుతాడు. యామిని భయపడుతూ ఉంటుంది. అప్పుకు మీరు లంచం ఇచ్చారా లేదా అని పీపీ అంటే ఇచ్చాను అని శీను చెబుతాడు. దాంతో అంతా షాక్ అవుతారు. ఏసీబీ వాళ్లకు అప్పును పట్టించింది ఈ శీనునే. ఇప్పుడు నిజం చెప్పాడు అంతే అని పీపీ అంటాడు. కానీ, సర్ నేను డబ్బు ఇచ్చాను. కానీ, లంచం కాదు. కావాలని ఇరికించడానికే ఈ పని చేశాను అని శీను చెబుతాడు.
ఓ లేడి ఇచ్చారు
అప్పుడు శీను చేసింది అంతా చెబుతాడు. అలా ఎందుకు చేశావ్ అని పీపీ అడిగితే.. డబ్బు ఇస్తా అన్నారు. ఒక లేడి ఇస్తానంది. కానీ, ఆవిడ ఎవరో నాకు తెలియదు అని శీను చెబుతాడు. దాంతో యామిని నవ్వుతుంది. అంతకుముందు శీనుతో మాట్లాడింది గుర్తు చేసుకుంటుంది. ఒకవేళ ప్లాన్ ఫెయిల్ అయి నువ్ వాళ్లకు దొరికినా నా పేరు చెప్పకూడదు. నాకోసం జైలుకు వెళ్లిన నెలకు లక్ష రూపాయలు ఇస్తాను. ఆరు నెలలకు ఆరు లక్షలు ఇస్తాను అని యామిని చెబుతుంది.
దానికి శీను ఒప్పుకుంటాడు. అందుకే యామిని పేరు చెప్పడు. అలా యామిని ప్లాన్ బీ వర్కౌట్ అవుతుంది. శీను చెప్పినదాని ప్రకారం అప్పు ఏ తప్పు చేయలేదని డిఫెన్స్ లాయర్ అంటాడు. దాంతో అప్పును రిలీజ్ చేస్తూ, శీనుకు ఆరు నెలల శిక్ష విధించిన జడ్జ్ శీను వెనుకున్న లేడిని పట్టుకోవాలని పోలీసులకు ఆర్డర్ వేస్తాడు.
తర్వాత రాజ్కు కల్యాణ్, అప్పు థ్యాంక్స్ చెబుతారు. కావ్య మాత్రం థ్యాంక్స్ చెప్పట్లేదని రాజ్ అంటాడు. తర్వాత తమను కాపాడిన రేవతిని బర్త్ డేకి పిలవాలని రాజ్, కావ్య గొడవ పడుతుంటే అపర్ణ వచ్చి తనను కూడా పిలుద్దామని అంటుంది. తర్వాత రేవతికి కావ్య కాల్ చేసి ఇస్తే అపర్ణ మాట్లాడుతుంది.
అపర్ణ ఇంటికి రేవతి
కళావతి వాళ్ల అత్తయ్య అపర్ణను మాట్లాడుతున్నాను. రేపు మా మనవరాలి బర్త్ డే ఉంది. మీరు తప్పకుండా రావాలి అని కూతురు రేవతిని తల్లి అపర్ణ ఆహ్వానిస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



