బ్రహ్మముడి జూన్ 4 ఎపిసోడ్: రేఖ, ఇందులకు ఐశ్వర్య షాక్.. లక్కీలో మొదలైన అనుమానం.. మనవడి గురించి రాజుకు చెప్పిన అపర్ణ

Brahmamudi June 4th Episode: ‘బ్రహ్మముడి’ (Brahmamudi) సీరియల్ నేటి (జూన్ 4) ఎపిసోడ్ ఫుల్ ట్విస్టులతో సాగింది. దుగ్గిరాల కంపెనీ సీఈవో పోస్ట్ దక్కించుకోవడానికి రేఖ పక్కా స్కెచ్ వేస్తే.. దాన్ని చెడగొట్టడానికి ఐశ్వర్య ఏకంగా కిరాయి రౌడీలను రంగంలోకి దించింది.

Published on: Jun 4, 2026, 08:43:23 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Brahmamudi June 4th Episode: బుల్లితెర ఆడియన్స్‌ను ఉత్కంఠకు గురిచేస్తున్న ‘బ్రహ్మముడి’ సీరియల్ ప్రస్తుతం సీఈవో పీఠం చుట్టూ తిరుగుతోంది. నిన్నటి వరకు ఒక లెక్క.. నేటి నుంచి ఇంకో లెక్క అన్నట్లుగా దుగ్గిరాల ఫ్యామిలీలో పాలిటిక్స్ పీక్స్‌కు చేరాయి. గురువారం (జూన్ 4) ఎపిసోడ్‌లో ఏకంగా రౌడీలు ఎంటర్ అవ్వడంతో కథనం మరో మలుపు తిరిగింది.

బ్రహ్మముడి జూన్ 4 ఎపిసోడ్: రేఖ, ఇందులకు ఐశ్వర్య షాక్.. లక్కీలో మొదలైన అనుమానం.. మనవడి గురించి రాజుకు చెప్పిన అపర్ణ
బ్రహ్మముడి జూన్ 4 ఎపిసోడ్: రేఖ, ఇందులకు ఐశ్వర్య షాక్.. లక్కీలో మొదలైన అనుమానం.. మనవడి గురించి రాజుకు చెప్పిన అపర్ణ

ఐశ్వర్యకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఇందు

బ్రహ్మముడి సీరియల్ గురువారం (జూన్ 4) ఎపిసోడ్ మొదట్లోనే ఐశ్వర్యకు ఇందు గట్టిగా క్లాస్ పీకుతుంది. "ఈ మధ్యే నీకు కళ్లు నెత్తికెక్కాయి.. మొగుడు ఉన్నాడన్న ధైర్యమా.. నువ్వో పనిదానివే.. నా రూమ్‌లో ఉన్నంత మాత్రాన నీ రాత మారదు" అంటూ ఐశ్వర్య నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది.

దానికి ఇందు ఏమాత్రం తగ్గకుండా.. "నేను ఏదో ఒక పని చేస్తున్నాను.. నువ్వు అది కూడా చేయడం లేదు. ఇప్పుడు మాటలతోనే వదిలేస్తున్నా.. అవసరమైతే బుద్ధి కూడా చెప్పగలను" అంటూ ఐశ్వర్యకు వార్నింగ్ ఇస్తుంది.

ఆంటోనీ జేబులో రేఖ ఫోటో.. లక్కీకి డౌట్!

మరోవైపు తన తల్లి జాడ తెలుసుకోవడం కోసం ఆంటోనీ దగ్గరికి వెళ్తాడు లక్కీ. అప్పటికే వాడు ఫుల్లుగా తాగి పడుకుంటాడు. అతని జేబులో నుంచి ఒక ఫోటో కిందపడుతుంది. అదేంటా అని లక్కీ చూడబోతే.. అది రేఖ ఫోటో. అప్పుడే నిద్ర లేచిన ఆంటోనీ వెంటనే లక్కీ చేతుల్లో నుంచి ఫోటో లాక్కుంటాడు.

"ఇది నా పర్సనల్ ఫోటో.. నువ్వు చూడొద్దు" అని కవర్ చేస్తాడు. కానీ లక్కీ బుర్రలో డౌట్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడూ లేనిది పర్సనల్ అంటున్నాడేంటి అని ఆలోచనలో పడతాడు.

బ్లడ్ రిలేషన్ లాగుతోందా?.. ఎమోషనల్ అయిన అపర్ణ

సీఈవో పదవి కోసం దేవుడికి మొక్కుకుని, అపర్ణ, సుభాష్ దగ్గరికి వెళ్తుంది ఇందు. రాజు వచ్చినప్పటి నుంచి తమకు చాలా ధైర్యం వచ్చిందని, చూడటానికి మాత్రమే కాదు గుణంలోనూ రాజ్ లాగే ఉన్నాడని వాళ్లు మురిసిపోతారు. ఆ తర్వాత రాజును చూసిన అపర్ణ ఎమోషనల్ అవుతుంది.

"మా మనవడు ఇలాగే ఉండేవాడు, అతని లేని లోటు నువ్వు భర్తీ చేస్తున్నావు.. నిన్ను చూసినప్పుడల్లా ఏదో రక్త సంబంధం ఉన్నట్లు అనిపిస్తోంది" అంటూ రాజును పట్టుకుంటుంది అపర్ణ. ఆమె టచ్ చేయగానే రాజుకు కూడా లోపల ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఇదంతా తాను నటిస్తున్నానన్న విషయాన్ని గుర్తుచేసుకుని ఆ ఎమోషన్‌ను కంట్రోల్ చేసుకుంటాడు.

కావ్య సెంటిమెంట్‌ను వాడుకుంటున్న రేఖ.. రౌడీలతో ఐశ్వర్య స్కెచ్!

ఇక కంపెనీ బోర్డులో ఐదుగురు మెంబర్స్ ఉంటే.. ఇద్దరు తనకు, ఇద్దరు రాజుకు సపోర్ట్ చేస్తారని రేఖ ఒక అంచనాకు వస్తుంది. మిగిలిన సీనియర్ మెంబర్ పరంధామయ్య ఓటు కీలకం కావడంతో రేఖ మాస్టర్ మైండ్ వాడింది. పరంధామయ్యకు కావ్య అంటే ప్రాణం కాబట్టి.. కావ్యలాగే ఉండే ఇందును తీసుకెళ్లి సీఈవోగా ప్రొజెక్ట్ చేస్తే ఆయన ఓటు తనకే పడుతుందని రేఖ ప్లాన్ చేస్తుంది.

కానీ ఈ ప్లాన్ సగం మాత్రమే విన్న ఐశ్వర్య.. రేఖ నిజంగానే ఇందును సీఈవో చేస్తుందేమో అని భయపడిపోతుంది. ఎలాగైనా ఆ మొద్దును సీఈవో కానివ్వకూడదని డిసైడ్ అయ్యి కిరాయి రౌడీలకు ఫోన్ చేస్తుంది. మరి ఈ రౌడీల ఎంట్రీతో రేఖ ప్లాన్ ఎలా రివర్స్ అవుతుందో రేపటి ఎపిసోడ్‌లో చూడాలి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

బ్రహ్మముడి సీరియల్‌లో దుగ్గిరాల కంపెనీ సీఈవో ఎవరు అవుతారు?

బోర్డు మెంబర్స్‌లో టై అవ్వడంతో.. సీనియర్ మెంబర్ పరంధామయ్య ఓటు కీలకంగా మారింది. ఆయన ఓటు వేసిన వారే సీఈవో అవుతారు. ఇందును అడ్డం పెట్టుకుని ఆ ఓటు కొట్టేయాలని రేఖ చూస్తోంది.

రాజును చూసి అపర్ణ ఎందుకు ఎమోషనల్ అయింది?

చనిపోయిన తన కొడుకు రాజ్ పోలికలతో పాటు, అతడి గుణాలు కూడా రాజులో కనిపిస్తుండటంతో.. తమకు ఏదో రక్త సంబంధం ఉన్న ఫీలింగ్ కలుగుతోందని అపర్ణ ఎమోషనల్ అయింది.

ఐశ్వర్య రౌడీలను ఎందుకు బుక్ చేసింది?

రేఖ నిజంగానే ఇందును సీఈవో చేస్తుందని అపార్థం చేసుకున్న ఐశ్వర్య.. ఎలాగైనా ఆ ప్లాన్ చెడగొట్టి ఇందును అడ్డుకోవడానికే రౌడీలను పిలిపిస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More