బ్రహ్మముడి అక్టోబర్ 15 ఎపిసోడ్: కావ్య ఇంటి ముందు రాజ్ నిరాహార దీక్ష.. మహిళా సంఘాల వార్నింగ్.. పోలీసుల దగ్గరకు పంచాయితీ!
బ్రహ్మముడి సీరియల్ బుధవారం (అక్టోబర్ 15) ఎపిసోడ్ చాలా రక్తికట్టించేలా సాగింది. కావ్య, రాజ్ సంసారం రోడ్డున పడుతుంది. మహిళా సంఘాలూ సీన్లోకి ఎంటరవుతాయి. అటు కావ్య ఇంటి ముందు నిరాహార దీక్షకు రాజ్ సిద్ధమవుతాడు.
బ్రహ్మముడి ఈరోజు అంటే 852వ ఎపిసోడ్ మొత్తం రాజ్, కావ్య పంతం.. రుద్రాణి కొత్త కుట్రలు.. దుగ్గిరాల ఇంటికి మహిళా సంఘం వాళ్లు వచ్చి వార్నింగ్ ఇవ్వడం లాంటి సీన్లతో సాగిపోయింది. అయితే ఎంత జరిగినా వెనక్కి తగ్గని రాజ్.. చివరికి కావ్యను ఎలాగోలా ఇంటికి తీసుకురావడానికి ఇంటి ముందు నిరాహార దీక్షకు సిద్ధమవుతాడు.

రాజ్ను రెచ్చగొట్టిన రుద్రాణి.. చెంప పగలగొట్టిన ఇందిర
బ్రహ్మముడి సీరియల్ బుధవారం (అక్టోబర్ 15) ఎపిసోడ్ రాజ్ ను రుద్రాణి రెచ్చగొట్టే సీన్ తో మొదలువుతంది. ఈ ఇంటి పరువు తీస్తున్న కావ్య కోసం మీరందరూ నిరాహార దీక్ష చేయడం ఏంటి? రాజ్ ను ఎందుకు బలవంతం చేస్తున్నారంటూ రుద్రాణి అంటుంది.
ఈ విషయంలో రాజ్ ను మరింత రెచ్చగొడుతుండటంతో రుద్రాణి చెంప పగలగొడుతుంది ఇందిరా దేవి. ఈ విషయంలో తప్పంతా రాజ్ దే అని, కావ్య ఏం తప్పూ చేయలేదని ఇందిర, అపర్ణ అంటారు. కావ్యను తీసుకొస్తావా లేదా అంటూ రాజ్ కు మరోసారి క్లాస్ పీకి వెళ్లిపోతారు.
తల్లిని ఎగతాళి చేస్తూ నవ్విన రాహుల్
మరోసారి రుద్రాణి ప్లాన్ ఫెయిల్ కావడంతో రుద్రాణిని చూసి నవ్వుతుంటాడు రాహుల్. నీ ఒక్క ప్లాన్ కూడా వర్కౌట్ కాదా మమ్మీ.. నువ్వు ఓటమికి కేరాఫ్ అడ్రెసా అని ఎగతాళి చేస్తాడు. దీంతో రుద్రాణికి కోపం వస్తుంది. రాజ్ ను మరింత రెచ్చగొట్టాలని, కావ్యను ఇంటికి దూరం చేయడానికి డోసు పెంచాలని అంటుంది. వెంటనే మహిళా సంఘాల వాళ్లకు ఫోన్ చేయమని రాహుల్ కు చెబుతుంది. వాళ్లు ఎంటరైతే సమస్య మరింత తీవ్రమవుతుందని, రాజ్ ఇరకాటంలో పడతాడని చెబుతుంది.
రుద్రాణికి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిన కావ్య..
ఇంతలో రుద్రాణికి కావ్యే ఫోన్ చేస్తుంది. మీడియా వాళ్లకు ఇంటి సమాచారం ఇచ్చింది మీరేనా అంటూ నిలదీస్తుంది. నాకు తిన్నింటి వాసాలు లెక్క పెట్టే అలవాటు లేదని రుద్రాణి చెప్పినా కావ్య వినదు. ఆ ఇంటికి ఏం జరిగినా కంచుకోటలా తాను కాపాడుకుంటానని కావ్య స్పష్టం చేస్తుంది. దీంతో రుద్రాణి మరింత రెచ్చిపోతుంది. ఇక లాభం లేదు వెంటనే మహిళా సంఘాలను రంగంలోకి దింపాల్సిందే అని అని రాహుల్ తో వాళ్లకు ఫోన్ చేయిస్తుంది.
కావ్యకు ఫోన్ చేసి క్లాస్ పీకిన రాజ్.. ఎదురుతిరిగిన కావ్య
అటు తన పరువు తీసిన కావ్యకు రాజ్ ఫోన్ చేసి క్లాస్ పీకుతాడు. మీడియా వాళ్లను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావని నిలదీస్తాడు. దీంతో కావ్య కూడా ఎదురుతిరుగుతుంది. బిడ్డ వద్దు అంటున్నానంటే అర్థం చేసుకోవాలని, ఇలా రచ్చ చేయడమేంటని రాజ్ అంటాడు. తనకు బిడ్డ ఎంత అవసరమో అత్తవారింటి పరువు కూడా అంతే ముఖ్యమని, తాను ఇక్కడే బిడ్డను కని కోడలిగా ఆ ఇంటికి వస్తానని కావ్య స్పష్టంగా చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఈ రాక్షసిని ఇంటికి ఎలా తీసుకురావాలో ఏంటో అంటూ రాజ్ అనుకుంటాడు.
కావ్యను ఓదార్చిన తల్లి కనకం
అటు తన బిడ్డను తలచుకుంటూ ఎందుకింతలా బాధపెడుతున్నావని కావ్య అనుకుంటూ ఉంటుంది. అప్పుడే తల్లి కనకం ఆమె దగ్గరికి వచ్చి పాలు తాగమని అంటుంది. ఆమెను ఓదారుస్తుంది. ఈ సమస్య మీడియా పుణ్యమాని సమాజం సమస్య అయిందని, తమతోపాటు అందరూ నీ వెంటనే ఉన్నామని కావ్యకు సర్దిచెబుతుంది. తన భర్తను అల్లరి చేయాలన్నది తన ఉద్దేశం కాదని, ఓ భార్యగా తన భర్త పరువు కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా తనపై ఉన్నదని కావ్య అంటుంది.
ఆ తర్వాత ఇటు కావ్య, అటు రాజ్ ఒకరినొకరి ఫొటోలు చూసుకుంటూ బాధపడుతూ ఉంటారు. నేను చెప్పిన ప్రతి విషయం అర్థం చేసుకున్న నువ్వు.. బిడ్డ వద్దంటే ఎందుకు అర్థం చేసుకోవడం లేదని రాజ్ అంటాడు. మీరు చెప్పిన ప్రతిదీ విన్నాను.. ఇదొక్క విషయంలో మీరు ఎందుకు ఇంత మొండిగా ఉంటున్నారని అటు కావ్య అంటుంది. ఇద్దరూ బాధపడుతూ ఉంటారు.
దుగ్గిరాల ఇంటికి మహిళా సంఘాల వాళ్లు.. రెచ్చగొట్టిన రుద్రాణి
రుద్రాణి ప్లాన్ సక్సెస్ అయి దుగ్గిరాల ఇంటికి మహిళా సంఘాల వాళ్లు వస్తారు. రాజ్ ఎక్కడున్నాడు పిలవండి అని అడుగుతారు. ఈ ఇంటి కోడలైన కావ్యను ఎందుకు హింసిస్తున్నాడు.. పిల్లలు వద్దని ఎందుకు అంటున్నాడు.. అని ప్రశ్నిస్తారు. దీంతో రాజ్ వచ్చి తన భార్యపై ప్రేమే కాదు అమితమైన గౌరవం కూడా ఉన్నదని, తన భార్యనే కాదు ఆఫీసులో మహిళలకు కూడా సమానమైన హక్కులు కల్పించానని అంటాడు. మరి మీ భార్య పుట్టింటికి ఎందుకు వెళ్లింది అని వాళ్లు నిలదీస్తారు.
దీంతో రుద్రాణి కావాలని సీన్లోకి వస్తుంది. చెప్పకపోతే ఏం చేస్తారు.. ఇది మా కుటుంబ విషయం.. అసలు మా మేనల్లుడు ఎవరో మీకు తెలుసా అంటూ మహిళా సంఘం వాళ్లను కావాలని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. ఇందిరాదేవి చెప్పినా వినదు. దీంతో వాళ్లు పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఎవరేంటో తెలుస్తుందని బెదిరిస్తారు. వాళ్లు ఇచ్చిన ట్విస్ట్ తో రాజ్ లో మరింత కంగారు మొదలవుతుంది.
కావ్యకు విడాకులు ఇవ్వమని రుద్రాణి అతన్ని మరింత రెచ్చగొడుతుంది. దీంతో రాజ్ మరోసారి కావ్య ఇంటికి వెళ్లి రమ్మని అడుగుతాడు. తాను రానని ఆమె తెగేసి చెబుతుంది. దీంతో నువ్వు వచ్చే వరకు ఇక్కడే నిరాహార దీక్ష చేస్తానని రాజ్ అక్కడే కూర్చుంటాడు. అక్కడితో బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


