బ్రహ్మముడి జులై 16 ఎపిసోడ్: రేవతి అపర్ణ కూతురు అని తెలుసుకున్న కావ్య.. అప్పూకి రెండు శిక్షలు.. శీనుగాడికి యామిని ఆఫర్
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే బుధవారం (జులై 16) ఎపిసోడ్ ఎన్నో ట్విస్టులతో సాగింది. రేవతి ఎవరో తెలుసుకుంటుంది కావ్య. అటు అప్పూకి రెండు శిక్షలు పడేలా యామిని ప్లాన్ చేస్తుంది. శీనుగాడికి ఓ పెద్ద ఆఫరే ఇస్తుంది.
స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి బుధవారం (జులై 16) ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఓవైపు అప్పూ, శీనుగాడి ఎపిసోడ్.. మరోవైపు రేవతి, ఇందిరాదేవి ఎపిసోడ్.. ఇంకోవైపు కావ్య, రాజ్ ఎపిసోడ్.. ఇలా ఎన్నో ట్విస్టులు ఇస్తూ సాగిపోయింది. చివరికి రేవతి ఎవరో కాదు అపర్ణ కూతురు అని కావ్య తెలుసుకుంటుంది.

రాజ్, కావ్యలకు క్లాస్ పీకిన ఇందిరాదేవి
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ రాజ్.. ఇందిరాదేవిని బస్తీలో చూసి ఇక్కడేం చేస్తున్నావని నిలదీసే సీన్ తో మొదలవుతుంది. ఇద్దరూ కాసేపు మాటలు కాకుండా విజిల్స్ తో పలకరించుకుంటారు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావంటే.. నువ్వు ఇక్కడేం చేస్తున్నావంటూ ప్రశ్నించకుంటారు. కావ్య మాట్లాడుతూ.. “ఈ బస్తీలో మీకు ఏం పని? ఇక్కడ నీకు తెలిసినవాళ్లు ఎవరూ లేరు కదా?” అని సందేహంగా అడుగుతుంది.
ఇందిర స్పందిస్తూ.. “బస్తీలో మనుషులు ఉండరా? వాళ్లతో పని ఉండదా?” అని తిరిగి ప్రశ్నిస్తుంది. “నా పని అయిపోయింది, వెళ్తున్నా” అని చెప్పి.. “మీరిద్దరు ఇక్కడ ఎందుకొచ్చారు?” అని అడుగుతుంది. రాజ్, కావ్య జవాబు చెప్పకుండా మౌనంగా ఉంటారు. తాను ఇంటికి వెళ్తున్నానని చెప్పడంతో తామూ అక్కడికే వెళ్తున్నామని డ్రాప్ చేస్తామని రాజ్ అంటాడు. కానీ తనకూ కారు ఉందంటూ ఇందిర వెళ్లిపోతుంది.
తల్లితో యామిని సంబరాలు
మరోవైపు యామిని తన కుట్ర ఫలించడంతో వైదేహితో సంబరాలు చేసుకుంటుంది. “కావ్య తన చెల్లి అప్పూ కోసం సాక్ష్యం సేకరించేందుకు బస్తీకి వెళ్లింది. కానీ అప్పటికే నేను ఆ సాక్ష్యాన్ని మాయం చేశాను” అని సంతోషంగా చెబుతుంది. “ఈ దెబ్బతో అప్పూ జీవితం ఖతమ్, కావ్య జీవితాంతం ఏడుస్తుంది” అని నవ్వుతుంది.
వైదేహి స్పందిస్తూ.. “కావ్యను తేలిగ్గా తీసుకోవద్దు, ఆమె తెలివైనది. నీ పెళ్లిని ఆపుతానని చెప్పి, నిజంగానే ఆపేసింది” అని హెచ్చరిస్తుంది. యామిని ధీమాగా, “అప్పూని కాపాడే కీ నా దగ్గర ఉంది, దేవుడు కూడా ఆమెను రక్షించలేడు” అని సవాల్ విసురుతుంది. తనకు పని ఉందని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
రాజ్, కావ్యలను నిలదీసిన రుద్రాణి
రాజ్, కావ్య సాక్ష్యం కోసం బస్తీకి వెళ్లి నిరాశగా తిరిగి వస్తారు. ఇంట్లోని వాళ్లందరూ ఆ ఇద్దరినీ రకరకాల ప్రశ్నలతో వేధిస్తారు. ఏమైంది.. ఆ సాక్షి ఒప్పుకున్నాడా.. అప్పూకి శిక్ష తప్పుతుందా.. అంటూ వరుసగా ప్రశ్నలు సంధిస్తారు. అన్నింటినీ రాజ్, కావ్య సైలెంట్ గా ఉండటంతో అసలు ఏమైందని నిలదీస్తారు. దీంతో రాజ్ నిరాశగా.. “ఆ సాక్షి దొరకలేదు” అని చెబుతాడు.
రుద్రాణి కోపంగా.. “పొడిచేస్తామని, పీకేస్తామని వెళ్లి, ఏం చేశారు?” అని నిలదీస్తుంది. కావ్య స్పందిస్తూ.. “మేము సాక్షి ఇంటికి సరైన టైమ్ కే వెళ్లాము. కానీ ఎవరో అతన్ని కిడ్నాప్ చేశారు. అతని ఫోన్ స్విచ్ఛాఫ్లో ఉంది” అని వివరిస్తుంది. దీంతో అందరూ షాక్ తింటారు. అంటే అప్పూకి ఇక శిక్ష తప్పదా అని వాళ్లంతా నిరాశ చెందుతారు. దీంతో ఈ ఇంటి పరువు గంగలో కలిసిపోయింది.. ఇక మీడియా వాళ్లు దుగ్గిరాల కుటుంబంలో లంచగొండి అంటూ ఏదేదో రాసేస్తారంటూ రుద్రాణి నానా యాగీ చేస్తుంది.
రేపు కోర్టు హియరింగ్ ఉంది.. సాక్ష్యం లేకుంటే అప్పూ శిక్ష అనుభవించాల్సిందే అని హెచ్చరిస్తుంది. ఇందిర ఆగ్రహంగా.. “ఇంటి పరువు గురించి మాట్లాడకు, రేపటి వరకు టైం ఉంది, ఏదో ఒక పరిష్కారం కనుక్కుందాం” అని సమాధానమిస్తుంది. కావ్య ధైర్యంగా.. “మేము ఆగము, రేపటి లోపు సాక్ష్యం కనుక్కుంటాం” అని ప్రతిజ్ఞ చేస్తుంది.
శీనుగాడి దగ్గరికి యామిని
అటు శీనుగాడిని దాచి ఉంచిన చోటికి యామిని వెళ్తుంది. అప్పటికే తనను ఎందుకు కిడ్నాప్ చేశారని చెప్పారని యామిని మనిషిని నిలదీస్తుంటాడు. దీంతో అప్పుడే వెళ్లిన యామిని.. “నువ్వు నీ అమ్మతో మాట్లాడటం కుదరదు, ఇక్కడి నుంచి బయటకు వెళ్లడం కూడా కుదరదు” అని గట్టిగా చెబుతుంది. శీనుగాడు గందరగోళంలో.. “నేను నిజంగా కిడ్నాప్ అవ్వలేదు కదా?” అని అడుగుతాడు. యామిని నవ్వుతూ.. “నువ్వు కిడ్నాప్ అవ్వలేదని ఎవరు చెప్పారు?” అని అంటుంది.
అంతేకాదు తన ప్లాన్ ఏంటో అతనికి వివరిస్తుంది. “రెండు రోజులు నువ్వు ఎవరికీ కనిపించకూడదు, అప్పూ కేసులో శిక్ష పడే వరకు” అని చెబుతుంది. శీనుగాడు గందరగోళంలో.. “మొన్న కోర్టుకు వెళ్లమన్నారు, ఇప్పుడు వెళ్లొద్దంటున్నారు, నాకేం అర్థం కావడం లేదు” అని అంటాడు. యామిని స్పందిస్తూ.. “నువ్వు టెన్షన్ పడొద్దు. నీకు అంతా అర్థమవుతుంది. నీవు కోర్టుకు వెళ్లి అప్పూ లంచం తీసుకుందని చెబితే, ఆమెకు ఒక శిక్ష మాత్రమే పడుతుంది. కానీ నీవు కనిపించకపోతే, అప్పూ వాళ్లే నిన్ను కిడ్నాప్ చేశారని మన లాయర్ వాదిస్తాడు. అప్పుడు జడ్జి అప్పూకి రెండు శిక్షలు విధిస్తారు” అని యామిని ధీమాగా చెబుతుంది.
మరో రెండు రోజులు ఇక్కడే ఉండి, ఎవరికీ ఫోన్ చేయకపోతే మరో రూ.2 లక్షలు ఇస్తానని కూడా శీనుగాడికి యామిని ఆఫర్ ఇస్తుంది. దీంతో అతడు తెగ ఆనందపడిపోతాడు.
రేవతి గురించి ఇందిరను నిలదీసిన కావ్య
మరోవైపు దుగ్గిరాల ఇంట్లో ఇందిరాదేవి ఎంతో ఆవేదనతో దేవుడి ముందు తన గోడు వెల్లబోసుకుంటుంది. అసలు రేవతిని అపర్ణతో ఎలా కలపాలో అర్థం కావడం లేదని బాధపడుతుంది. రేవతి పేరు ఎత్తితేనే అపర్ణ మండిపడుతోంది.. మరి ఈ ఇద్దరినీ ఎలా కలపాలో తెలియడం లేదని ఆవేదన చెందుతుంది. అప్పుడే అక్కడికి కావ్య వచ్చి.. ఎందుకు అలా బాధగా ఉన్నారని ఇందిరను అడుగుతుంది.
మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తుంది. అంతేకాదు రేవతి ఎవరు అని, ఆమె ఇంట్లో మీరు దాక్కోవడం తాను చూశానని కూడా చెబుతుంది. దీంతో ఇందిర షాక్ తింటుంది. తన కారు పాడైపోతే ఆమె దగ్గరికి వెళ్లాను తప్ప ఆమెకు, ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తుంది. అయితే ఈ విషయం అత్తయ్యనే అడిగి తెలుసుకుంటానని కావ్య అనడంతో ఇందిర ఆమెను ఆపుతుంది. అక్కడితో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది. అయితే తర్వాత వచ్చిన ప్రోమోలో రేవతి.. అపర్ణ కూతురు అని కావ్యతో ఇందిర చెప్పడం చూపించారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper



