Deepika Padukone: దీపిక బేబీ బంప్ ఫొటోషూట్.. భర్త రణ్వీర్, కూతురు దువాతో కలిసి పోజులిచ్చిన స్టార్ హీరోయిన్
Deepika Padukone: దీపికా పదుకోన్ తన భర్త రణ్వీర్ సింగ్, కూతురు దువాతో కలిసి చేసిన మెటర్నిటీ ఫొటోషూట్ వైరల్ అవుతోంది. ఇందులో ఆమె తన బేబీ బంప్ చూపిస్తూ మురిసిపోవడం చూడొచ్చు.
Deepika Padukone: బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్ తమ అభిమానులకు మైండ్ బ్లోయింగ్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ క్రేజీ జోడీ రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. తమ రెండేళ్ల ముద్దుల కూతురు దువా పదుకోన్ సింగ్తో కలిసి దిగిన లేటెస్ట్ మెటర్నిటీ ఫోటోషూట్ పిక్స్ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

కూతురు దువాతో కలిసి క్యూట్ ఫోటోషూట్
ఇన్స్టాగ్రామ్లో జాయింట్ పోస్ట్ ద్వారా ఈ మెటర్నిటీ పిక్స్ను షేర్ చేసిన రణ్వీర్ సింగ్.. "బేబీ దువాతోపాటు మా హృదయాలు కూడా పెరుగుతున్నాయి. మీ ఆశీస్సులకు ధన్యవాదాలు" అంటూ క్యాప్షన్ రాశారు.
ఈ ఫోటోల్లో దీపికా పదుకోన్ తన బేబీ బంప్ను చూపిస్తూ ఎంతో అందంగా కనిపిస్తుండగా, రణ్వీర్ తన కూతురు దువాను ఎత్తుకుని ఎంతో మురిపెంగా చూస్తున్నారు. ఈ ఫోటోషూట్లో చిన్నారి దువా అమాయకమైన నవ్వు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే దువా ఎంత వేగంగా పెరిగిపోయిందో చూసి ఫ్యాన్స్ కామెంట్లలో మురిసిపోతున్నారు.
రెండో ప్రెగ్నెన్సీ ప్రకటన.. దీపికా, రణ్వీర్ లవ్ స్టోరీ
ఈ ఏడాది ప్రారంభంలోనే దీపికా, రణ్వీర్ తమ రెండో సంతానం గురించి అఫీషియల్గా అనౌన్స్ చేశారు. పాప దువా చేతిలో పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ పట్టుకున్న ఫోటోను షేర్ చేస్తూ ఫ్యాన్స్కు తీపి కబురు అందించారు.
కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత 2018లో ఇటలీలోని లేక్ కోమో వేదికగా ఈ జంట వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సెప్టెంబర్ 2024లో వీరికి మొదటి సంతానంగా కూతురు దువా జన్మించింది. ఇప్పుడు మళ్లీ రెండోసారి తల్లిదండ్రులు కాబోతుండటాన్ని ఎంజాయ్ చేయడానికి సిద్ధమవుతున్నారు.
షారుఖ్ ఖాన్తో 'కింగ్'.. అల్లు అర్జున్తో ‘రాకా’
పర్స్ నల్ లైఫ్లో ఈ హ్యాపీ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తూనే, మరోవైపు దీపికా పదుకోన్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్తో కలిసి ఆమె నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా 'కింగ్' (King) షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. షారుఖ్, దీపికా కాంబినేషన్లో వస్తున్న ఆరో సినిమా ఇది కావడం గమనార్హం. ఇటీవల ఈ సినిమా సెట్స్ నుంచి లీకైన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి.
దీనితో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న హై-వోల్టేజ్ మూవీ 'రాకా' (Raaka) లో కూడా దీపికా పదుకోన్ ఫీమేల్ లీడ్గా నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్పై అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమా 2027లో థియేటర్లలోకి రాబోతోంది. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్లో ఫుల్ స్వింగ్లో ఉన్న దీపికాకు సోషల్ మీడియాలో సెలబ్రిటీలతో పాటు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


