మనం, ఊపిరి లాగే ఇందులో నాగార్జున చాలా కొత్తగా కనిపిస్తారు.. అది పదింతలు కనిపిస్తుంది.. దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

మనం, ఊపిరి సినిమాల్లో లాగానే టాలీవుడ్ కింగ్ నాగార్జునను కుబేర మూవీ చాలా కొత్తగా చూస్తారని డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెలిపారు. నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నాలతో దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమా కుబేర. ఈ మూవీ రిలీజ్ సందర్భంగా ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు శేఖర్ కమ్ముల.

Published on: Jun 19, 2025, 10:08:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నాగార్జున, రష్మిక మందన్నా, ధనుష్ వంటి అగ్ర తారలు తొలిసారిగా కలిసి నటించిన సినిమా కుబేర. పాపులర్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర జూన్ 20న థియేటర్లలో గ్రాండ్‌గా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

మనం, ఊపిరి లాగే ఇందులో నాగార్జున చాలా కొత్తగా కనిపిస్తారు.. అది పదింతలు కనిపిస్తుంది.. దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్
మనం, ఊపిరి లాగే ఇందులో నాగార్జున చాలా కొత్తగా కనిపిస్తారు.. అది పదింతలు కనిపిస్తుంది.. దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

ఈ కథకు నాగర్జున గారే కావాలని మీరు పట్టుపట్టారని తెలిసింది?

- కొన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ నాగార్జున గారు చేస్తే బాగుంటుంది. ఈ క్యారెక్టర్‌కి ఆయన పర్‌ఫెక్ట్ యాప్ట్. ఆయనని స్క్రీన్ మీద చూసినప్పుడు ఒక వావ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అయితే ఇందులో ఆయన్ని ఒక వేరే విధమైన యాక్టింగ్, మేనేజర్స్‌తో క్యారెక్టర్‌కి తగ్గట్టుగా చూపించడం జరిగింది.

-నాగార్జునగారు మనం, ఊపిరి ఇలా చాలా చిత్రాల్లో డిఫరెంట్ వేరియేషన్ ఉన్న క్యారెక్టర్స్ చేశారు. ఈ సినిమాలో కూడా అలాగే ఆయన చాలా కొత్తగా కనిపిస్తారు. ఈ క్యారెక్టర్‌లోకి ఆయన అద్భుతంగా ఇమిడిపోయారు. రష్మిక కూడా అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తుంది. తనకి మంచి అవకాశం వస్తే నెక్ట్స్ లెవెల్‌లో నటించే హీరోయిన్ తను.

కుబేర కూడా మీ మార్క్‌లోనే ఉంటుందా?

-నిజానికి నా మీద ఒక మార్క్ పడింది. కానీ, నేను ఒక మార్కు కోసం ఎప్పుడూ సినిమాలు చేయలేదు. కథకు ఏం కావాలో అదే చేశాను. అయితే ఎక్కువగా బ్లాక్ బస్టర్ ఆయన సినిమాలు మ్యూజికల్ హిట్స్, లవ్ స్టోరీలు ఉన్నాయి కాబట్టి అలా ఒక ముద్ర వచ్చింది.

-లీడర్ సినిమా చాలా హానెస్ట్‌గా చెప్పిన కథ. అందులో లవ్ స్టోరీ పెట్టాలి, మంచి పాటలు పెట్టాలని అనుకోలేదు. హ్యాపీ డేస్‌లో కూడా అంతే. కాలేజ్ స్టోరీ అంటే అలాగే ట్రీట్ చేయడం జరిగింది. అందుకే మీకు నచ్చింది. కుబేర కూడా అంతే. ఈ కథకు కావలసింది చేశాను. మార్క్ అనేది కథ ప్రకారం ఉంటుంది.

ఇలా చేశారా అనే

-అయితే ఇలాంటి కథని ఇలా చేశారా అనే వావ్ ఫ్యాక్టర్ కుబేర చూసినప్పుడు ఆడియన్స్‌లో ఉంటుంది. అందుకే ముందుగానే ఈ కంటెంట్ ఏంటనేది ట్రైలర్ టీజర్‌లో క్లియర్‌గా చెప్పాము. రిచ్, పూర్ మధ్య జరిగే కథని ముందుగానే ఎస్టాబ్లిష్ చేశాం. ఇది ఒక డిఫరెంట్ సినిమా. నేను ఏ సినిమా తీసిన హానెస్ట్‌గానే చేస్తాను. అది ఈ సినిమాలో పదింతలు కనిపిస్తుంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More