...
...
Next Story

మాదే అసలైన లైసెన్స్‌డ్ గన్.. వాళ్లవి దీపావళి డమ్మీ గన్స్: తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ వివాదంపై ఈటీవీ విన్ పోస్ట్ వైరల్

తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్ కథ విషయంలో ఈటీవీ విన్, జీ5 ఓటీటీ మధ్య వివాదం ముదురుతోంది. గురువారం (జూన్ 26) ఈటీవీ విన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. తమదే అసలైన లైసెన్స్‌డ్ గన్ అని చెప్పిన ఆ ఓటీటీ తమ కానిస్టేబుల్ కనకం త్వరలోనే రానుందని వెల్లడించింది.

Published on: Jun 26, 2025, 14:56:04 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

తెలుగులో థ్రిల్లర్ వెబ్ సిరీస్ విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ శుక్రవారం (జూన్ 27) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న విషయం తెలుసు కదా. అయితే దీని ఒరిజినల్ కథ తమదని ఈటీవీ విన్ వాదిస్తోంది. ఇప్పటికే మూవీ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ దీనిపై న్యాయపోరాటం చేస్తున్నట్లు చెప్పాడు. ఇక తాజాగా ఈటీవీ విన్ ఓటీటీ చేసిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతోంది.

ఈటీవీ విన్ పోస్ట్ ఇలా..

మాదే అసలైన లైసెన్స్‌డ్ గన్.. వాళ్లవి దీపావళి డమ్మీ గన్స్: తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ వివాదంపై ఈటీవీ విన్ పోస్ట్ వైరల్
మాదే అసలైన లైసెన్స్‌డ్ గన్.. వాళ్లవి దీపావళి డమ్మీ గన్స్: తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ వివాదంపై ఈటీవీ విన్ పోస్ట్ వైరల్

నిజానికి ఈటీవీ విన్ కానిస్టేబుల్ కనకం అనే వెబ్ సిరీస్ ను చాలా రోజుల కిందటే అనౌన్స్ చేసింది. ఇప్పుడు జీ5 ఓటీటీలో వస్తున్న విరాటపాలెం కథ తమదే అని ఆ ఓటీటీ వాదిస్తోంది. తాజాగా తమదే ఒరిజినల్ గన్ అని, మిగిలినవి దీపావళి డమ్మీ గన్స్ అంటూ పోస్ట్ చేసింది. అంతేకాదు త్వరలోనే తమ కానిస్టేబుల్ కనకం రాబోతుందని కూడా వెల్లడించింది.

“కానిస్టేబుల్ కనకం ఒరిజినల్ లైసెన్స్‌డ్ గన్ కేవలం ఈటీవీ విన్ దగ్గరే ఉంది. డమ్మీ దీపావళి గన్స్ అవసరం లేదు. కానిస్టేబుల్ కనకం త్వరలోనే వస్తోంది. కోవెలమూడి సత్య సాయిబాబా, వేమూరి హేమంత్ కుమార్ ప్రొడ్యూస్ చేశారు. ప్రశాంత్ కుమార్ దిమ్మల డైరెక్ట్ చేయగా.. సురేష్ బొబ్బిలి మ్యూాజిక్ అందించాడు” అనే క్యాప్షన్ తో పోస్ట్ చేసింది.

అసలు వివాదం ఏంటి?

విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ అనే థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను జీ5 ఓటీటీ శుక్రవారం (జూన్ 27) ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. అయితే ఈ కథను తాను గతంలో ఆ ఓటీటీకి చెప్పానని, వాళ్లు కాదనడంతో ఈటీవీ విన్ తో చేశానని, కానీ ఇప్పుడదే కథతో వాళ్లు తీయడం అన్యాయమని డైరెక్టర్ ప్రశాంత్ వాదిస్తున్నాడు. దీనిపై కోర్టుకు కూడా వెళ్లినట్లు చెప్పాడు. ఇదే కథతో కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ ను ఈటీవీ విన్ రూపొందించింది.

ఈలోపే వాళ్లు మరొకరితో అదే కథతో ఈ వెబ్ సిరీస్ తీశారని, ఈ మధ్యే ట్రైలర్ చూసి తాను షాక్ తిన్నట్లు తెలిపాడు. దీంతో తాము కోర్టుకు వెళ్లామని, ప్రస్తుతం కేసు నడుస్తోందని వెల్లడించాడు. ఇలాంటి పరిస్థితి వస్తుందని తాను ఊహించలేదని అన్నాడు. నటి వర్ష బొల్లమ్మతో కానిస్టేబుల్ కనకం మూవీని గతేడాది డిసెంబర్లో అనౌన్స్ చేశారు. ఆ కథ తనదే అని, వాళ్లు కాపీ కొట్టారనడానికి అన్ని ఆధారాలు ఉన్నట్లు చెప్పాడు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe