...
...
Next Story

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: ఇల్లు తాకట్టు పెట్టమన్న మనోజ్.. రోహిణి కొత్త నాటకం.. ఇరికించిన మటన్ కొట్టు మాణిక్యం

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (జులై 16) ఎపిసోడ్ లో రోహిణి కొత్త డ్రామా మొదలుపెడుతుంది. అయితే ఆమె తీసుకొచ్చిన మటన్ కొట్టు మాణిక్యం ఆమెను ఇరికించేస్తాడు. అటు మనోజ్ ఇంటిని తాకట్టు పెట్టమని డిమాండ్ చేస్తాడు.

Published on: Jul 16, 2025, 08:40:13 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

స్టార్ మా సీరియల్ ‘గుండె నిండా గుడి గంటలు’ బుధవారం (జులై 16) 768వ ఎపిసోడ్ ఆసక్తికర మలుపులతో సాగింది. అసలు నీకు తండ్రి ఉన్నాడా అంటూ ప్రభావతి.. రోహిణిని నిలదీయడం, ఆమె కొత్త డ్రామా మొదలుపెట్టడం, ఇంటిని తాకట్టు పెట్టాలంటూ మనోజ్ ఒత్తిడి చేయడంతో ఈ ఎపిసోడ్ రక్తి కట్టించింది. అసలు ఈరోజు మొత్తం ఏం జరిగిందో ఒకసారి చూద్దాం.

ప్రభావతి ఆగ్రహం.. రోహిణిపై ప్రశ్నల వర్షం

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: ఇల్లు తాకట్టు పెట్టమన్న మనోజ్.. రోహిణి కొత్త నాటకం.. ఇరికించిన మటన్ కొట్టు మాణిక్యం
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: ఇల్లు తాకట్టు పెట్టమన్న మనోజ్.. రోహిణి కొత్త నాటకం.. ఇరికించిన మటన్ కొట్టు మాణిక్యం

గుండె నిండా గుడి గంటలు బుధవారం ఎపిసోడ్ ప్రభావతి.. రోహిణి గదిలోకి వచ్చే సన్నివేశంతో ఆరంభమవుతుంది. రోహిణి తండ్రి గురించి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఆమెను ఒత్తిడి చేస్తుంది. “మీ నాన్న ఫంక్షన్ రోజు ఎక్కిన ఫ్లైట్ ఇంకా ఆకాశంలో గద్దలాగా తిరుగుతోందా?” అని సెటైర్ వేస్తుంది.

“ఆయనకు నీ మీద ప్రేమ ఉందా? వస్తానని చెప్పి మోసం చేశాడు. కూతురు మీద బాధ్యత లేదా?” అని కోపంగా అడుగుతుంది. “మీ నాన్న రాకపోతే నీ స్థాయి నీకు తెలిసేలా చేస్తాను” అని హెచ్చరిస్తుంది. “ఆయన మలేషియాను ఏలుతున్నాడా? ఫోన్‌ చేయడానికి కూడా సమయం లేదా?” అని రోహిణిని గజగజ వణికిస్తుంది. అసలు నీకు నాన్న ఉన్నాడా.. అసలు పుట్టిల్లు ఉందా అని నిలదీస్తుంది.

రోహిణి వివరణ ఇచ్చినా..

ప్రభావతి ఒత్తిడితో రోహిణి లోలోపల కంగారు పడుతుంది. సున్నితంగా సమాధానమిస్తూ, “మా నాన్న ఎందుకు రావడం లేదో నాకూ అర్థం కావడం లేదు. అమ్మ చనిపోయాక నాన్నతో కలిసి ఉండలేకపోయాను. ఆయన మరో పెళ్లి చేసుకోవడంతో కోపంలో దూరంగా ఉన్నాను. ఆ తర్వాత ఆయన్ని పట్టించుకోలేదు” అని చెబుతుంది.

“మీ కోసమే ఇప్పుడు నాన్నపై కోపాన్ని తగ్గించుకుంటున్నాను” అని ప్రభావతిని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రభావతి సందేహంగా.. “నువ్వు చెప్పేది నిజమా? పార్లర్ విషయంలో అబద్ధాలు చెప్పినట్లే, ఇప్పుడు నీ నాన్న గురించి అబద్ధాలు చెబుతున్నావా?” అని అడుగుతుంది. “నీకు నాన్న ఉన్నాడా లేడా? మనోజ్‌కు అత్తగారి కుటుంబం ఉందా?” అని నానా మాటలతో రోహిణిని మరింత భయపెడుతుంది.

రోహిణి కొత్త డ్రామా

“ఇవి కుదరకపోతే, మలేషియా తండ్రిలాగా మరో జూనియర్ ఆర్టిస్ట్‌ను తీసుకొచ్చి చూపిద్దాం” అని సూచిస్తుంది. రోహిణి నిరాశగా.. “అవన్నీ సెట్ కావు. అయినా ఆమె మా నాన్న కోసం కాదు.. ఆయన తెచ్చే బంగారం, నగలు, నగదు కోసం చూస్తోంది” అని చెబుతుంది. దీంతో మరోసారి మటన్ కొట్టు మాణిక్యాన్నే రంగంలోకి దింపాలని నిర్ణయించుకుంటుంది.

మాణిక్యం రీఎంట్రీ.. రోహిణిని ఇరికించేలా..

రోహిణి పరిష్కారం కోసం ‘మటన్ కొట్టు మాణిక్యం’ను తిరిగి ఇంటికి రప్పిస్తుంది. అతడు ఈసారి ఎలాగైనా తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేయాలని అనుకుంటాడు. ఇంటికి వచ్చీ రాగానే నానా హడావిడి చేస్తాడు. డోర్లు, కిటికీలు మూసేయమంటాడు. ఫోన్లు స్విచాఫ్ చేయమంటాడు. దీంతో అసలు ఏం జరిగిందని అందరూ అతన్ని గట్టిగా నిలదీస్తారు.

“రోహిణి తండ్రిని మలేషియా పోలీసులు అరెస్ట్ చేశారు. బిజినెస్‌లో స్నేహితులు మోసం చేసి, కేసును ఆయనపై తోశారు” అని చెబుతాడు. దీంతో అందరూ షాక్ తింటారు. మరి ఆస్తుల సంగతేంటని ప్రభావతి అడిగితే.. బాలు, సత్యం ఆమెపై అసహనం వ్యక్తం చేస్తారు.

అతడు నిర్దోషిగా బయటపడే వరకు ఆస్తులు కూడా రావని మాణిక్యం అంటాడు. అయితే అతడు ప్రతి మాటలోనూ మేక గురించి ప్రస్తావించడం, ఏం చేయాలో నువ్వే చెప్పాలంటూ రోహిణిని అడగడం ఇంట్లో వాళ్లకు అతనిపై సందేహం వచ్చేలా చేస్తాయి. ఒక దశలో రోహిణి ఇరుక్కుపోయినట్లే కనిపిస్తుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

ఇంటిని తాకట్టు పెట్టాలంటూ..

అయితే ఎపిసోడ్ తర్వాత రేపటి ఎపిసోడ్ ప్రోమో ఆసక్తి రేపింది. తాను కచ్చితంగా కెనడానే వెళ్తానని, అక్కడికి వెళ్తే లక్షలు సంపాదిస్తానని మనోజ్ పట్టుబడతాడు. అయినా రూ.14 లక్షలు ఇవ్వాలంటే తన వల్ల కాదని సత్యం తేల్చి చెప్పేస్తాడు. దీంతో ఈ ఇంటిని తాకట్టు పెడితే వస్తాయి కదా అని మనోజ్ అంటాడు. దీనికి సత్యంతోపాటు ప్రభావతి, బాలు కూడా కుదరదు అని చెప్పేస్తారు. అంతా నీకే ఇచ్చేస్తే మేం ఎక్కడికి పోవాలంటూ ప్రభావతి అంటుంది. ఇది రేపటి ఎపిసోడ్ పై ఎంతో ఆసక్తి రేపుతోంది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe