...
...
Next Story

హరి హర వీరమల్లు టికెట్ల ధరల పెంపు.. ఏపీలో ఒక్కో టికెట్‌పై ఎంత పెంచారంటే?

హరి హర వీరమల్లు టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. తెలంగాణలో అనుమతి లేకపోవడంతో ఏపీలో ధరలు పెంచారు. గతంలోనే దీనికోసం ప్రభుత్వాన్ని అనుమతి కోరినట్లు మేకర్స్ వెల్లడించగా.. ఇప్పుడు అధికారికంగా ధరలు పెంచుతూ నిర్ణయం వెలువడింది.

Published on: Jul 19, 2025, 17:23:20 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన మూవీ హరి హర వీరమల్లు. ఈ సినిమా జులై 24న థియేటర్లలో రిలీజ్ కానుంది. పవన్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇదే తొలి మూవీ కావడం విశేషం. ఈ సినిమా కోసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

హరి హర వీరమల్లు టికెట్ల ధరలు ఇలా..

హరి హర వీరమల్లు టికెట్ల ధరల పెంపు.. ఏపీలో ఒక్కో టికెట్‌పై ఎంత పెంచారంటే?
హరి హర వీరమల్లు టికెట్ల ధరల పెంపు.. ఏపీలో ఒక్కో టికెట్‌పై ఎంత పెంచారంటే?

పవన్ కల్యాణ్ లీడ్ రోల్లో నటించిన మూవీ హరి హర వీరమల్లు సినిమా జులై 24న థియేటర్లలో రిలీజ్ కానుండగా.. ఐదు రోజుల ముందు టికెట్ల పెంపుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో లోయర్ క్లాస్ కు రూ.100, అప్పర్ క్లాస్ కు రూ.150 వరకు పెంచుకోవచ్చని తెలిపింది.

ఇక మల్టీప్లెక్స్ లలో రూ.200 వరకు పెంచుకునే అవకాశం కల్పించింది. దీంతో సింగిల్ స్క్రీన్లలో గరిష్ఠంగా రూ.297, మల్టీప్లెక్స్ లలో రూ.377 వరకు టికెట్లు ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. పది రోజుల పాటు మాత్రమే పెరిగిన ధరలు అమల్లో ఉంటాయి. ఈ సినిమా ప్రీమియర్స్ తోపాటు టికెట్ల ధరలు పెంచుకునే అవకాశం కల్పించారు.

హరి హర వీరమల్లు రన్ టైమ్

ఇక హరి హర వీరమల్లు మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్లు గతంలోనే మేకర్స్ వెల్లడించారు. పార్ట్ 1 స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో వస్తున్న ఈ సినిమా జులై 24న థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. 2 గంటల 42 నిమిషాల భారీ నిడివితో వస్తున్న ఈ సినిమా 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు.

హరి హర వీరమల్లు ప్రీరిలీజ్ ఈవెంట్ జులై 20న వైజాగ్ లో జరగనుంది. దీనికోసం మేకర్స్ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో పవన్ అభిమానులు ఈ ఈవెంట్ కు తరలి రానున్నారు. తిరుపతి, విజయవాడలలో ఈ ఈవెంట్ జరగనున్నట్లు మొదట వార్తలు వచ్చినా.. తర్వాత విశాఖపట్నానికి మార్చారు.

రెండేళ్ల తర్వాత పవన్ మూవీ వస్తుండటం, అందులోనూ ఇప్పుడు అతడు ఏపీకి డిప్యూటీ సీఎంగా ఉండటంతో ఈ హరి హర వీరమల్లు మూవీ చాలా ప్రత్యేకంగా నిలవనుంది. ఈ నేపథ్యంలో ప్రీరిలీజ్ ఈవెంట్ ఓ రేంజ్ లో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.

పవన్ కెరీర్లోనే అత్యధిక బిజినెస్

హరి హర వీరమల్లు మూవీపై ఉన్న అంచనాల నేపథ్యంలో ఈ సినిమా భారీగా ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. పవన్ కల్యాణ్ కెరీర్లో అత్యధికంగా తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.150 కోట్ల బిజినెస్ చేయడం విశేషం. దీంతో మూవీ హిట్ గా నిలవాలంటే అదే స్థాయిలో వసూళ్లు కూడా చేయాల్సి ఉంది. పవన్ చరిష్మాతో భారీ ఓపెనింగ్స్ ఖాయం.

అయితే తొలి షో నుంచే కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా.. ఆ మార్క్ ను అందుకుంటుందన్న నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. ఇక ఇప్పటికే ప్రైమ్ వీడియో ఈ మూవీ డిజిటల్ హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. అటు 'హరి హర వీరమల్లు' మూవీకి ఇప్పటికే సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. దీంతో ఈ సినిమా ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుందన్న నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe