ఆ రెండు సినిమాల తర్వాత ఇంకేది చేయకూడదనుకున్నా.. పూరి జగన్నాథ్ మూవీపై హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క్లారిటీ

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన లేటెస్ట్ మూవీ భైరవం. ఈ సినిమాలో మంచు మనోజ్, నారా రోహిత్ మరో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మే 30న భైరవం రిలీజ్ కానున్న సందర్భంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్‌తో మూవీపై హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చాడు.

Published on: May 26, 2025 12:20 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన లేటెస్ట్ సినిమా భైరవం. మంచు మనోజ్, నారా రోహిత్ మరో ఇద్దరు హీరోలుగా చేస్తున్నారు. డైరెక్టర్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గాడా సమర్పించారు.

ఆ రెండు సినిమాల తర్వాత ఇంకేది చేయకూడదనుకున్నా.. పూరి జగన్నాథ్ మూవీపై హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క్లారిటీ
ఆ రెండు సినిమాల తర్వాత ఇంకేది చేయకూడదనుకున్నా.. పూరి జగన్నాథ్ మూవీపై హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క్లారిటీ

బిగ్గెస్ట్ రిలీజ్‌కి

భైరవం సినిమా మే 30న ఈ సీజన్‌లో బిగ్గెస్ట్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. అలాగే, పూరీ జగన్నాథ్‌తో మూవీపై బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చాడు.

దాదాపు నాలుగు ఏళ్ల గ్యాప్ వచ్చింది కదా. ఈ గ్యాప్‌లో ఎలాంటి కథల మీద వర్క్ చేశారు?

-హైందవ స్క్రిప్ట్ ఓకే చేసి దాదాపు మూడేళ్లు అవుతుంది. అది నాకు చాలా పాషనేట్ ప్రాజెక్టు. హైందవ, టైసన్ నాయుడు తర్వాత ఇంకేది చేయకూడదు అనుకున్నాను. ఈ ప్రాసెస్‌లో ఉన్నప్పుడు అనుకోకుండా భైరవం, కిస్కిందపురి వచ్చాయి. ఈ రెండు ప్రాజెక్టులు కూడా నన్ను చాలా ఎగ్జైట్ చేశాయి. కిష్కిందపురి చాలా కొత్త జోనర్ సినిమా. ఆడియన్స్‌కి చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది.

ఇప్పటివరకు మీరు చేసిన సినిమాల్లో మీకు ఇష్టమైన జానర్ ఏంటి?

-ప్రతి సినిమాని కూడా ఎంజాయ్ చేస్తూనే చేస్తాను. ప్రతి సినిమాకి నా అటాచ్‌మెంట్ ఒకేలానే ఉంటుంది.

భైరవం టైటిల్ గురించి?

-ఈ సినిమాలో హీరో కొలిచేది కాలభైరవుడ్ని. కథలో నుంచే ఆ టైటిల్ వచ్చింది. ఈ సినిమా కోసం మ్యాసీవ్ టెంపుల్ సెట్ వేసాం. అది చాలా రియల్‌గా వచ్చింది. హ్యాట్సాఫ్ టు ఆర్ డైరెక్టర్ బ్రహ్మ కడలి గారు.

నిర్మాత రాధా మోహన్ గారి గురించి?

-నాకు చాలా ఇష్టమైన ప్రొడ్యూసర్. నన్ను ఫస్ట్ నమ్మిన వ్యక్తి. ఆయనతో రెండు మూడు ప్రాజెక్టులు చేయాలనుకున్నాను. కానీ, కుదరలేదు. ఈ సినిమాతో అన్ని సెట్ అయ్యాయి. చాలా పాషన్‌తో సినిమా నిర్మించే ప్రొడ్యూసర్.

పూరి జగన్నాథ్ గారితో మీరు సినిమా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి ?

-ఒకటి రెండుసార్లు పూరి జగన్నాథ్ గారు, నేను కలిసాము. కచ్చితంగా ప్లాన్ చేస్తాము. డిఫరెంట్ సినిమాలు చేయాలనే ఆలోచన ఉంది. అందుకే భైరవం, టైసన్ నాయుడు, హైందవం కిష్కిందపురి.. దేనికి అవే ప్రత్యేకమైనటువంటి సినిమాలు. ఈ నాలుగు కూడా ఆడియన్స్‌కి కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని ఇవ్వబోతున్నాయి.

News/Entertainment/ఆ రెండు సినిమాల తర్వాత ఇంకేది చేయకూడదనుకున్నా.. పూరి జగన్నాథ్ మూవీపై హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క్లారిటీ
News/Entertainment/ఆ రెండు సినిమాల తర్వాత ఇంకేది చేయకూడదనుకున్నా.. పూరి జగన్నాథ్ మూవీపై హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క్లారిటీ