హీరో రవితేజ ఇంట్లో తీవ్ర విషాదం.. తండ్రి మృతి.. తీర‌ని శోకంలో కుటుంబం.. ఆయ‌న ఏం చేసేవారంటే?

మాస్ మహారాజ్ గా తెలుగు ఆడియన్స్ ప్రేమను సొంతం చేసుకున్న హీరో రవితేజ ఇంట్లో తీవ్ర విషాదం. అతని తండ్రి భూపతి రాజు రాజగోపాల్ కన్నుమూశారు. దీంతో రవితేజ కుటుంబం తీరని శోకంలో మునిగిపోయింది. 

Jul 16, 2025, 08:34:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన రవితేజ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. రవితేజ తండ్రి భూపతి రాజు రాజగోపాల్ మరణించారు. 90 ఏళ్ల ఆయన వయసు సంబంధిత అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. మంగళవారం (జూలై 15) రాత్రి హైదరాబాద్ లోని రవితేజ నివాసంలో భూపతి రాజు చనిపోయారు. కుటుంబానికి పెద్ద దిక్కు తండ్రి చనిపోవడంతో రవితేజ బాధలో మునిగిపోయారు. ఆయన కుటుంబానికి ఇది తీరని లోటు.

తండ్రితో రవితేజ (x)
తండ్రితో రవితేజ (x)

ఏం చేసేవారంటే?

మాస్ మహారాజ్ గా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు హీరో రవితేజ. రవితేజ ఈ స్థాయికి చేరడం వెనుక తండ్రి భూపతి రాజు రాజగోపాల్ ప్రోత్సాహం ఉంది. భుజం తట్టి నడిపించిన తండ్రి ఇప్పుడు కన్నుమూయడంతో రవితేజ తీవ్రంగా బాధపడుతున్నారు. భూపతి రాజు ఒకప్పుడు ఫార్మాసిస్ట్ గా పనిచేసేవారు. వీళ్ల సొంత ఊరు ఏపీలోని జగ్గంపేట. భూపతి రాజుకు ముగ్గురు కొడుకులు. రవితేజ పెద్ద కుమారుడు. భరత్ రెండో కొడుకు. రఘు చిన్న తనయుడు. భరత్ 2017లో రోడ్డు ప్రమాదంలో మరణించారు.

ఇద్దరు ఒకేసారి

రవితేజ రీల్ ఫాదర్, రియల్ ఫాదర్ ఇద్దరూ రెండు రోజుల వ్యవధిలోనే కన్నుమూశారు. రీల్ ఫాదర్ కోట శ్రీనివాస రావు జులై 13న మరణించిన సంగతి తెలిసిందే. ఇడియట్ సినిమాలో తండ్రీకొడుకులుగా కోట శ్రీనివాస రావు, రవితేజ అద్భుతంగా నటించారు. వీళ్ల మధ్య సీన్లు అదిరిపోయాయి. కోట మరణంతో షాక్ కు గురైన రవితేజ.. సోషల్ మీడియా పోస్టు ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. ఇప్పుడు రియల్ ఫాదర్ భూపతి రాజు జులై 15న రాత్రి కన్నుమూశారు.

కష్టంతో ఎదిగాడు.

సినిమా హీరోగా రవితేజ తన కష్టంతో ఎదిగాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా టాలెంట్ తో ఈ స్థాయికి చేరుకున్నారు. 1997లో సింధూరం సినిమాలో సెకండ్ హీరోగా చేశాడు. 1999లో శ్రీను వైట్ల డైరెక్షన్ లో నీకోసం మూవీతో హీరోగా మారాడు రవితేజ. అక్కడి నుంచి వెనుతిరిగి చూసుకోలేదు. ఇడియట్ హిట్ తో టాప్ లోకి దూసుకెళ్లాడు.

చివరగా ఈగల్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు రవితేజ. అయితే ఇటీవల రవితేజకు ఒక్క హిట్ కూడా పడలేదు. టైగర్ నాగేశ్వర రావు, ఈగల్, మిస్టర్ బచ్చన్.. ఇలా వరుసగా ఫ్లాప్ లే పలకరించాయి. ఇప్పుడు మాస్ జాతర సినిమా చేస్తున్నాడు. దీనిపై రవితేజ భారీ ఆశలే పెట్టుకున్నాడు. 2023లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవితో కలిసి రవితేజ నటించిన సంగతి తెలిసిందే.