Janhvi Kapoor: నిన్ను ప్రతిరోజూ మిస్ అవుతుంటా.. ఐ లవ్ యూ మార్సీ: హెయిర్ స్టైలిస్ట్ మృతిపై జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
Janhvi Kapoor: జాన్వీ కపూర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతోంది. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ మార్సే పెడ్రోజో అకాల మరణంతో ఆమె చాలా బాధపడుతోంది. ప్రతిరోజూ మిస్ అవుతుంటానంటూ ఇన్స్టాలో ఓ పోస్ట్ చేసింది.
హెయిర్ స్టైలిస్ట్ మార్సే పెడ్రోజో అకాల మరణం బాలీవుడ్ తారలను షాక్కు గురిచేసింది. వరుణ్ ధావన్ నుండి నోరా ఫతేహి వరకు చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని తెలియజేశారు. సోమవారం (మార్చి 16) నాడు నటి జాన్వీ కపూర్ ఆ యువ హెయిర్ స్టైలిస్ట్తో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆమె చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతోంది.

జాన్వీ కపూర్ పోస్ట్ లో ఏముందంటే?
ఈవెంట్స్ బ్యాక్స్టేజ్లో మార్సే తన జుట్టును స్టైల్ చేస్తున్నప్పుడు దిగిన ఫోటోలను జాన్వీ కపూర్ ఈ పోస్టులో పంచుకుంది. ఆమె తన నోట్లో ఇలా రాసింది..
"ఐ లవ్ యు మార్సీ. నేను వ్యాన్లోకి వెళ్ళిన ప్రతిసారీ మనం ఒకరినొకరం చూసుకుంటూ 'మన దగ్గర ఇంకా 20 నిమిషాలే ఉంది చలో చలో చలో' అని అరుచుకునే వాళ్లం. ఆ అసాధ్యమైన టాస్కులు, పిచ్చి పని వేళలు, ఆ గందరగోళం మధ్య మనం నవ్వుకునే వాళ్లం. కానీ వీటన్నింటి మధ్య మనం కలిసి పనిచేసిన ప్రతిసారీ మన మధ్య ఒక తెలియని నమ్మకం, సంతోషం ఉండేవి." అని జాన్వీ చెప్పింది.
ఒకరికొకరం ఒక టీమ్
జాన్వీ ఈ పోస్టును ఇంకా కొనసాగిస్తూ.. “నువ్వు కేవలం నా టీమ్లో ఒకడివి కాదు. మనం ఒకరికొకరం ఒక టీమ్. ఇది నిజం. ఒకరిపై ఒకరికి ఉన్న ఆ చొరవ వల్ల నన్ను ఎవరో చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారనే ఫీలింగ్ కలిగేది. నువ్వు నా మనిషివి. నీతో ఇంకో 20 నిమిషాలు గడిపే అవకాశం వస్తే.. మా అందరి జీవితాల్లో నువ్వు ఎంతటి వెలుగు నింపావో చెప్పేదాన్ని. నీ మనసు, నీ ఆత్మ ఎప్పటికీ అందమైనవే. నువ్వు ఒక గొప్ప కళాకారుడివి. చాలా స్వచ్ఛమైన వ్యక్తివి. నీకు, మనకు ఎన్నో ప్లాన్స్ ఉన్నాయని నాకు తెలుసు. నువ్వు కేవలం నాకు ఒక సేఫ్ ప్లేస్ మాత్రమే కాదు, నీ ఆప్యాయత మా అందరి జీవితాల్లో ఎన్నో రంగులు నింపింది. ఐ లవ్ యు మార్సీ. నిన్ను ప్రతిరోజూ మిస్ అవుతాను. గత కొన్ని ఏళ్లుగా నా ప్రతి క్రియేటివ్ జర్నీ మొదట్లో, చివర్లో నీ ముఖాన్ని చూడటం నా లైఫ్లో దక్కిన అతిపెద్ద గౌరవం" అని చెప్పింది.
అందరూ మిస్ అవుతున్నారు
ఆమె చివరగా ఇలా రాసింది. "నువ్వు ఎక్కడున్నా చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరీ కారంగా లేని, మరీ పుల్లగా లేని భోజనం తింటూ ఉండు. అరటిపండు పరోటాలు చాలా తిను! నీ జుట్టుకు రకరకాల పిచ్చి రంగులు వేసుకుంటూ, నీ మనసు లాగే మెరిసిపోయే అందమైన ఆర్ట్ను సృష్టిస్తూ ఉండు. ఈరోజు నిన్ను అందరూ ఎంతలా మిస్ అవుతున్నారో, వాళ్ల జీవితాల్లో నీకు ఎంత ప్రాముఖ్యత ఉందో, నిన్ను సెలబ్రేట్ చేసుకోవాలని ప్రతి ఒక్కరు ఎంతలా కోరుకుంటున్నారో నువ్వు చూడాల్సింది. నీతో ఉన్న ప్రతి జ్ఞాపకాన్ని గుండెల్లో దాచుకుంటాను. ఐ లవ్ యు, నిన్ను చాలా మిస్ అవుతున్నాను…” అని జాన్వీ రాసుకొచ్చింది.
సెలబ్రిటీల సంతాపం
మరోవైపు వరుణ్ ధావన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో "రెస్ట్ ఇన్ పీస్ బడ్డీ. నమ్మలేకపోతున్నాను. ఇప్పుడే మనం షూటింగ్ చేసినట్టు అనిపిస్తోంది. అందరికీ ఇష్టమైన వ్యక్తి, చాలా మంచి మనిషి" అని రాశాడు.
నోరా ఫతేహి కూడా తన ‘ప్రాణ స్నేహితుడి’ మృతికి చింతిస్తూ ఇలా రాసింది. "ఈరోజు నేను ఒక మంచి స్నేహితుడిని, సోదరుడిని, నమ్మకస్తుడిని కోల్పోయాను.. నా జర్నీ మొదలైన మొదటి రోజు నుండి అతను నాతోనే ఉన్నాడు! మీరందరూ మా రిలేషన్ చూశారు! నాలోని బెస్ట్ సైడ్ను అతను బయటకు తీసేవాడు! అతను నాతో ఉన్న ప్రతిసారీ నేను నవ్వుతూనే ఉండేదాన్ని! మేం అన్నీ కలిసే చేసేవాళ్లం" అని నోరా చెప్పింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


