...
...
Next Story

Bhairava Anthem Lyrics: భైరవ ఆంథెమ్ లిరిక్స్ ఇవే.. దేశాన్ని ఊపేస్తున్న కల్కి 2898 ఏడీ ఫస్ట్ సింగిల్ మీరూ పాడుకోండి

Bhairava Anthem Lyrics: కల్కి 2898 ఏడీ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ భైరవ ఆంథెమ్ దేశాన్ని ఊపేస్తోంది. తెలుగు, పంజాబీ మిక్స్ చేసి చేసిన ఈ సాంగ్ మ్యూజిక్, లిరిక్స్ అదిరిపోయాయి.

Published on: Jun 18, 2024, 11:04:03 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

Bhairava Anthem Lyrics: ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీలోని భైరవ ఆంథెమ్ సోమవారం (జూన్ 17) రిలీజైన విషయం తెలుసు కదా. 2 నిమిషాల 45 సెకన్ల నిడివి ఉన్న ఈ పాట అదిరిపోయింది. సంతోష్ నారాయణన్ మ్యూజిక్, రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ ప్రతి ఒక్కరికీ తెగ నచ్చేసింది. ఈ సాంగ్ లో ప్రముఖ పంజాబీ సింగర్ దిల్జిత్ దోసాంజ్ తో కలిసి ప్రభాస్ తొడకొడుతూ వేసి స్టెప్పులు కూడా బాగున్నాయి.

భైరవ ఆంథెమ్

భైరవ ఆంథెమ్ లిరిక్స్ ఇవే.. దేశాన్ని ఊపేస్తున్న కల్కి 2898 ఏడీ ఫస్ట్ సింగిల్
భైరవ ఆంథెమ్ లిరిక్స్ ఇవే.. దేశాన్ని ఊపేస్తున్న కల్కి 2898 ఏడీ ఫస్ట్ సింగిల్

కల్కి 2898 ఏడీ మూవీ నుంచి భైరవ ఆంథెమ్ అంటూ ఈ ఫస్ట్ సాంగ్ వచ్చింది. తెలుగుతోపాటు మిగిలిన ఐదు భాషల్లోనూ సాంగ్ రిలీజ్ చేశారు. అయితే ఆరు భాషల్లోనూ పంజాబీ లిరిక్స్ అలాగే ఉంచి.. ఆయా స్థానిక భాషల లిరిక్స్ మాత్రం మార్చారు. తెలుగులో లిరిక్స్ ను రామజోగయ్య శాస్త్రి అందించాడు. భైరవ వ్యక్తిత్వాన్ని చాటుతూ సాగిపోయే పాట ఇది. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతోందో ఈ పాట ద్వారానే మేకర్స్ చెప్పారు.

భైరవ ఆంథెమ్ లిరిక్స్

ఒక నేనే.. నాకు చుట్టూ నేనే..

ఒకటైనా.. ఒంటరోన్ని కానే..

స్వార్థము నేనే.. పరమార్థము నేనే..

<పంజాబీ లిరిక్స్>

ఓ పంజాబీ ఆగయే ఓయ్

మేరీ మిజాజాన్ అఖియా

మానె నా గల్ దీత్ హై పక్కియా

వె రోహబ్ వేఖో జట్ దా వే

కదే నీ పీచే హట్దా వే మేరే మాహియా

యే దిన్ రాత్ కర్దా తారక్కియా

కే దిన్ రాత్ కర్దా తారక్కియా

కే రోహబ్ వేఖో జట్ దా వే మేరే మాహియా

కడే నీ పిచ్చె హట్దా వే మేరే మాహియా

<పంజాబీ లిరిక్స్>

ముసుగున మనుషుల రంగులు చూశా..

నేనా నువ్వా అంటే నాకు ముఖ్యం నేనంటా..

గెలుపు జెండాలే నా దారంటా..

మనసు ఉన్నాగానీ లేదంటా..

మెదడు మాటే నే వింటా..

మాయదారి లోకంలో.. ఇంతే ఇంతే నేనంటా..

నాకు నేనే కర్త కర్మ క్రియ..

ఒక్క నేనే వేల సైన్యమయ్యా..

నా గమనం.. నిత్య రణం..

కణకణకణం.. అనుచరగణం..

<పంజాబీ లిరిక్స్>

వె సారా జగ్ కర్దా యే తగ్గియా

నిగాహా సదె పిచ్చె క్యు హై లగియా

వె సారా జగ్ కర్దా యే తగ్గియా

నిగాహా సదె పిచ్చె క్యూ హై లగియా

మేరీ మిజాజాన్ అఖియా

మానె నా గల్ దీత్ హై పక్కియా

వె రోహబ్ వేఖో జట్ దా వే

కదే నీ పీచే హట్దా వే మేరే మాహియా

యే దిన్ రాత్ కర్దా తారక్కియా

కే దిన్ రాత్ కర్దా తారక్కియా

కే రోహబ్ వేఖో జట్ దా వే మేరే మాహియా

కడే నీ పిచ్చె హట్దా వే మేరే మాహియా

<పంజాబీ లిరిక్స్>

సాహస మంత్రమే నా జవజీవము..

సమయము చూడని సమరమిది..

సాయుధ యంత్రమే లోహపు దేహము..

నా కథ ఏ విధి గెలవనిది..

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe