ఇలాంటివి ఎన్నో చూశాను.. తప్పు చేస్తేనే క్షమాపణ అడుగుతాను: కన్నడ వివాదంపై కమల్ హాసన్
కమల్ హాసన్ వెనక్కి తగ్గడం లేదు. కన్నడ భాషా వివాదంపై క్షమాపణ చెప్పడానికి అతడు నిరాకరిస్తున్నాడు. ఇలాంటివి ఎన్నో చూశానని, తాను తప్పు చేస్తేనే క్షమాపణ అడుగుతానని స్పష్టం చేశాడు.
తాను నటించిన థగ్ లైఫ్ మూవీని నిషేధిస్తామని బెదిరిస్తున్నా.. కమల్ హాసన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అతడు క్షమాపణ చెప్పడానికి శుక్రవారం (మే 30) వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. అయినా కమల్ మాత్రం అందుకు నిరాకరిస్తూనే ఉన్నాడు.

తప్పు చేయలేదు
కన్నడ భాష పుట్టిందే తమిళం నుంచి అని కామెంట్స్ చేసిన కమల్ హాసన్ పై కన్నడ సంఘాలు మండిపడుతూనే ఉన్నాయి. అతని సినిమాలను నిషేధించాలని సాక్షాత్తూ ఆ రాష్ట్ర మంత్రి శివరాజ్ తంగదగియే కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు లేఖ రాయడం గమనార్హం. ఈ నేపథ్యంలో థగ్ లైఫ్ సినిమాను తాము నిషేధిస్తామని ఛాంబర్ వార్నింగ్ ఇచ్చింది.
దీనిపై తాజాగా కమల్ హాసన్ మరోసారి స్పందించాడు. “ఇది ప్రజాస్వామ్యం. నేను చట్టం, న్యాయాన్ని విశ్వసిస్తాను. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళపై నా ప్రేమ నిజం. ఏదో ఎజెండా ఉన్న వాళ్లే దానిని శంకిస్తారు. ఇలాంటి బెదిరింపులు గతంలో ఎన్నో చూశాను. నేను తప్పు చేస్తే క్షమాపణ చెబుతాను. చేయకపోతే చెప్పను” అని కమల్ స్పష్టం చేశాడు.
దీనిపై కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, కన్నడ సంఘాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. జూన్ 5వ తేదీనే థగ్ లైఫ్ రిలీజ్ కానున్న నేపథ్యంలో వాళ్లు చెప్పినట్లుగా ఆ సినిమాను నిషేధిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ నిషేధిస్తే మాత్రం కమల్ పాన్ ఇండియా మూవీకి పెద్ద దెబ్బ పడినట్లే అని చెప్పొచ్చు.
థగ్ లైఫ్ మూవీ గురించి..
మణిరత్నం డైరెక్షన్ లో 37 ఏళ్ల తర్వాత కమల్ హాసన్ నటించిన మూవీ ఈ థగ్ లైఫ్. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగానే కన్నడ భాష గురించి కమల్ స్పందించాడు.
అసలు తమిళం నుంచే కన్నడ పుట్టిందని అతడు అనడంతో కన్నడ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అప్పటి నుంచే కమల్ సినిమాలను నిషేధించాలన్న డిమాండ్లు మొదలయ్యాయి. రోజురోజుకూ వివాదం ముదురుతున్నా.. కమల్ మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో ఇది ఎంత వరకూ వెళ్తుందో చూడాలి.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper



