రజనీకాంత్ హీరో.. కమల్ హాసన్ ప్రొడ్యూసర్.. తలైవా 173 అనౌన్స్మెంట్.. రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు
కమల్ హాసన్ ప్రొడ్యూసర్ గా రజనీకాంత్ నెక్ట్స్ మూవీ రాబోతోంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ బుధవారం (నవంబర్ 5) వచ్చేసింది. కమల్ హాసన్ తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ విషయం వెల్లడించాడు. పొంగల్ 2027 సందర్భంగా మూవీ రిలీజ్ కానుంది.
ఇద్దరు తమిళ సూపర్ స్టార్లు మళ్లీ చేతులు కలిపారు. అయితే ఇద్దరూ తెరపైన కలిసి కనిపించడం లేదు. కమల్ హాసన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. రజనీకాంత్ లీడ్ రోల్లో నటించబోతున్నాడు. తలైవా 173 మూవీ అనౌన్స్మెంట్ బుధవారం (నవంబర్ 5) జరిగింది. కమల్ ఏం ట్వీట్ చేశాడో చూడండి.

రజనీకాంత్ హీరో, కమల్ హాసన్ ప్రొడ్యూసర్
ఓ సూపర్ స్టార్ హీరోగా, మరో సూపర్ స్టార్ ప్రొడ్యూసర్ గా సినిమా వస్తుండటం ఎంతో ఆసక్తి రేపుతోంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న కాంబినేషన్ రానే వచ్చింది. స్క్రీన్ పై రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటించనున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ ఇద్దరూ చేతులు కలిపినా.. ఒకరు హీరో, మరొకరు ప్రొడ్యూసర్ అని మాత్రం ఊహించలేదు. ఈ విషయాన్ని కమల్ హాసన్ బుధవారం (నవంబర్ 5) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు. అంతేకాదు ఈ సినిమా 2027 పొంగల్ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు చెప్పాడు.
“గాలిలా, వర్షంలా, నదిలా.. వర్షంలా కురుద్దాం.. ఎంజాయ్ చేద్దాం.. జీవిద్దాం.. రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ లో సుందర్ సి డైరెక్షన్ లో నా డియర్ ఫ్రెండ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్నాడు. తలైవా173, పొంగల్ 2027” అనే క్యాప్షన్ తో కమల్ ట్వీట్ చేశాడు.
28 ఏళ్ల తర్వాత మళ్లీ..
రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషనే కాదు ఈ సినిమా ద్వారా మరో కాంబినేషన్ కూడా 28 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అది రజనీకాంత్, డైరెక్టర్ సుందర్ చేతులు కలపడం. ఈ ఇద్దరూ చివరిగా 1997లో వచ్చిన అరుణాచలం మూవీ చేశారు. ఇప్పుడు 28 ఏళ్ల తర్వాత మరోసారి ఈ తలైవా 173 కోసం ఒక్కటయ్యారు. అంతేకాదు ఈ సినిమా ద్వారా రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ తన 44వ వార్షికోత్సవం జరుపుకుంటోంది.
ఈ మూవీ అనౌన్స్మెంట్ సందర్భంగా కమల్ హాసన్, రజనీకాంత్ చేతులు కలిపిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఇద్దరూ కలిసి తెరపై కనిపించనున్నారన్న వార్తల నేపథ్యంలో అది జరగకపోవడం కాస్త నిరాశకు గురి చేసింది. అయితే ఈ ఇద్దరూ మరో సినిమా కోసం పని చేయనున్నారని, దీనికి డైరెక్టర్ ఫైనల్ కావాల్సి ఉందని కూడా వార్తలు వచ్చాయి. గతంలో రజనీకాంత్ కూడా ఇదే విషయం చెప్పాడు. ఆ మూవీ అనౌన్స్మెంట్ కోసం ఇప్పుడు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


