హీరో కావాల్సిన వాడు హీరోయిన్ అయితే.. ఓటీటీలోకి కన్నడ కామెడీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఐఎండీబీలో 9.9 రేటింగ్

కన్నడ కామెడీ మూవీ ఒకటి ఓటీటీలోకి వస్తోంది. థియేటర్లలో రిలీజైన ఐదు నెలల తర్వాత ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కానుండటం విశేషం. తెలుగులోనూ స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సినిమాకు ఐఎండీబీలో 9.9 రేటింగ్ ఉండటం విశేషం.

Published on: Jul 1, 2025, 17:38:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈ ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజైన కన్నడ కామెడీ మూవీ మిస్టర్ రాణి (Mr Rani) ఇప్పుడు తెలుగులోనూ ఓటీటీలోకి వస్తోంది. ఐదు నెలల తర్వాత ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కాబోతోంది. హీరో కావాలనుకున్న వాడు హీరోయిన్ అయితే ఎలా ఉంటుందన్న వెరైటీ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి.

హీరో కావాల్సిన వాడు హీరోయిన్ అయితే.. ఓటీటీలోకి కన్నడ కామెడీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఐఎండీబీలో 9.9 రేటింగ్
హీరో కావాల్సిన వాడు హీరోయిన్ అయితే.. ఓటీటీలోకి కన్నడ కామెడీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఐఎండీబీలో 9.9 రేటింగ్

మిస్టర్ రాణి ఓటీటీ రిలీజ్ డేట్

మిస్టర్ రాణి ఓ కన్నడ కామెడీ మూవీ. ఈ ఏడాది ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపకపోయినా.. ప్రేక్షకులను మాత్రం బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడీ సినిమాను జులై 11 నుంచి లయన్స్‌గేట్ ప్లే (Lionsgate Play) ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతోంది.

ఒరిజినల్ కన్నడ ఆడియోతోపాటు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ చేయనుండటం విశేషం. ఈ సినిమాకు ఐఎండీబీలో 9.9 రేటింగ్ ఉంది. చాలా మంది ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు.

మిస్టర్ రాణి మూవీ గురించి..

మిస్టర్ రాణి మూవీని మధు చంద్ర డైరెక్ట్ చేశాడు. అంతేకాదు ఈ సినిమాలో డైరెక్టర్ కాకా అనే పాత్ర కూడా పోషించాడు. ఇక దీపక్ సుబ్రమణ్య, పార్వతీ నాయర్, లక్ష్మీ కారంత్, శ్రీవత్స శ్యామ్ లాంటి వాళ్లు నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా రాజా అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. అతడు సినిమాల్లో పెద్ద హీరో కావాలని కలలు కంటాడు.

కానీ అతని పేరెంట్స్ మాత్రం ఇంజినీరింగ్ చేయాలని పట్టుబడతారు. రాజా ఎలాగోలా సినిమాల్లోకి వెళ్లినా.. అతనికి హీరో కాకుండా హీరోయిన్ ఛాన్స్ వస్తుంది. అదే క్రమంలో అతడు ఇండస్ట్రీలోనే నంబర్ వన్ హీరోయిన్ స్థాయికి ఎదుగుతాడు. రాజా ఇలా మిస్టర్ రాణిగా మారి, ఆ క్రేజ్ నిలుపుకునే క్రమంలో వచ్చే సీన్లు ప్రేక్షకులను తెగ నవ్విస్తాయి.

ఐఎండీబీలో క్రేజీ రేటింగ్

ఈ మిస్టర్ రాణి సినిమాకు ఐఎండీబీలో క్రేజీ రేటింగ్ ఉంది. ఏకంగా 9.9 రేటింగ్ రావడం విశేషం. చాలా మంది ప్రేక్షకులు ఈ సినిమాకు 10, 9 రేటింగ్స్ ఇచ్చారు. ఓ మస్ట్ వాచ్ కామెడీ మూవీ అని కామెంట్స్ చేశారు. ఓ భిన్నమైన, ఫ్రెష్ కాన్సెప్ట్ తో వచ్చి తెగ నవ్వించారని ఓ వ్యక్తి రివ్యూ ఇచ్చారు.

అద్భుతమైన టెక్నాలజీ, మేకప్, టాలెంట్ కలగలిపి రాణి పాత్ర నిజమనేలా చేసిన తీరు చాలా బాగుందని మరో వ్యక్తి అన్నారు. ఈ మిస్టర్ రాణి మూవీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేదు. ఇప్పుడు జులై 11 నుంచి లయన్స్‌గేట్ ప్లేలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు సహా ఇతర భాషల్లోనూ రానుండటంతో ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More