కన్నప్ప ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా.. ఘోర విమాన ప్రమాదం నేపథ్యంలో మంచు విష్ణు నిర్ణయం.. ఒక రోజు ఆలస్యంగా ట్రైలర్
కన్నప్ప ప్రీరిలీజ్ ఈవెంట్ ను రద్దు చేశాడు మంచు విష్ణు. అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం కూలిన నేపథ్యంలో అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఈవెంట్ శుక్రవారం (జూన్ 13) ఇండోర్ లో జరగాల్సి ఉంది.
మంచు విష్ణు తొలి పాన్ ఇండియా మూవీ కన్నప్ప ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం (జూన్ 12) తన ఎక్స్ అకౌంట్ ద్వారా మంచు విష్ణు వెల్లడించాడు. దీంతో ఒక రోజు ఆలస్యంగా ఈ మూవీ ట్రైలర్ రానుంది.

కన్నప్ప ప్రీరిలీజ్ ఈవెంట్
కన్నప్ప మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ శుక్రవారం (జూన్ 13) ఇండోర్ లో జరగాల్సి ఉంది. అయితే ఈ పెను విషాదం నేపథ్యంలో ఈ ఈవెంట్ వాయిదా పడింది. ఈ విషయాన్ని విష్ణు తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు.
“అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసి నా గుండె పగిలింది. ఈ విషాదం నేపథ్యంలో రేపు ఇండోర్లో జరగాల్సిన ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా వేస్తున్నాం. ఒక రోజు ఆలస్యంగా కన్నప్ప ట్రైలర్ రానుంది. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి” అని విష్ణు ట్వీట్ చేశాడు.
కన్నప్ప మూవీ గురించి..
మంచు విష్ణు లీడ్ రోల్లో నటించిన మూవీ కన్నప్ప. ఈ సినిమా జూన్ 27న రిలీజ్ కానుంది. ఈ సినిమాను ముకేశ్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో విష్ణుతోపాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, ముకేశ్ రుషి లాంటి వాళ్లు నటించారు. ఈ సినిమా రిలీజ్ ఇప్పటికే ఒకసారి వాయిదా పడింది. ఈ భారీ బడ్జెట్ మూవీపై విష్ణు భారీ ఆశలే పెట్టుకున్నాడు.
ఈ మూవీ ట్రైలర్ ను జూన్ 13న రిలీజ్ చేయనున్నట్లు రెండు రోజుల కిందట మంచు విష్ణు వెల్లడించాడు. అయితే విమాన ప్రమాదం నేపథ్యంలో అర్ధంతరంగా ఈ ఈవెంట్ వాయిదా పడింది. శనివారం (జూన్ 14) కన్నప్ప ట్రైలర్ రానుంది. అదే రోజు ప్రీరిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. జూన్ 27న తెలుగుతోపాటు వివిధ భాషల్లో కన్నప్ప మూవీ రిలీజ్ కాబోతోంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper



