కార్తీక దీపం 2 సీరియల్ టీఆర్పీ.. మళ్లీ భారీగా పెరిగిన రేటింగ్.. అర్బన్లో నంబర్ వన్ గుండె నిండా గుడి గంటలు
తెలుగు టీవీ సీరియల్స్ 40వ వారం టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. కార్తీక దీపం 2 సీరియల్ రేటింగ్ మరోసారి భారీగా పెరగగా.. అర్బన్ మార్కెట్ లో గుండె నిండా గుడి గంటలు దూసుకెళ్తోంది. కార్తీక దీపం 2తో కలిసి తొలి స్థానంలో ఉండటం విశేషం.
కార్తీక దీపం 2 సీరియల్ సత్తా చాటుతోంది. తాజాగా 40వ వారం టీఆర్పీ రేటింగ్స్ లోనూ ఆ సీరియల్ టాప్ లో ఉండటమే కాదు.. తన రేటింగ్ కూడా భారీగా పెంచుకుంది. గత కొన్ని వారాలు తగ్గుతూ రాగా.. ఈవారం ఒక్కసారిగా పెరగడం విశేషం. మరో సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు కూడా తన రేటింగ్ మెరుగుపరచుకుంది.

స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ విషయంలో మరోసారి సత్తా చాటాయి. టాప్ 10లో మొదటి ఆరు స్థానాల్లో ఆ ఛానెల్ సీరియల్సే ఉన్నాయి. తాజాగా 40వ వారం రేటింగ్స్ రాగా.. అందులో తొలి స్థానంలో కార్తీక దీపం 2 నిలిచింది. ఈ సీరియల్ కు 14.83 రేటింగ్ నమోదు కావడం విశేషం. గత వారం కంటే చాలా మెరుగైన రేటింగ్ సాధించింది. ఇక రెండో స్థానంలో ఉన్న ఇల్లు ఇల్లాలు పిల్లలు కూడా 14.02 రేటింగ్ సాధించడం విశేషం.
అర్బన్లో టాప్ గుండె నిండా గుడి గంటలు
ఇక మూడో స్థానంలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఉంది. ఈ సీరియల్ కు అర్బన్, రూరల్ కలిపి 12.82 రేటింగ్ వచ్చింది. అయితే కేవలం అర్బన్ చూస్తే 11.87 రేటింగ్ తో టాప్ లో ఉంది. అటు కార్తీక దీపం 2కి కూడా ఇదే రేటింగ్ నమోదైంది. ఇక నాలుగో స్థానంలోకి ఇంటింటి రామాయణం తిరిగి వచ్చింది. ఆ సీరియల్ కు 12.38 రేటింగ్ నమోదు కాగా.. ఐదో స్థానంలో ఉన్న చిన్ని సీరియల్ కు 11.42 రేటింగ్ వచ్చింది. ఆరో స్థానంలో నిండు మనసులు ఉంది. ఈ సీరియల్ కు 7.98 రేటింగ్ నమోదైంది.
జీ తెలుగు సీరియల్స్ రేటింగ్స్ ఇలా..
ఇక జీ తెలుగు సీరియల్స్ విషయానికి వస్తే టాప్ 10లో చివరి నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఆ ఛానెల్ కు చెందిన మేఘసందేశం సీరియల్ 7.71 రేటింగ్ తో ఏడో స్థానంలో నిలిచింది. జీ తెలుగులో నంబర్ వన్ మాత్రం ఆ సీరియలే. ఇక ఎనిమిదో స్థానంలో చామంతి సీరియల్ 6.90 రేటింగ్ తో ఉంది. 9వ స్థానంలో లక్ష్మీ నివాసం నిలిచింది. ఈ సీరియల్ కు 6.88 రేటింగ్ వచ్చింది. 10వ స్థానంలో జగద్ధాత్రి సీరియల్ 6.78 రేటింగ్ తో ఉంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


