Michael OTT: 7,000 కోట్ల కలెక్షన్స్.. మైఖేల్ జాక్సన్ బయోపిక్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇండియాలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Michael OTT: ‘కింగ్ ఆఫ్ పాప్’ మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక హాలీవుడ్ బయోపిక్ 'మైఖేల్' (Michael) డిజిటల్ ప్రీమియర్‌కు రెడీ అయింది. భారీ వసూళ్లతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. జూన్ 9 నుంచి ఇండియాలో బుక్‌మైషో స్ట్రీమ్ వేదికగా అందుబాటులోకి రానుంది.

Published on: Jun 2, 2026, 21:21:34 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Michael OTT: సంగీత ప్రపంచాన్ని తన డ్యాన్స్, పాటలతో దశాబ్దాల పాటు ఊపేసిన లెజెండరీ పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ బయోపిక్‌గా 'మైఖేల్' సినిమా తెరకెక్కింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో థియేటర్లలో రిలీజైన ఈ హై-ప్రొఫైల్ మూవీకి వరల్డ్ ప్రీమియర్ టైమ్‌లో క్రిటిక్స్ నుంచి కాస్త నెగెటివ్ రివ్యూలు వచ్చినా.. సాధారణ ప్రేక్షకులు, మైఖేల్ ఫ్యాన్స్ మాత్రం బ్రహ్మరథం పట్టారు.

Michael OTT: 7,000 కోట్ల కలెక్షన్స్.. మైఖేల్ జాక్సన్ బయోపిక్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇండియాలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Michael OTT: 7,000 కోట్ల కలెక్షన్స్.. మైఖేల్ జాక్సన్ బయోపిక్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇండియాలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఆడియన్స్ ఇచ్చిన భారీ సపోర్ట్‌తో ఈ మైఖేల్ మూవీ వరల్డ్ వైడ్ గా రికార్డు స్థాయిలో దాదాపు 850 మిలియన్ డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ. 7,100 కోట్లు) కలెక్ట్ చేసి గ్లోబల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

Michael OTT Release: ఇండియా ఓటీటీ రిలీజ్ వివరాలు

థియేటర్లలో భారీ హిట్‌గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు ఇండియన్ డిజిటల్ ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమైంది. జూన్ 9 నుండి ఈ సినిమా బుక్‌మైషో స్ట్రీమ్ (BookMyShow Stream)లో డిజిటల్ ప్రీమియర్ కానుందని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

ఈ సినిమాను ఇండియాలో ఒరిజినల్ ఇంగ్లీష్‌తో పాటు హిందీ భాషలోనూ చూడొచ్చు. అయితే మొదట్లో ఈ సినిమా కేవలం 'రెంటల్' పద్ధతిలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. బుక్‌మైషో స్ట్రీమ్‌తో పాటు.. అదే రోజున అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), ఆపిల్ టీవీ (Apple TV) ప్లాట్‌ఫామ్స్ లో కూడా రెంటల్ బేసిస్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.

Jaafar Jackson Michael: జాఫర్ జాక్సన్ అద్భుత నటన

ఈ బయోపిక్‌లో మైఖేల్ జాక్సన్ పాత్రలో ఆయన సొంత మేనల్లుడు జాఫర్ జాక్సన్ (Jaafar Jackson) నటించడం విశేషం. మైఖేల్ బాడీ లాంగ్వేజ్, సిగ్నేచర్ డ్యాన్స్ మూమెంట్స్‌ను ఆయన అద్భుతంగా పండించి ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేశారు. ఈ సినిమాలో నియా లాంగ్, జూలియానో వాల్డి కీ రోల్స్ ప్లే చేయగా, లియోర్ రోస్నర్ అందించిన మ్యూజిక్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది.

మైఖేల్ మూవీని ఆంటోయిన్ ఫుక్వా డైరెక్ట్ చేశాడు. ఇక మ్యూజిక్ ను లియోర్ రోస్నర్ అందించాడు. సబ్‌స్క్రిప్షన్ బేసిస్‌పై ఈ మూవీ ఫ్రీగా ఏ ఓటీటీలోకి, ఎప్పుడు వస్తుందనే దానిపై మేకర్స్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు.

హెచ్‌టీ విశ్లేషణ

గ్లోబల్ ఫిగర్స్ బయోపిక్స్ కు ఓటీటీలో ఎప్పుడూ మంచి వ్యూయర్‌షిప్ ఉంటుంది. మైఖేల్ జాక్సన్ లాంటి లెజెండ్ లైఫ్ స్టోరీ కాబట్టి థియేటర్లలో మిస్ అయిన ఇండియన్ ఆడియన్స్ ఈ సినిమాను ఓటీటీలో చూడటానికి చాలా ఆసక్తి చూపిస్తారు. ఇంగ్లీష్ తో పాటు హిందీ డబ్బింగ్ ఆప్షన్ ఉండటం పెద్ద ప్లస్ పాయింట్. ఇది రెంటల్ పద్ధతి కాబట్టి ఓపెనింగ్ వీకెండ్ లో బుక్‌మైషో స్ట్రీమ్ కు భారీ రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది.

People Also Ask (FAQs)

'మైఖేల్' సినిమా ఇండియాలో ఏ ఓటీటీలో రిలీజ్ కానుంది?

ఈ మూవీ జూన్ 9, 2026 నుండి బుక్‌మైషో స్ట్రీమ్ (BMS Stream) లో అందుబాటులోకి రానుంది. అలాగే అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీల్లోనూ రెంటుకు వచ్చే అవకాశం ఉంది.

మైఖేల్ సినిమా ఫ్రీగా చూడొచ్చా లేదా డబ్బులు కట్టాలా?

మొదట్లో ఈ సినిమా కేవలం రెంటల్ (Rental) పద్ధతిలో మాత్రమే లభిస్తుంది. అంటే సినిమా చూడటానికి సబ్‌స్క్రిప్షన్ తో పాటు విడిగా అద్దె చెల్లించాల్సి ఉంటుంది.

మైఖేల్ చిత్రం ఏయే భాషల్లో స్ట్రీమింగ్ కానుంది?

బుక్‌మైషో స్ట్రీమ్‌లో ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ ఇంగ్లీష్ తో పాటు హిందీ డబ్బింగ్ వెర్షన్‌లో కూడా ఆడియన్స్ కి అందుబాటులో ఉంటుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More