కుబేర బాక్సాఫీస్.. తొలి రోజే దుమ్ముదులిపిన ధనుష్, నాగార్జున, రష్మిక మూవీ.. పాజిటివ్ రివ్యూలతో ఫస్ట్ వీకెండ్ మరింతగా..
శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన కుబేర మూవీ తొలి రోజే బాక్సాఫీస్ దుమ్ముదులిపినట్లు ముందస్తు అంచనాలు చెబుతున్నాయి. నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా నటించిన ఈ పాన్ ఇండియా మూవీకి పాజిటివ్ రివ్యూలు రావడంతో ఫస్ట్ వీకెండ్ వసూళ్లు మరింత భారీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భారీ అంచనాల మధ్య రిలీజైన కుబేర మూవీ ఊహించినట్లే బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. ఈ పాన్ ఇండియా మూవీ తొలి రోజే రూ.19 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ముందస్తు అంచనాలు చెబుతున్నాయి. ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు రావడంతో శని, ఆదివారాల్లో మరిన్ని భారీ వసూళ్లు ఖాయంగా కనిపిస్తున్నాయి.

కుబేర తొలి రోజు బాక్సాఫీస్ వసూళ్లు
శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా నటించిన మూవీ కుబేర. తెలుగుతోపాటు ఇతర సౌత్ భాషలు, హిందీలోనూ రిలీజైన ఈ సినిమాకు ఊహించినట్లే తొలి రోజే భారీ వసూళ్లు వచ్చాయి. ట్రేడ్ అనలిస్టుల ముందస్తు అంచనాల మేరకు రూ.19 కోట్ల గ్రాస్ వసూళ్లు రావడం విశేషం. తొలి షో నుంచే సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.
సినిమాలోని లీడ్ రోల్స్ నటన అద్భుతమంటూ ప్రేక్షకులు సోషల్ మీడియాలో రివ్యూలు ఇచ్చారు. ఈ పాజిటివ్ టాక్ సినిమాకు ఫస్ట్ వీకెండ్ మరిన్ని భారీ వసూళ్లు సంపాదించి పెట్టనున్నాయి. కల్కి 2898 ఏడీ మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా మూవీపై ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఇది కూడా సినిమా వసూళ్లకు కలిసి రానుంది.
కుబేర మూవీ గురించి..
కుబేర మూవీని శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేశాడు. టాలీవుడ్ లోకి దర్శకుడిగా అడుగుపెట్టి 25 ఏళ్లయిన సందర్భంగా రిలీజైన ఈ సినిమా అతని కెరీర్లోనే ప్రత్యేకంగా నిలిచిపోనుంది. కుబేరను ఓ క్రైమ్ థ్రిల్లర్ గా అతడు తెరకెక్కించాడు. ఇది ఒక లక్ష కోట్ల స్కామ్ కథ. ఈ స్కామ్లో ఒక బిలినియర్, ఓ బెగ్గర్, ఒక సీబీఐ ఆఫీసర్ ఎలా వచ్చారన్న ఎంగేజింగ్ సీన్లతో సాగే సినిమానే కుబేర.
ఇక నటీనటుల నటనకు ఫుల్ మార్కులు పడుతున్నాయి. ముఖ్యంగా ధనుష్ అదరగొట్టినట్లు చెబుతున్నారు. అటు నాగార్జున కూడా ఇంత వరకూ చూడని పాత్రలో కనిపించాడు. ఓవరాల్గా శేఖర్ కమ్ముల మరోసారి తన మార్క్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. క్రైమ్ థ్రిల్లర్ కు సోషల్ మెసేజ్ జోడించిన వచ్చిన ఈ కుబేర మూవీ ఓ మస్ట్ వాచ్ అని చెప్పొచ్చు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper



