...
...
Next Story

14 ఏళ్ల తర్వాత అవార్డులు.. లక్కీ భాస్కర్ మూవీకి ఏకంగా 4 పురస్కారాలు.. ఏయే క్యాటగిరీల్లో అంటే?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టాలీవుడ్ సినీ పరిశ్రమకు తొలిసారిగా అవార్డులు ప్రకటించారు. 14 ఏళ్ల క్రితం నంది అవార్డ్స్ ప్రకటించిన ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ పేరుతో పురస్కారాలు అందించనుంది. గద్దర్ అవార్డ్స్ 2024లో లక్కీ భాస్కర్ సినిమాకు ఏకంగా 4 పురస్కారాలు వరించాయి.

Published on: May 29, 2025, 12:35:53 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో నంది అవార్డ్స్ ఎంతో కీలకంగా ఉండేవి. గత 14 ఏళ్లుగా నంది అవార్డ్స్‌ను ప్రకటించలేదు. కానీ, 14 ఏళ్ల తర్వాత టాలీవుడ్ పరిశ్రమకు అవార్డ్స్ ప్రకటన వచ్చింది. అయితే, నంది అవార్డ్స్‌కు బదులుగా తెలంగాణలో చిత్ర పరిశ్రమకు గద్దర్ అవార్డ్స్ పేరుతో పురస్కారాలను ప్రకటించారు.

2024 సినిమాలకు

14 ఏళ్ల తర్వాత అవార్డులు.. లక్కీ భాస్కర్ మూవీకి ఏకంగా 4 పురస్కారాలు.. ఏయే క్యాటగిరీల్లో అంటే?
14 ఏళ్ల తర్వాత అవార్డులు.. లక్కీ భాస్కర్ మూవీకి ఏకంగా 4 పురస్కారాలు.. ఏయే క్యాటగిరీల్లో అంటే?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా తెలుగు చిత్ర పరిశ్రమకు అవార్డులు ప్రకటించడం విశేషంగా మారింది. గద్దర్ అవార్డ్స్ 2024ను జ్యూరీ ఛైర్మన్ జయసుధ ప్రకటించారు. అయితే, 2024 సంవత్సరంలో విడుదలైన సినిమాలకు పలు విభాగాల్లో అవార్డులు అనౌన్స్ చేస్తూ ప్రకటన విడుదల చేశారు.

2024 గద్దర్ అవార్డ్స్‌

గద్దర్ అవార్డ్స్ 2024 కోసం 1248 నామినేషన్స్ రాగా 11 కేటగిరీల్లో పురస్కారాలు ప్రకటించారు. అలాగే, 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు విడుదలైన సినిమాల్లో ఒక మూవీని ఉత్తమ చిత్రంగా ప్రకటించారు. ఇక 2024 గద్దర్ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప 2), ఉత్తమ నటిగా నివేదా థామస్ (35 చిన్న కథ కాదు) అవార్డ్స్ దక్కించుకున్నారు.

4 విభాగాల్లో పురస్కారాలు

ఇదిలా ఉంటే, ఈ గద్దర్ అవార్డ్స్‌లలో లక్కీ భాస్కర్ సినిమా ఏకంగా నాలుగు విభాగాల్లో పురస్కారాలు వరించింది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు.

విమర్శకుల ప్రశంసలు

2024 అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన లక్కీ భాస్కర్ బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాంటి లక్కీ భాస్కర్ మూవీకి నాలుగు కేటగిరీల్లో గద్దర్ అవార్డ్స్ వరించాయి. అవేంటో ఇక్కడ లుక్కేద్దాం.

ఉత్తమ మూడో ఫీచర్ ఫిల్మ్

లక్కీ భాస్కర్ సినిమాకు ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా మరో పురస్కారం వరించింది. ఈ కేటగిరీలో లక్కీ భాస్కర్‌ డైరెక్టర్ వెంకీ అట్లూరి బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్‌గా గద్దర్ అవార్డ్ అందుకోనున్నారు. లక్కీ భాస్కర్ స్క్రీన్ ప్లే ఆడియెన్స్‌ను ఫిదా చేసిన విషయం తెలిసిందే.

బెస్ట్ ఎడిటర్

అలాగే, గద్దర్ అవార్డ్స్ 2024కి గానూ బెస్ట్ ఎడిటర్ కెటగిరీలో నవీన్ నూలి పురస్కారం అందుకోనున్నారు. లక్కీ భాస్కర్ చిత్రానికి గానూ ఉత్తమ ఎడిటర్‌గా నవీన్ నూలికి అవార్డ్‌ను ప్రకటించారు. ఎలాంటి అనవసరపు సన్నివేశం లేకుండా పర్‌ఫెక్ట్ సీన్లతో లక్కీ భాస్కర్ సినిమాను ఎడిట్ చేసినందుకు ఆయనకు ఈ పురస్కారం వరించింది.

స్పెషల్ జ్యూరీ అవార్డ్

ఇక పలువురికి స్పెషల్ జ్యూరీ కింద గద్దర్ అవార్డ్స్‌ను ప్రకటించారు. వాటిలో మొదటి స్పెషల్ జ్యూరీ అవార్డ్ విభాగంలో దుల్కర్ సల్మాన్కు పురస్కారాన్ని ప్రకటించారు. లక్కీ భాస్కర్ సినిమాలో దుల్కర్ సల్మాన్ నటనకు గానూ ఈ అవార్డ్ అందుకోనున్నారు. ఇలా తాజాగా ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ 2024లో నాలుగు పురస్కారాలను లక్కీ భాస్కర్ వరించి సత్తా చాటింది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe