...
...
Next Story

అయిదు నెలల తర్వాత మరో ఓటీటీలోకి వచ్చిన మలయాళం మూవీ.. కొత్తగా పెళ్లైన దంపతుల కథ.. పిల్లలను కనాలంటూ ప్రెషర్

మరో మలయాళం మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. మూడు నెలల క్రితమే డిజిటల్ స్ట్రీమింగ్ బాట పట్టిన ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ ఇప్పుడు మరో ఓటీటీలో రిలీజైంది. థియేటర్లలో రిలీజైన అయిదు నెలల తర్వాత ఇంకో ఓటీటీలో అడుగుపెట్టింది.

Published on: Jul 5, 2025, 16:03:45 IST
By ,
Prefer HTon Google
Advertisement

ఫ్యామిలీ ఎమోషన్ డ్రామాతో కూడిన మలయాళ సినిమా ‘అన్పోడు కన్మణి’ మరో ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పటికే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ.. ఇప్పుడు మరో ఓటీటీలో అడుగుపెట్టింది. థియేటర్లలో రిలీజైన అయిదు నెలల తర్వాత ఈ ఫిల్మ్ రెండో ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.

ఎక్కడంటే?

మరో ఓటీటీలోకి మలయాళ సినిమా (x)
మరో ఓటీటీలోకి మలయాళ సినిమా (x)

అన్పోడు కన్మణి అనే మలయాళ సినిమా ఈ రోజు (జూలై 5) మరో ఓటీటీలోకి వచ్చేసింది. ఈ ఏడాది జనవరి 24న ఈ చిత్రం థియేటర్లలో రిలీజైంది. మార్చి 28న ఈ సినిమా ఓటీటీలో అడుగుపెట్టింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు తాజాగా మనోరమ మ్యాక్స్ ఓటీటీలోకి కూడా వచ్చేసింది ఈ మూవీ. శనివారం నుంచే మనోరమ మ్యాక్స్ లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది ఈ సినిమా.

కథ ఏమిటంటే?

నకులన్ (అర్జున్ అశోకన్), శాలిని (అనఘ నారాయణన్) కొత్తగా పెళ్లి చేసుకుంటారు. కన్నూర్ లోని ఓ గ్రామంలో నకులన్ క్వారీ బిజినెస్ చేస్తుంటాడు. శాలినిని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంటాడు. మొదట్లో చిన్న చిన్న సరసాలు, ఆనందాలు, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ బాగానే ఉంటారు. కానీ రోజులు గడిచే కొద్దీ వీళ్ల మధ్య అపార్థాలు వస్తాయి. ఇక ఏమైనా గుడ్ న్యూస్ ఉందా? పిల్లలెప్పుడు అనే ప్రశ్నలు ఈ కొత్త దంపతులను విసిగిస్తాయి.

ఓ వైపు సమాజం.. మరోవైపు కుటుంబ సభ్యుల నుంచి ఈ దంపతులపై ప్రెషర్ పెరిగిపోతుంది. పిల్లలను కనాలంటూ వీళ్లను ఒత్తిడికి గురి చేస్తారు. దీంతో వ్యక్తిగత జీవితంలో సంతోషం అనేది లేకుండా పోతుంది. ఎమోషనల్ గా సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. మధ్యలో ఓ ఘటనతో కథ మలుపు తీసుకుంటుంది. మరి చివరకు ఏం జరిగిందో మూవీ చూసి తెలుసుకోవాలి.

ఆ అంచనాలు

ఈ సినిమాకు లీజు థామస్ డైరెక్టర్. అర్జున్ అశోకన్, అనఘ నారాయణన్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. క్రియేటివ్ ఫిష్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe