ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం ఈగ.. ఓవైపు రాజమౌళి టీమ్తో కాపీరైట్ గొడవలు.. మరోవైపు డిజిటల్ ప్రీమియర్
మలయాళం ఈగ ఓటీటీలోకి వచ్చేసింది. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈగ మూవీలోని ఈగ గ్రాఫిక్స్ ను అలాగే వాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ సినిమా.. సోమవారం (జూన్ 23) డిజిటల్ ప్రీమియర్ కావడం విశేషం.
మలయాళంలో గత నెల థియేటర్లలో రిలీజైన రొమాంటిక్ ఫ్యాంటసీ మూవీ లవ్లీ (Lovely). ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. అయితే ప్రస్తుతం ఈ మూవీపై కాపీరైట్ ఆరోపణలు ఉండటం విశేషం. అది కూడా మన ఎస్ఎస్ రాజమౌళి తీసిన ఈగ మూవీ ప్రొడ్యూసర్ చేసినవే. ఆ ఈగనే ఈ మలయాళం ఈగలోనూ అలాగే వాడుకున్నారన్నవి ఆ ఆరోపణలు.

లవ్లీ ఓటీటీ స్ట్రీమింగ్
మలయాళం మూవీ లవ్లీ సోమవారం (జూన్ 23) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. గత నెల 16న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు అక్కడి ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. 3డీలోనూ సినిమా రిలీజ్ అయింది. ఆ వెర్షన్ చిత్రీకరణ చాలా బాగుందన్న ప్రశంసలు దక్కాయి.
కానీ స్క్రిప్ట్ చాలా బలహీనంగా ఉండటంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఐఎండీబీలోనూ 6.4 రేటింగ్ మాత్రమే వచ్చింది. తెలుగులోనూ మూవీని రిలీజ్ చేసినా ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు ఓటీటీలోకి మాత్రం కేవలం మలయాళం వెర్షనే అందుబాటులోకి వచ్చింది.
లవ్లీ మూవీ వివాదం ఏంటంటే?
లవ్లీ సినిమా నెగటివ్ రివ్యూల కంటే కాపీరైట్ వివాదంతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. 2012లో రాజమౌళి తీసిన ఈగ మూవీ మేకర్స్.. ఈ లవ్లీ మూవీ మేకర్స్ కు లీగల్ నోటీసులు పంపించారు. ఈ సినిమాలో చూపించిన ఈగ గ్రాఫిక్స్ ఆ ఈగ మూవీ కాపీయే అని ఆరోపించారు. ఈ విషయం కోర్టు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదే సమయంలో లవ్లీ సినిమా ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతానికి మలయాళం వెర్షన్ అది కూడా 2డీలోనే స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ లవ్లీని డైరెక్ట్ చేసి దిలీష్ నాయర్ మాత్రం కాపీరైట్ ఆరోపణలను ఖండిస్తున్నాడు. దీనిని నిరూపించడానికి తన దగ్గర టెక్నికల్ ఆధారం కూడా ఉందని అతడు స్పష్టం చేస్తున్నాడు.
లవ్లీ మూవీ స్టోరీ ఏంటంటే?
దిలీష్ నాయర్ డైరెక్ట్ చేసిన లవ్లీ మూవీలో మాథ్యూ థామస్, శివాంగి కృష్ణకుమార్, మనోజ్ కే జయన్ లీడ్ రోల్స్ లో నటించారు. అనుకోకుండా జైలుకు వెళ్లే ఓ యువకుడికి అక్కడ ఓ మాట్లాడే ఈగ పరిచయం అవుతుంది. వీళ్ల మధ్య బంధం ఎలా బలపడిందనే ఓ భిన్నమైన కాన్సెప్ట్ తో ఈ లవ్లీ మూవీని తెరకెక్కించారు.
ఇందులోని ఈగను చూసి రాజమౌళి మూవీలోని ఈగనే గుర్తొస్తుంది. దీంతో ఆ గ్రాఫిక్స్ ను కాపీ చేశారనే ఆరోపణలను ఈ మూవీ మేకర్స్ ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతానికి మలయాళం వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలోనే తెలుగు వెర్షన్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper



