మై విలేజ్ షో నుంచి తొలిసారిగా ఓటీటీ సిరీస్ చేశాం.. విజయ్ దేవరకొండ అన్ననే అలా.. యూట్యూబర్ అనిల్ గీలా కామెంట్స్

యూట్యూబ్‌లో మై విలేజ్ షో సిరీస్‌తో ఎంతో పాపులర్ అయిన అనీల్ గీలా ఓటీటీ వెబ్ సిరీస్‌ మోతెవరి లవ్ స్టోరీ‌తో అలరించనున్నాడు. రీసెంట్‌గా మోతెవరి లవ్ స్టోరీ ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూట్యూబర్ అనిల్ గీలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Published on: Jul 10, 2025, 06:03:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

యూట్యూబ్‌లో చాలా పాపులర్ అయిన సిరీస్‌లలో మై విలేజ్ షో ఒకటి. ఈ సిరీస్‌తో బిగ్ బాస్ గంగవ్వ, యూట్యూబర్ అనిల్ గీలా మంచి పాపులారిటి కూడా తెచ్చుకున్నారు. వరల్డ్ ఫేమస్ లవర్ మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనిల్ జీలా ఇప్పుడు ఓటీటీ సిరీస్‌తో అలరించనున్నాడు.

మై విలేజ్ షో నుంచి తొలిసారిగా ఓటీటీ సిరీస్ చేశాం.. విజయ్ దేవరకొండ అన్ననే అలా.. యూట్యూబర్ అనిల్ గీలా కామెంట్స్
మై విలేజ్ షో నుంచి తొలిసారిగా ఓటీటీ సిరీస్ చేశాం.. విజయ్ దేవరకొండ అన్ననే అలా.. యూట్యూబర్ అనిల్ గీలా కామెంట్స్

తెలంగాణ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో

అనిల్ గీలా ఓటీటీ ఎంట్రీ ఇస్తున్న వెబ్ సిరీస్ మోతెవరి లవ్ స్టోరీ. తెలంగాణ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో లవ్, కామెడీ ప్రధాన అంశాలుగా తెరకెక్కింది మోతెవరి లవ్ స్టోరీ. అనిల్ జీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్‌కు శివకృష్ణ బుర్రా దర్శకత్వం వహించారు.

తాజాగా మోతెవరి ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. జీ5లో ఆగస్ట్ 8 మోతెవరి లవ్ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో జూలై 9న మోతెవరి టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హీరో, యూట్యూబర్అనిల్ గీలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

మొదటి సిట్టింగ్‌కే

అనిల్ గీలా మాట్లాడుతూ .. "మా ‘మై విలేజ్ షో’ టీం నుంచి మొదటి సారిగా ఇలా సిరీస్ చేశాం. మధుర శ్రీధర్ గారు మొదటి సిట్టింగ్‌కే కథను ఓకే చేశారు. జీ5 టీం వల్లే ఈ సిరీస్ ఇంత బాగా వచ్చింది. అనురాధ మేడం ఎప్పుడూ మా వెన్నంటే ఉండి సపోర్ట్ చేశారు. ఆమె ఇచ్చిన ధైర్యం వల్లే ఈ సిరీస్‌ ఇక్కడి వరకు వచ్చింది" అని అన్నాడు.

"మేం ఈ ప్రయాణంలో చాలా కష్టాల్ని ఎదుర్కొంటూనే ఎంతో నేర్చుకున్నాం. చివరకు ఓ అద్భుతమైన సిరీస్ ఆడియెన్స్‌కు అందివ్వబోతోన్నాం. మేం ఇప్పటి వరకు ఎన్నో సార్లు చూశాం. ఆద్యంతం నవ్వుకుంటూనే ఉన్నాం" అని అనిల్ గీలా తెలిపాడు.

మోతెవరి ఓటీటీ రిలీజ్ డేట్

"నన్ను విజయ్ దేవరకొండఅన్ననే సినిమాల్లోకి తీసుకువచ్చారు. ఇప్పుడు నా కోసం వచ్చిన ఆనంద్ అన్నకి థాంక్స్. మా ఓటీటీ సిరీస్ మోతెవరి లవ్ స్టోరీ ఆగస్ట్ 8న రాబోతోంది. అందరూ చూడండి" అని యూట్యూబర్, హీరో అనిల్ గీలా కోరాడు.

ఇదే ఈవెంట్‌లో జీ5 తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ గూడూర్ మాట్లాడుతూ .. "కరోనా టైంలో మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా చూసి ఆశ్చర్యపోయాను. ఆ చిత్రం నాకు చాలా ఇష్టం. వెంటనే ఆ మూవీ రైట్స్‌ను మేం కొనేశాం" అని ఆనంద్ దేవరకొండ మూవీ గురించి చెప్పారు.

అనిల్ గీలాకు స్టార్‌డమ్

"ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీతో సంగీత్ శోభన్‌ (మ్యాడ్ ఫేమ్)కు స్టార్‌డమ్ వచ్చింది. ఇప్పుడు ఈ సిరీస్‌తో అనిల్ గీలాకు స్టార్‌డమ్ వస్తుంది. మై విలేజ్ షో టీంతో అసోసియేట్ అవ్వడం, మధుర శ్రీధర్ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. గ్రామీణ రొమాంటిక్-కామెడీగా తెరకెక్కిన ఈ సిరీస్ అందరినీ మెప్పిస్తుంది" జీ5 ఓటీటీబిజినెస్ హెడ్ అనురాధ గూడూర్ తెలిపారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More