మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ ‘నరివెట్ట’ ఓటీటీలోకి వచ్చేసింది. ముందుగా ప్రకటించిన దాని కంటే ఒక రోజు ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది ఈ సూపర్ హిట్ మూవీ. థియేటర్లలో అదరగొట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ ఆడియన్స్ ను అలరిస్తోంది. టొవినో థామస్ నటించిన ఆ పోలీస్ సోషల్ యాక్షన్ థ్రిల్లర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఏ ఓటీటీలో అంటే?

నరివెట్ట మూవీ ఈ రోజు (జూలై 10) ఓటీటీలోకి వచ్చేసింది. ముందుగా జూలై 11న ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఒక రోజు ముందుగానే ఓటీటీలోకి వచ్చేసింది ఈ మూవీ. గురువారం నుంచే ప్రసారమవుతుంది. సోనీ లివ్ ఓటీటీలో ఈ మూవీ అడుగుపెట్టింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
అదిరే రెస్పాన్స్
మే 23, 2025న థియేటర్లలో రిలీజైంది నరివెట్ట సినిమా. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సత్తాచాటింది. రూ.10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన నరివెట్ట రూ.30 కోట్లు రాబట్టింది. పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లింది. సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేశారు. ఇప్పుడు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ సినిమాకు అనురాజ్ మనోహర్ డైరెక్టర్. ఇండియన్ సినిమా కంపెనీ బ్యానర్ పై నిర్మించారు.
కథ ఏమిటంటే?
నరివెట్ట మూవీ గిరిజన ఆదివాసీ ప్రజలకు, పోలీసు.. రాజకీయ నాయకులకు మధ్య జరిగే కథ. ఫారెస్ట్ కన్సర్వేషన్ అండ్ డెవలప్ మెంట్ కోసమని కొన్ని తరలుగా అడవిలో నివాసం ఉంటున్న గూడెం ప్రజలను ఖాళీ చేయించాలని చూస్తారు. కానీ అందుకు నిరాకరించిన ప్రజలు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తారు. ఆ సమయంలోనే పోలీసులు అమాయకులపై విరుచుకుపడతారు.
అమాయక జనాలను పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లి చిత్రహింసలు పెడుతుంటారు. పోలీసు కానిస్టేబుల్ గా పని చేస్తున్న హీరో ఈ దుశ్చర్యను చూసి తట్టుకోలేకపోతాడు. పోలీసులు, గిరిజన ప్రజల మధ్య నలిగిపోతాడు. మరి చివరకు హీర ఏం చేశాడు? తన సొంత డిపార్ట్ మెంట్ పోలీసులను ఎదురించి అమాయక ప్రజలకు అండగా నిలిచాడా? ఆ ఊరి జనాలు పోరాటంలో గెలిచారా? అన్నదే కథ.
రియల్ స్టోరీ
{{/usCountry}}అమాయక జనాలను పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లి చిత్రహింసలు పెడుతుంటారు. పోలీసు కానిస్టేబుల్ గా పని చేస్తున్న హీరో ఈ దుశ్చర్యను చూసి తట్టుకోలేకపోతాడు. పోలీసులు, గిరిజన ప్రజల మధ్య నలిగిపోతాడు. మరి చివరకు హీర ఏం చేశాడు? తన సొంత డిపార్ట్ మెంట్ పోలీసులను ఎదురించి అమాయక ప్రజలకు అండగా నిలిచాడా? ఆ ఊరి జనాలు పోరాటంలో గెలిచారా? అన్నదే కథ.
రియల్ స్టోరీ
{{/usCountry}}నరివెట్ట సినిమా వెనుక రియల్ స్టోరీ ఉంది. 2003లో జరిగిన ముతంగ ట్రైబల్ ప్రొటెస్ట్ ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో టొవినో థామస్, సూరజ్ వెంజారమూడు, ఆర్య సలీం తదితరులు నటించారు. గిరిజనుల పోరాటాన్ని గుండెకు హత్తుకునేలా ఈ మూవీలో చూపించారు. థ్రిల్ తో పాటు కదిలించే ఎమోషన్, డ్రామాను ఈ సినిమాలో చూడొచ్చు.