థ్రిల్లర్ వెబ్ సిరీస్ అంటే ఇష్టపడే వారి కోసం మరో సిరీస్ రాబోతోంది. ఈ వెబ్ సిరీస్ పేరు మండల మర్డర్స్ (Mandala Murders). ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఈ ఒరిజినల్ సిరీస్ ను తీసుకొస్తోంది. గతంలోనే సిరీస్ అనౌన్స్ చేయగా.. తాజాగా మంగళవారం (జులై 15) ట్రైలర్ రిలీజ్ చేసింది.
మండల మర్డర్స్ ట్రైలర్

మండల మర్డర్స్ ఓ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్. దీనికి మోల్ చుకానా పడేగా (మూల్యం చెల్లించాల్సిందే) అనే ట్యాగ్లైన్ పెట్టారు. ఇది మనల్ని ఓ మార్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి నెట్ఫ్లిక్స్ లోకి వస్తోంది. జులై 25 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగింది. చరణ్దాస్పూర్ అనే అడవి నుంచి ట్రైలర్ మొదలైంది. అది అడవి కాదు ఓ ప్రాచీన కాలపు యంత్రం అని, అందులో ఎవరైనా తమ బొటన వేలు త్యాగం చేసి కోరుకున్న వరం పొందవచ్చని వాయిస్ ఓవర్ లో చెబుతారు.
ఆ తర్వాత సీన్ సడెన్ గా వరుస హత్యల వైపు మళ్లుతుంది. బాధితుల శరీర అవయవాలు మిస్ అవుతాయి. ఆ హత్యలను ఛేదించే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా రియా థామస్ (వాణీ కపూర్) రంగంలోకి దిగుతుంది. ఈ హత్యలు రెండుతో ఆగవని, మరో ఐదు హత్యలు జరుగుతాయని తేలుతుంది. అసలు ఆ హత్యలు ఎవరు, ఎందుకు చేస్తున్నారన్నదే ఈ సిరీస్ కథ. హత్యలకు ఓ మార్మిక ప్రపంచాన్ని జోడిస్తూ ఈ వెబ్ సిరీస్ ను మేకర్స్ ఆసక్తికరంగా మలిచినట్లుగా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
మండల మర్డర్స్ వెబ్ సిరీస్ గురించి..
మండల మర్డర్స్ వెబ్ సిరీస్ ను మనన్ రావత్ డైరెక్ట్ చేశాడు. ఇందులో వాణీ కపూర్ తోపాటు వైభవ్ రాజ్ గుప్తా, శ్రియ పిల్గావ్కర్, సిద్ధార్థ్ కపూర్, సుర్వీన్ చావ్లా, రఘుబీర్ యాదవ్ లాంటి వాళ్లు నటించారు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ జానర్ కావడంతో సహజంగానే ఈ వెబ్ సిరీస్ పై అంచనాలు ఉన్నాయి.
{{/usCountry}}మండల మర్డర్స్ వెబ్ సిరీస్ ను మనన్ రావత్ డైరెక్ట్ చేశాడు. ఇందులో వాణీ కపూర్ తోపాటు వైభవ్ రాజ్ గుప్తా, శ్రియ పిల్గావ్కర్, సిద్ధార్థ్ కపూర్, సుర్వీన్ చావ్లా, రఘుబీర్ యాదవ్ లాంటి వాళ్లు నటించారు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ జానర్ కావడంతో సహజంగానే ఈ వెబ్ సిరీస్ పై అంచనాలు ఉన్నాయి.
{{/usCountry}}అందులోనూ నెట్ఫ్లిక్స్ లాంటి ప్లాట్ఫామ్ కావడంతో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గానే ఉంటాయి. దీంతో ఈ సిరీస్ కోసం ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నెట్ఫ్లిక్స్ లో జులై 25 నుంచి మండల మర్డర్స్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది.