నిన్ను కోరి జూలై 18 ఎపిసోడ్: ఇంటికి తాగి తూలుతూ వచ్చిన క్రాంతి- శాలినిపైనే అందరి డౌట్, ముచ్చెమటలు-ఉదయాన్నే తేలనున్న నిజం

నిన్ను కోరి సీరియల్ జూలై 18 ఎపిసోడ్‌లో ఇంటికి శ్యామల వాళ్లు వచ్చి దాంపత్య వ్రతం సక్సెస్‌గా జరిగిందని చెబుతుంది. రాత్రి క్రాంతి తాగి తూలుతూ వస్తాడు. అదంతా చూసిన ఇంట్లోవాళ్లు షాక్ అవుతారు. ఎందుకు తాగొచ్చావ్ అని క్రాంతిని అడిగితే శాలిని అని చెప్పి ఆగిపోతాడు. దాంతో అంతా శాలినిని అనుమానిస్తారు.

Published on: Jul 18, 2025 6:25 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శాలిని ఇంట్లో కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. క్రాంతికి నిజం తెలిసిపోయిందని తెగ భయపడిపోతుంటుంది. ఇంతలో అక్కడికి జగదీశ్వరి వచ్చి ఏమైంది షాలిని, అంతలా కంగారుగా ఉన్నావేంటీ, ఏసీలో కూడా చెమటలు పడుతున్నాయేంటీ అని అడుగుతుంది.

నిన్ను కోరి సీరియల్ జూలై 18 ఎపిసోడ్‌
నిన్ను కోరి సీరియల్ జూలై 18 ఎపిసోడ్‌

శాలినికి ముచ్చెటమలు

దానికి ఏం లేదు, ఎండలో ఉన్నాను అందుకే మొహం మీద చెమటలు పడుతున్నాయి, కాస్తా నీరసంగా ఉంది అని శాలిని చెబుతుంది. అయితే, వెళ్లి నీళ్లు తాగమని జగదీశ్వరి చెబుతుంది. దాంతో శాలిని వెళ్లిపోతుంది. అప్పుడే అక్కడికి గుడి నుంచి శ్యామల విరాట్ చంద్రకళ కామాక్షి శ్రుతి వస్తారు.

గుళ్లో వీళ్లకు దాంపత్యవ్రతం చేయించాను అని శ్యామల చెబుతుంది. అప్పుడే చిరాకుతో విరాట్ అక్కడ నుంచి వెళ్లిపోతాడు. కామాక్షి శ్రుతి మీరెందుకు వెళ్లారు అని జగదీశ్వరి అడిగితే.. పెళ్లి గురించి కోరుకోవడానికి వెళ్లాను అని శ్రుతి చెబుతుంది. గుడిలో ఇలా మేము ప్లాన్ అనుకున్నాము. కానీ, అది జరగలేదని శాలినీతో చెబుతారు కామాక్షి, శ్రుతి.

దాంతో కోపంగా తల్లీకూతుళ్లను తిట్టిన శాలిని వెళ్లిపోతుంది. శ్యామల వచ్చి కామాక్షి, శ్రుతి మీ ఇద్దరితో పనుందని వారిని తీసుకెళ్తుంది. అలా తీసుకెళ్లిన తర్వాత తన బట్టలు ఎలా లగేజ్ బ్యాగ్‌లో సర్ది పెట్టారో అలాగే రూమ్‌లో పెట్టమని ఆర్డర్ వేస్తుంది శ్యామల. దానితో అష్ట కష్టాలతో శ్రుతి కామాక్షి ఇద్దరు శ్యామల బట్టలు కబోర్డ్‌లో సర్దుతారు.

ఎందుకు ఇంతలా తాగొచ్చాడు

అదంతా అయిపోయిన తర్వాత రాత్రి కాంతి మందు తాగి మత్తులో తూగుతూ ఇంటికి వస్తాడు. అదంతా అందర చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. అసలు ఏమైంది వీడికి, ఎందుకు ఇంతలా తాగొచ్చాడు అని బాధపడుతారు. క్రాంతినే అడుగుతారు. కానీ, క్రాంతి మాత్రం ఎలాంటి సమాధానం చెప్పకుండా శాలిని వైపు చూస్తూ ఉండిపోతాడు.

శాలిని అని క్రాంతి ఒక్క మాట చెప్పి తర్వాత సైలెంట్ అయిపోతాడు. దాంతో ఇంట్లో శాలినినే ఏదో చేసిందని, అందుకే క్రాంతి ఇలా తాగొచ్చాడని శాలినిపై డౌట్ పడతారు. ఏం జరిగింది శాలిని, క్రాంతి ఎందుకింతలా తాగొచ్చాడు అని అడుగుతారు. తనకు ఏం తెలియదని శాలిని బుకాయిస్తుంది. అదంతా గమనించిన శ్యామల ముందు అయితే క్రాంతిని లోపల పడుకోబెట్టమని శాలినికి చెబుతుంది.

దాంతో క్రాంతిని తీసుకొని గదిలో పడుకోబెట్టడానికి తీసుకెళ్తుంది శాలిని. గదిలోకి వెళ్లిన తర్వాత జగదీశ్వరీ అసలు ఏం జరిగిందో పర్సనల్‌గా అడుగుతున్నాను అని శాలినిని అడుగుతుంది జగదీశ్వరి. కానీ, శాలిని మాత్రం నాకు నిజంగా ఏం తెలియదు అత్తయ్య అని శాలిని అంటుంది.

ఉదయాన్నే తెలుస్తుంది

ఉదయాన్నే ఎలాగో క్రాంతి లేస్తాడు కదా. అప్పుడు నేనే క్రాంతిని అడుగుతా. అప్పుడు అసలు విషయం, నిజం తెలుస్తుంది అని శ్యామల, జగదీశ్వరి అని వెళ్లిపోతారు. అలానే అందరూ వెళ్లిపోతారు. ఇక అదంతా జరగడంతో బాగా టెన్షన్‌కి గురైన శాలిని జగ్గులో వాటర్ గడగడ తాగుతుంది.

అదంతా చూసిన కామాక్షి, శ్రుతి ఇద్దరూ ఏదో జరిగింది అని అనుమానిస్తారు. వెళ్లిని శాలినిని అడుగుతారు. కానీ, ఏం లేదని శాలిని వెళ్లిపోతుంది. కచ్చితంగా ఏదో జరిగింది. ఇదే ఏదో చేసింది అని శాలినిపై శ్రుతి, కామాక్షి అనుమానిస్తారు. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.