నిన్ను కోరి జూలై 2 ఎపిసోడ్: అడుగడుగునా చంద్రకళకు అవమానాలు- శాలినితో చంద్ర ఛాలెంజ్- నూనే, మంట, గ్యాస్ లేకుండా వంట పోటీ!
నిన్ను కోరి సీరియల్ జూలై 2 ఎపిసోడ్లో ఇంటి బాధ్యతలు తనకు కూడా కావాలని చంద్రకళ అనడంతో ఆస్తి మీద కన్నేసిందని జగదీశ్వరికి కామాక్షి చెబుతుంది. దాంతో చంద్రకళను తిడుతుంది జగదీశ్వరి. అత్త, భర్త విరాట్ ఇద్దరు శాలిని ప్లాన్ గురించి చంద్రకళ చెబితే ఎవరు నమ్మరు. చంద్రకళతో శాలిని ఛాలెంజ్ చేస్తుంది.
నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో శాలినికి ఇంటి బాధ్యతలు అప్పజెప్పడంపై చంద్రకళ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. దాంతో తోడి కోడళ్లు అయిన చంద్రకళ, శాలిని మధ్య శ్యామల పోటీ పెడతానంటుంది. దానికి ఇంట్లో వారందరూ ఒప్పుకుంటారు.

ఆస్తి మీద కన్నుంది
తర్వాత జగదీశ్వరి దగ్గరికి వచ్చిన కామాక్షి చంద్రకళ ఈ ఆస్తి పోటీలో పాల్గొనడానికి ముఖ్య ఉద్దేశం ఏదో ఉంది. తనకు ఈ ఆస్తి మీద కన్నుంది. అందుకే నిన్న మనతో ఇంటి బాధ్యతలు ఎవరికైనా అప్పజెప్పండి నాకు అవసరం లేదు అని చెప్పి ఇప్పుడు తను కూడా ఈ ఇంటి బాధ్యతలు కావాలంటుంది. దీని వెనకాల ఏదో మర్మం ఉంది అంటుంది.
అప్పుడే అక్కడికి చంద్రకళ వస్తుంది. జగదీశ్వరితో శాలిని ఈ ఇంటిని కొల్లగొట్టడానికి పగ పట్టి ఇక్కడికి వచ్చిందన్న విషయం చెప్పుదామని చంద్రకళ అనుకుంటుంటే జగదీశ్వరి మాట వినకుండా రివర్స్లో తిడుతుంది. చంద్రకళని అత్త జగదీశ్వరి దూషిస్తుంది. తననే జగదీశ్వరి దోషిగా చూడటంతో ఏం చేయలేక చంద్రకళ అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్లిపోతుంది.
కొత్త కథతో వచ్చావా
అయితే, చంద్రకళను జగదీశ్వరి తిట్టిన మాటలు విరాట్ వింటాడు. శాలిని పన్నిన పన్నాగం గురించి విరాట్కు అయిన చంద్రకళ చెప్పాలనుకుంటుంది. విరాట్తో శాలిని గురించి చంద్రకళ చెబితే.. ఇదొక కొత్త నాటకం. ఇది ఒక కొత్త కథ అల్లుకొని వచ్చావా. చాలా బాగుంది అని చంద్రకళనే తిడతాడు విరాట్.
అసలు ఇంటి ఆస్తిని కొల్లగొట్టే పన్నాగం పన్నింది శాలిని కాదు నువ్వే అన్న అనుమానం నాకు కలుగుతుంది అన్నట్టు విరాట్ మాట్లాడుతాడు. దాంతో చంద్రకళకు ఏం మాట్లాడాలో తెలియక, ఏం చేయాలో తోచక ఆలోచిస్తూ అక్కడే బాధపడుతూ ఉండిపోతుంది. తాను ఏం చేయకున్న చంద్రకళ దోషిలా అందరితో అడుగడుగునా అవమానాలు పడుతుంది.
తోడి కోడళ్ల ఛాలెంజ్
అనంతరం శాలిని దగ్గరికి చంద్రకళ వెళ్తుంది. ఈ పోటీలో నువ్వెలా గెలుస్తావో నేను చూస్తానని శాలిని చాలెంజ్ విసిరితే.. నీ ప్లాన్ అంతా నాకు తెలిసిపోయింది. నవ్వు కూడా ఈ పోటీలో ఎలా గెలుస్తావో నేను చూస్తాను అని శాలినికి సవాల్ విసురుతుంది చంద్రకళ. ఇద్దు వాదోపవాదాలు చేసుకుంటారు.
మరుసటి రోజు ఉదయాన్నే శ్యామల అందరిని పిలుస్తుంది. నేను మొత్తానికి పోటీ పెట్టడానికి నిర్ణయించుకున్నాను. అది ఈరోజు అవుతుంది మొదటి పోటీ ఏంటంటే వంట వండే కార్యక్రమం. అది ఎలాంటి వంట అంటే.. నూనె, మంట, పోయి గ్యాస్ ఏమి వాడకుండా మీరు వంట వండి మా అందరిని మెప్పించగలిగితే ఎవరూ బాగా చేశారు దాన్ని బట్టి ఆ పోటీలో ఎవరు గెలుస్తారో అన్నది నిర్ణయిస్తామని శ్యామల చెబుతుంది.
పోటీకి సిద్ధం కండి
ఆ పోటీకి ఇంట్లో వాళ్లందరు అంగీకరిస్తారు. కానీ, శాలిని అసలు వంటే రాదు. ఏం వండుతుంది అని కామాక్షి, శ్రుతి సెటైర్లు వేసుకుంటారు. తర్వాత చంద్రకళ, శాలిని ఇద్దరిని మొదటి పోటీకి సిద్ధం కండి అని శ్యామల చెబుతుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper













