నిన్ను కోరి జూలై 5 ఎపిసోడ్: పోటీలో గెలిచిన చంద్రకళ- పెద్ద కోడలికే ఇంటి తాళాలు- రగిలిపోయిన శాలిని- నిందలతో కొత్త సమస్యలు!
నిన్ను కోరి సీరియల్ జూలై 5 ఎపిసోడ్లో చంద్రకళ-శాలినికి మూడో పోటీ పెడుతుంది శ్యామల. తమ భర్తలను ఇంప్రెస్ చేయాలని, దానికి ఏమైనా చేయండి అని శ్యామల చెబుతుంది. ముందు నుంచి భయపడిన చంద్రకళ చివరిగా ఈ పోటీలో గెలుస్తుంది. దాంతో పెద్ద కోడలు అయిన చంద్రకళకే ఇంటి తాళాలు వెళ్తాయి. దాంతో కోపంతో రగిలిపోతుంది శాలిని.
నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఇంట్లో చంద్రకళ, శాలిని మధ్య పోటీ నడుస్తుంటుంది. శ్యామల అందరిని పిలిచి మూడో పోటీ నిర్వహించబోతున్నాను. అందులో మీరు మీ భర్తలను ఇంప్రెస్ చేయాలి అని చెబుతుంది. దానికి శాలిని అంగీకరించి ఎలాగో క్రాంతి నా వైపు ఉన్నాడు. కాబట్టి ఏ పని చేసినా నాకు తన సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఈ పోటీలో నేనే గెలుస్తానని సంబరపడిపోతూ ఉంటుంది.

ఓడిపోతానేమో అని
ఇక చంద్రకళ మాత్రం విరాట్ తనకు సపోర్ట్గా లేడు కాబట్టి నేను ఓడిపోతానేమో అని కాస్తా భయపడుతుంది. తర్వాత శ్యామల ఉండి మీరు ఏదైనా చేయండి. మీ భర్తలను మాత్రం ఇంప్రెస్ చేయండి అని గదిలోకి పంపిస్తుంది. గదిలోకి వచ్చిన శాలినికి డ్రాయింగ్ బొమ్మలు గుర్తుకొచ్చి వాళ్ల బొమ్మలను ఒక చార్ట్ మీద చిత్రీకరిస్తుంది. ఆ చిత్రీకరించిన బొమ్మతో క్రాంతి ఇంప్రెస్ అవ్వాలని అనుకుంటుంది శాలిని.
చంద్రకళకి ఏమి తోచనట్టుగా తన గదిలో కంగారు పడుతూ ఉంటుంది. విరాట్ వచ్చి నువ్వు ఎలాగో ఈ పోటీలో ఓడిపోతావని తన కాన్ఫిడెన్స్ని తక్కువ చేసి మాట్లాడుతాడు. దాంతో తనకేం చేయాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ఉంటుంది చంద్రకళ. ఆ తర్వాత అందరూ హాల్లోకి వస్తారు. వచ్చిన తర్వాత శాలిని నువ్వు ఏం తీసుకొచ్చావో చూపించమని అడుగుతారు.
శాలినికి ఇంప్రెస్
దాంతో శాలిని తాను క్రాంతి ఇద్దరు కలిసి ఉండే పటాన్ని అందంగా చిత్రీకరించి తీసుకొస్తుంది. అది చూసి అందరూ ఇంప్రెస్ అవుతారు. మెచ్చుకుంటారు. క్రాంతి కూడా చాలా బాగా చేశావని సంబరపడిపోతాడు. దానితో శాలిని విజయం సంపాదించుకుంటుందేమో అని చంద్రకళ భయపడిపోతుంది. తర్వాత చంద్రకళని నువ్వేం చేసుకు వచ్చావ్ అని అడుగుతారు.
చంద్రకళ తాను చిత్రీకరించిన విరాట్, జగదీశ్వరి కలిసి ఉన్న ఫోటోలను చూపిస్తుంది. అది చూసిన వాళ్లంతా చాలా ఆనంద పడిపోతారు. భర్తను ఎవరైనా ఇంప్రెస్ చేస్తారు. కానీ, తల్లీ కొడుకుల ప్రేమ, అనుబంధం అనేది చాలా అద్భుతమైనది, అమితమైనది అని చెప్పి చంద్రకళకి విజయం ప్రకటిస్తారు.
తల్లీకొడుకుల బంధంతో
దాంతో ఇంటి తాళాలు, ఇంటి పెత్తనం చంద్రకళకు వెళ్లిపోతాయి. అదంతా చూసిన శాలినికి చాలా కోపం వస్తుంది. కామాక్షి, శృతి కూడా చాలా డిసప్పాయింట్ అయిపోతారు. ఇక చంద్రకళకు కొమ్ములు వచ్చినట్లే అని తల్లీకూతుళ్లు కామాక్షి, శ్రుతి అనుకుంటారు.
చంద్రకళకి తాళాలు వెళ్లిపోవడం మనకి ఓటమి కాదు అదే గెలుపు అనుకోవాలి అని శాలిని అంటుంది. అర్థం కాలేదు. అలా ఎలా అవుతుందని తల్లీకూతుళ్లు అంటారు. ఎందుకంటే రేపు ఇంట్లో ఏదైనా తప్పు జరిగినా, డబ్బులు పోయిన, ఇంకేదైనా దొంగతనం జరిగిన ఆ నింద చంద్రకళ మీద పడుతుంది. అప్పుడు ఆ తాళాలు అత్తయ్య మనకే ఇస్తుంది అని శాలిని అంటుంది.
కొత్త సమస్య
దాంతో అంటే ఇంట్లో చంద్రకళ తప్పు చేసినట్లుగా మనం చిత్రీకరించాలి అని ముగ్గురు కలిసి మాట్లాడుకుంటారు. కాబట్టి, పెద్ద కోడలు చంద్రకళ గెలిచి ఇంటి తాళాలు రప్పించుకున్నప్పటికీ కొత్త సమస్య ఎదురైనట్లు అవుతుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper













