నిన్ను కోరి జూలై 10 ఎపిసోడ్: దొంగ కోసం విరాట్, చంద్రకళ ఛేజింగ్.. జగదీశ్వరిని అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులు
నిన్ను కోరి టుడే జూలై 10వ తేదీ ఎపిసోడ్ లో నగలు కాజేసిన దొంగ ఇంటికి విరాట్, చంద్రకళ వెళ్తారు. ఆ దొంగ తప్పించుకుని పారిపోతే పట్టుకోవడానికి వీళ్లు పరుగెడతారు. మరోవైపు జగదీశ్వరీని అరెస్టు చేసేందుకు పోలీసులు వస్తారు. మరి దొంగ దొరికాడా? ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి.
నిన్ను కోరి టుడే జూలై 10 ఎపిసోడ్ లో దొంగ అడ్రస్ వెతుక్కుంటూ విరాట్, చంద్రకళ వెళ్తారు. నా ఇంట్లో దొంగతనం చేసిన వాడిపై కోపంతో ఊగిపోతాడు విరాట్. మనం నగల కోసం వస్తే వాడు ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంది, అందుకే తెలివిగా డీల్ చేద్దామని చంద్రకళ అంటుంది. బయట ఆ దొంగ బైకు ఆగి ఉండటం గమనిస్తారు. డోర్ దగ్గరికి వెళ్లి ఓపెన్ చేయమంటారు. ఎవరై ఉంటారు అని ఆ దొంగ అనుకుంటాడు.

తప్పించుకున్న దొంగ
ఎవరు అని దొంగ అడుగుతాడు. ఈ బస్తీలో సొంత ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇప్పించే స్కీమ్ గవర్నమెంట్ తెచ్చిందని, వివరాలు కావాలని చంద్రకళ చెప్తుంది. నమ్మకపోతే మీరే నష్టపోతారని విరాట్ అంటాడు. మీకు డబ్బులు కూడా వస్తాయని ఆశ కల్పిస్తారు. ఆ దొంగ డబ్బుల గురించి ఆలోచించి డోరు తీస్తాడు. లోపలికి వచ్చిన విరాట్ నగలు ఎక్కడ దాచావని అడిగి, ముఖంపై బలంగా పంచ్ ఇస్తాడు. దొంగను విరాట్, చంద్రకళ కొడతారు. దొంగ వాళ్లను తోసేసి పారిపోతాడు.
మరోవైపు ఇంట్లో చంద్రకళను కామాక్షి, శాలిని, శ్రుతి లేనిపోని మాటలు అంటారు. ఆ చంద్రకు తాళాలు అప్పగించి ఎంత పెద్ద తప్పు చేశారో తెలిసిందా? పనికిమాలిన పోటీలన్నీ పెట్టి సింహాసనానికి ఎక్కించారు. కానీ ఇప్పుడు పాతాళానికి తొక్కేస్తుంది అని కామాక్షి అంటుంది. ఇంతసేపు వాళ్లు ఏం చేస్తున్నారని అంటుంది.
అరెస్టు చేయించాలని
ఇంతలోనే పోలీసులను తీసుకొని పాటు సరిత, వాళ్ల హస్బెండ్ వస్తారు. నగలు ఇస్తారా అరెస్టు చేయమంటారా అని పోలీసులు అంటారు. వాళ్లకు క్రాంతి సీసీటీవీ ఫుటేజీ చూపిస్తారు. మాకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని పోలీసులు అడుగుతారు. ముందు ఆవిడను అరెస్టు చేయండి అని సరిత భర్త అంటాడు. అరెస్టు చేస్తే పరువు పోతుందని జగదీశ్వరిసరితను రిక్వెస్ట్ చేస్తుంది. కానిస్టేబుల్ అరెస్టు చేయండి అని ఎస్సై అంటాడు.
నగలతో ఎంట్రీ
ఇంతలో ఆగండి అంటూ చంద్రకళ ఎంట్రీ ఇస్తుంది. మీరు చంద్రను అరెస్టు చేయండి అని కామాక్షి అంటుంది. దొంగతో పాటు నగల బాక్స్ ను పట్టుకుని విరాట్ ఇంట్లోకి రావడంతో శాలిని షాక్ అవుతుంది. దొంగను పోలీసులు అరెస్టు చేస్తారు. వాళ్లకు నగలు అప్పగిస్తారు.
ఇంట్లోకి ఎలా వచ్చావు, తాళం చెవులు బీరువాలో ఉన్న సంగతి ఎలా తెలిసింది? ఈ దొంగతనం ఎవరో చేయించారు అని చంద్ర అనగానే శాలిని తెగ కంగారు పడుతుంది. నీతో దొంగతనం చేయించి ఎవరో చెప్పు అంటూ దొంగను పోలీసు కొడతాడు. కానీ చాలా దొంగతనాలు చేశా, ఆ మాత్రం ఎక్స్ పీరియన్స్ ఉండదా అని శాలిని పేరు చెప్పడు దొంగ. దీంతో శాలిని హమ్మయ్యా అనుకుంటుంది.
సారీ చెప్పిన సరిత
సారీ జగదీశ్వరి అని సరిత చెప్తుంది. మా వదిన మీద నమ్మకం కోల్పోవడం సరికాదు అని శ్యామల అంటుంది. క్షమించండి అని సరిత వాళ్లు వెళ్లిపోతారు. జగదీశ్వరి ఒక్కసారిగా సోఫాలో కూలబడుతుంది. ఏమైంది అని అందరూ కంగారు పడతారు. నన్ను ఒంటరిగా వదిలేయండి అని జగదీశ్వరి అనడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.














