...
...
Next Story

నిన్ను కోరి టుడే జూలై 15 ఎపిసోడ్: ఇంటి నుంచి వెళ్లిపోతానన్న శ్యామల.. విరాట్, చంద్రతో వ్రతం ప్లాన్..చెడగొట్టాలని కామాక్షి

నిన్ను కోరి సీరియల్ టుడే జూలై 15వ తేదీ ఎపిసోడ్ లో చంద్రకళ చేసిన వంటను తినను అని చెప్పేస్తాడు విరాట్. రాత్రంతా ఏడ్చుకుంటూ కూర్చుంటుంది చంద్ర. విరాట్, చంద్రతో దాంపత్య వ్రతం చేయించేందుకు శాలిని ప్లాన్ చేస్తుంది. దీన్ని అడ్డుకోవాలని అనుకుంటారు కామాక్షి, శ్రుతి.

Published on: Jul 15, 2025, 07:59:14 IST
By ,
Prefer HTon Google
Advertisement

నిన్ను కోరి సీరియల్ టుడే జూలై 15వ తేదీ ఎపిసోడ్ లో విరాట్ కోసం ఎదురు చూస్తుంటుంది చంద్రకళ. తనను చెంపపై కొట్టిందే గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది. ఇంతసేపు ఎక్కడికి వెళ్లావు? ఎంత కంగారు పడుతున్నానో తెలుసా? అని చంద్ర అంటే.. ఆపు నీ డ్రామాలు అని విరాట్ సీరియస్ అవుతాడు. భోజనం చేయమంటే చేయను అంటాడు. జగదీశ్వరి చెప్పడంతో సరే అమ్మ అని తినడానికి రెడీ అవుతాడు విరాట్.

ప్రసాదమే తినేసి

నిన్ను కోరి సీరియల్ జూలై 15 ఎపిసోడ్
నిన్ను కోరి సీరియల్ జూలై 15 ఎపిసోడ్

డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చొని కూరలు ఎవరు చేశారు అని అడుగుతాడు విరాట్. చంద్రకళ చేసిందని శ్యామల అంటే.. తన తల్లి చేసిన వంటనే తింటానని విరాట్ చెప్తాడు. కానీ దేవుని కోసం చేసిన ప్రసాదమే ఉందని చెప్తారు. ఆ పులిహోర కొంచమే ఉన్నా తినేసి వెళ్లిపోతాడు విరాట్. దీంతో చంద్రకళ ఎంతో బాధపడుతుంది. జగదీశ్వరి కూడా బాధపడితే శ్యామల ఓదార్చుతుంది. అనవసరంగా టెన్షన్స్ పెట్టుకోకు, నేను ఏదో ఒకటి చేస్తానని శ్యామల చెప్తుంది.

శిక్ష వేయొద్దు

చంద్రకళ ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. విరాట్ కూడా ఫీల్ అవుతాడు. బావ ద్వేషాన్ని భరించలేను స్వామి, చేయని తప్పునకు నాకు శిక్ష వేయొద్దు అని పొద్దున పూజ చేస్తుంది చంద్రకళ. చంద్ర అందరికీ హారతి ఇస్తుంది. మరోవైపు శాలిని టెన్షన్ పడటాన్ని కామాక్షి, శ్రుతి గమనిస్తారు. ఏం జరిగింది అని అడుగుతారు. చంద్రను ఫ్యామిలీ మొత్తం అసహ్యించుకునేలా చేయాలని శాలిని అంటుంది.

శ్యామల డ్రామా

విరాట్ ను పిలుస్తుంది శ్యామల. నువ్వు, నేను, చంద్రకళ గుడికి వెళ్లాలని శ్యామల చెప్తుంది. నీతో పాటు వస్తాను కానీ అనవసరమైన వాళ్లతో రాను, ఆవిడ వస్తే నేను మాత్రమే రాను అని విరాట్ అంటాడు. నా కంటే నీ పంతమే ఎక్కువైతే నేను బ్యాగు తీసుకుని వెళ్లిపోతా అని శ్యామల కోప్పడుతుంది. ఆనందంతో ఎగిరి గంతులేసిన కామాక్షి, శ్రుతి గదిలోకి వెళ్లి బ్యాగు సర్దుతారు. నన్ను పంపించేయాలని ఎంత ఆత్రుతగా ఉందో అని శ్యామల అంటుంది. అవమానం జరిగింది కదా వెళ్లిపో అని కామాక్షి చెప్తుంది.

జగదీశ్వరి ఆర్డర్

గుడి ప్లాన్ ఏంటో తెలియక దుష్ట త్రయం టెన్షన్ పడతారు. మనం కూడా గుడికి వెళ్లి ప్లాన్ తెలుసుకుందామని కామాక్షి చెప్తుంది. కానీ శాలిని మాత్రం రానంటుంది. ఏం ప్లాన్ చేశావే, అత్తయ్య మనల్ని గుడికి ఎందుకు తీసుకొచ్చింది? అని చంద్రకళను అడుగుతాడు విరాట్. విరాట్, చంద్ర గొడవ పడటం చూసి గుడిలోకి రమ్మని అంటుంది శ్యామల.

మీ ఇద్దరితో దాంపత్య వ్రతం చేయించబోతున్నా అని ట్విస్ట్ ఇస్తుంది శ్యామల. గొడవలు ఉన్నప్పుడు ఈ వ్రతం చేస్తే చిక్కులు తొలగిపోతాయని శ్యామల చెప్తుంది. వ్రతం పూర్తయిందో అనుకునో వాడే నీ కొంగు పట్టుకుని తిరుగుతాడు అని చంద్రతో శ్యామల అంటుంది. అయితే రహస్యంగా ఈ వ్రతం గురించి వింటారు కామాక్షి, శ్రుతి. ఈ వ్రతాన్ని చెడగొడతామని అనుకుంటారు. దీంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks