నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్: ఇంట్లో దొంగలు.. చితక్కొట్టిన చంద్ర, శాలిని.. ట్విస్ట్ రివీల్ చేసిన శ్యామల
నిన్ను కోరి సీరియల్ జూలై 4 ఎపిసోడ్ లో వంటల పోటీలో రిజల్ట్ కోసం ఉత్కంఠ నెలకొంటుంది. ఇక ఆ ఇంట్లోకి దొంగలు వస్తారు. వాళ్లను చంద్రకళ, శాలిని చితక్కొడతారు. రెండో పోటీ కోసం ఇలా చేశానని శ్యామల ట్విస్ట్ ఇస్తుంది.
నిన్ను కోరి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో వంట పోటీలో రిజల్ట్ కోసం చంద్రకళ, శాలిని వెయిట్ చేస్తుంటారు. శ్యామల, జగదీశ్వరి ముంత మసాలాను టేస్ట్ చేస్తారు. ముంత మసాలా, శాండ్ విచ్ రెండు బాగున్నాయని చెప్తారు. ఇద్దరూ విన్ అయ్యారని శ్యామల అంటుంది. ఈ పోటీ టై అయిందని చెప్తుంది. నెక్ట్స్ టాస్క్ చెప్పే వరకూ రిలాక్స్ అవండని శ్యామల అంటుంది.

ఓడిపోవాలని కోరుకుంటున్నా
తర్వాతి టాస్క్ మాత్రం నేనే గెలుస్తా అని చంద్రకు సవాలు విసురుతుంది శాలిని. బెడ్ రూమ్ లోకి వచ్చిన చంద్రకళ.. ఏంటీ బావ నేను గెలవలేను అనుకున్నావా అని విరాట్ ను అడుగుతుంది. అంతగా టచ్ లేకపోయినా శాలిని నీకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది, నువ్వు ఓడిపోవాలని కోరుకుంటున్నా అని విరాట్ అంటాడు. ప్రతిక్షణం కోపంతో తలుచుకుంటా అని విరాట్ అంటే.. ఎలా అయితే ఏంటి బావా తలుచుకుంటున్నావ్ కదా హ్యాపీ అని చంద్ర అంటుంది.
షాక్ ట్రీట్మెంట్
విరాట్ కు ఎక్కిళ్లు వస్తే నీళ్లు కావాలని అడుగుతాడు. కానీ చంద్ర వచ్చి సడెన్ గా ముద్దు పెడుతుంది. దీంతో ఎక్కిళ్లు ఆగిపోతాయి. ఎక్కిళ్లు ఆగిపోవాలంటే వాటర్ తాగాలి లేదా ఏదన్నా షాక్ కు గురి కావాలి అందుకే షాక్ ట్రీట్మెంట్ ఇచ్చా అని చంద్ర అంటుంది. మరోవైపు చంద్రను దెబ్బతీయకుండా ఏం చేశారంటూ శ్రుతి, కామక్షిపై ఫైర్ అవుతుంది శాలిని.
విరాట్ కోసం
చంద్రకళ విరాట్ కోసం ఎదురుచూస్తుంటుంది. చంద్రకళ ఒంటరిగా హాల్లో కూర్చుని ఉంటే అక్కడికి శ్యామల వచ్చి ఏంటి ఇంకా భోజనం చేయలేదా అని అడుగుతుంది. వెళ్లి భోజనం చేసి పడుకో అంటుంది. విరాట్ ఇంకా ఇంటికి రాలేదు వచ్చిన తర్వాత నేను విరాట్ ఇద్దరం కలిసి భోజనం చేస్తామని చంద్రకళ చెప్తుంది. భర్త మీద నీకు చాలా ప్రేమ ఉంది అమ్మాయి అని చంద్రకళను శ్యామల పొగిడి వెళ్లిపోతుంది.
ఇంట్లోకి దొంగలు
తన గదిలోకి వెళ్లి శ్యామల పడుకుంటుంది. అందరూ వెళ్లి పడుకుంటారు. చంద్రకళ మాత్రం విరాట్ కోసం కూర్చొని ఎదురుచూస్తూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత ఇంట్లోకి ముగ్గురు దొంగలు వస్తారు. వాళ్ళని చూసినా చంద్రకళ వెంటనే ఇంట్లో అందర్నీ పిలుస్తుంది. అందరూ హాల్లోకి వస్తారు. వాళ్ళు ఎవరు ఏంటి అని చంద్రకళ అడిగేలోపు బంగారం, డబ్బులు తీసి ఇవ్వమని బెదిరిస్తారు.
అమ్మాయిల ఫైటింగ్
ఒక రౌడీ జగదీశ్వరి మీద చేయి వేయగానే మా అత్తయ్య గారి మీద చేయి వేస్తావా అని చంద్రకళకి చాలా కోపం వస్తుంది. ఈ రౌడీని చంద్రకళ ఎడాపెడా వాయించేస్తుంది. దానితో షాలిని కూడా చంద్రకళతో పాటు ఫైట్ చేస్తుంది. అలా శాలిని చంద్రకళ ఇద్దరు కలిసి రౌడీలను బాగా కొడతారు. అలా కొట్టడంతో ఆ రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు.
రెండో పోటీ
ఇంట్లోకి దొంగలు రావడంతో అందరూ కంగారు పడతారు. కానీ పారిపోవడంతో కాస్త రిలాక్స్ అవుతారు. దొంగలు పారిపోతున్న క్రమంలో క్రాంతి, విరాట్ ఇద్దరూ ఇంట్లోకి వస్తారు. ఆ రౌడీలను చూసి క్రాంతి, విరాట్ కూటా టెన్షన్ పడతారు. ఏమైందీ అని లోపలికి వచ్చి అడుగుతారు. జరిగిన విషయాన్ని క్రాంతి, విరాట్ కు చెప్తారు. అప్పుడు శ్యామల ట్విస్ట్ ఇస్తుంది. ఆ రౌడీలను నేనే అరేంజ్ చేశాను అని చెబుతుంది. మీకు పెట్టిన రెండో పోటీ కూడా అయిపోయిందని చెప్తుంది.
ఇద్దరు సమానంగా
రెండో పోటీలో ఇద్దరు సమానంగా పోటీపడ్డారు అని చంద్రకళ, శాలినిని ఉద్దేశించి శ్యామల చెప్తుంది. మూడో పోటీ ఏంటనేది రేపు ఉదయం చెబుతాను అని శ్యామల అంటుంది. దానితో ఇద్దరు కోడళ్ళు వాళ్లకు తెలియకుండానే విజయం సాధించినట్లు అవుతుంది. శృతి, శాలిని, కామాక్షి ముగ్గురు మూడో పోటీకి అత్తయ్య ఏం ప్లాన్ చేస్తుందో మనం ఎలా నెగ్గాలో అని ప్లాన్ వేసుకుంటారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper



