నిన్ను కోరి జూలై 8 ఎపిసోడ్: అమ్మవారి నగలు మాయం.. చంద్రకళకు షాక్.. శాలిని కుట్ర.. జగదీశ్వరీకి అవమానం

నిన్ను కోరి సీరియల్ టుడే జూలై 8 ఎపిసోడ్ లో జగదీశ్వరి ఫ్రెండ్ ఇచ్చిన నగలను చంద్రకళ లాకర్ లో దాస్తుంది. అయితే ఆ నగలు మాయం అవుతాయి. నగలు దొంగతనం చేస్తారు. మరి నగలు మాయం అవడం వెనుకు ఎవరున్నారు? ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి. 

Published on: Jul 08, 2025 8:05 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి జూలై 8 ఎపిసోడ్ లో జగదీశ్వరి ఫ్రెండ్ సరిత ఇచ్చిన అమ్మవారి నగలను ఇంట్లో దాస్తారు. చంద్రకళ నగలు అన్ని తీసుకొని తన గదిలోకి వెళ్లి లాకర్ లో పెడుతుంది. చంద్రను దెబ్బకొట్టేందుకు ఇదే మంచి ఛాన్స్ అని శాలిని అనుకుంటుంది. రాత్రి అందరూ పడుకున్నాక శాలిని బయటకు వచ్చి ఓ వ్యక్తికి కాల్ చేస్తుంది. దొంగతనం చేయాలని చెప్తుంది. చంద్ర రూమ్ లోకి వెళ్లి నగలు తీసుకురమ్మని చెప్తుంది.

నిన్ను కోరి సీరియల్ జూలై 8 ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి సీరియల్ జూలై 8 ఎపిసోడ్ (jiohotstar)

ప్లాన్ తెలిసిపోయింది

లాకర్ తాళం చెవులు ఎక్కడ ఉన్నాయో ఆ వ్యక్తికి శాలిని చెప్తుంది. అంతకుముందు కప్ బోర్డ్ లో చంద్ర కీస్ పెట్టడం శాలిని చూస్తుంది. శాలిని ఫోన్లో మాట్లాడింది కామాక్షి, శ్రుతి వింటారు. నీ ప్లాన్ మాకు తెలిసిపోయింది, మేం ముందే గెస్ చేశాం అని కామాక్షి, శ్రుతి అంటారు. ఈ దెబ్బతో చంద్ర పొగరు అణిగిపోతుంది, తాళం చెవులు నీ చేతికి వస్తాయని శాలినితో అంటారు.

నగలు మాయం

ఆ దొంగ నెమ్మదిగా చంద్రకళ, విరాట్ రూమ్ లోకి వస్తాడు. కప్ బోర్డు లో నుంచి కీస్ తీసుకుంటాడు. లాకర్ ఓపెన్ చేసి నగలున్న బాక్స్ తీసుకుని వెళ్లిపోతాడు. ఆ విషయాన్ని శాలినికి ఫోన్ చేసి చెప్తాడు. నీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోమని శాలిని చెప్తుంది. దానితో కామాక్షి, శ్రుతి ఇద్దరూ దొంగ దగ్గర నగలు పెట్టుకోమని చెప్పటం ఏంటి? ముందే అతను దొంగ కదా అని ప్రశ్నిస్తారు. అతను నమ్మకస్థుడు, ఇంతకుముందు మా అమ్మ దగ్గర పని చేశాడు అని శాలిని చెప్తుంది.

చంద్ర షాక్

పొద్దునే పూజ చేసి, అందరికీ హారతి ఇస్తుంది చంద్ర. విరాట్ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇంతలో జగదీశ్వరి ఫ్రెండ్ వస్తుంది. నగలు తీసుకురమ్మని చంద్రకళకు చెప్తారు. కానీ లాకర్ ఓపెన్ చేసి చూస్తే నగల బాక్స్ కనిపించదు. దీంతో చంద్ర షాక్ అవుతుంది. రూమ్ అంతా వెతుకుతుంది.

మోసం చేస్తావనుకోలేదు

చంద్రకళకి ఏం చెప్పాలో తోచక మళ్ళీ వాళ్ళ దగ్గరకు వచ్చి నగలు కనిపించడం లేదు అని చెప్తుంది. కనిపించడం లేదని చెప్పడం ఏంటీ అని జగదీశ్వరి అడుగుతుంది. ఇంట్లో ఉన్న నగలు ఏమవుతాయి? అని శ్రుతి, కామక్షి, శాలిని మరింత రెచ్చగొడతారు. ఈ డ్రామా ఏంటీ జగదీశ్వరి, నువ్వు ఇంత మోసం చేస్తావని ఊహించలేదు అని సరిత ఫైర్ అవుతుంది. ఇన్నేళ్ల తర్వాత నిన్ను వెతుక్కుంటూ వచ్చిన ఫ్రెండ్ కు మంచి మర్యాదే చేశావని అంటుంది.

ఫ్యామిలీ అంతా కలిసి మమ్మల్ని పిచ్చోళ్లను చేయాలని చూస్తున్నారా? నగలు చేతికి రాకపోతే పోలీస్ కంప్లయింట్ ఇస్తామని సరిత అంటుంది. మా నగలు మాకు ఇవ్వకపోతే మాత్రం మీ మీద కంప్లయింట్ ఇవ్వకుండా ఊరుకోం అని సరిత భర్త చెప్పడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.