నేరుగా ఓటీటీలోకి మరో థ్రిల్లర్ మూవీ.. ఓ బిలియనీర్ హత్య.. ఓ డిటెక్టివ్.. ఎంతో మంది అనుమానితులు.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఓటీటీలోకి నేరుగా మరో థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఓ బిలియనీర్ హత్య చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఈ సినిమా ట్రైలర్ మంగళవారం (జూన్ 10) రిలీజ్ అయింది. మూవీ స్ట్రీమింగ్ తేదీని కూడా అనౌన్స్ చేశారు.
థ్రిల్లర్ మూవీ అభిమానులకు గుడ్ న్యూస్. ఇప్పుడో థ్రిల్లర్ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకే వస్తోంది. ఈ సినిమా పేరు డిటెక్టివ్ షేర్దిల్ (Detective Sherdil). జీ5 (Z5) ఓటీటీలోకి ఈ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. మరి ఈ మూవీ ట్రైలర్ ఎలా ఉంది? స్ట్రీమింగ్ వివరాలు తెలుసుకోండి.

డిటెక్టివ్ షేర్దిల్ ట్రైలర్
ప్రముఖ బాలీవుడ్ సింగర్, నటుడు దిల్జీత్ దోసాంజ్ నటించిన థ్రిల్లర్ మూవీ డిటెక్టివ్ షేర్దిల్. ఓ బిలియనీర్ హత్య, దర్యాప్తు చుట్టూ తిరిగే కథతో ఓటీటీలోకి వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఆసక్తి రేపుతోంది. మంగళవారం (జూన్ 10) ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
“ఎంతో మంది అనుమానితులు ఉన్న ఓ హత్య. ప్రతి ఒక్కరి మనసు తాళం చెవి ఉన్న ఓ షేర్. మీరు సిద్ధంగా ఉన్నారా? ట్రైలర్ వచ్చేసింది. డిటెక్టివ్ షేర్దిల్ జూన్ 20 నుంచి మీ జీ5 ఓటీటీలో..” అనే క్యాప్షన్ తో ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు.
డిటెక్టివ్ షేర్దిల్ మూవీ గురించి..
ఈ డిటెక్టివ్ షేర్దిల్ మూవీలో దిల్జీత్ దోసాంజ్ డిటెక్టివ్ పాత్రలో నటిస్తున్నాడు. ఎంతో క్లిష్టమైన కేసులను కూడా పరిష్కరించే డిటెక్టివ్ అతడు. ఈ ట్రైలర్ మొదట్లోనే ఓ బిలియనీర్ ను నడిరోడ్డుపై హత్య చేసినట్లు చూపిస్తారు. అతడు వెళ్తున్న కారుపై ఫైరింగ్ చేసిన ఓ యువకుడు.. ఆ తర్వాత ఆ కారును పేల్చేస్తాడు. అతన్ని చంపిందెవరో తెలుసుకోవడానికి డిటెక్టివ్ రంగంలోకి దిగుతాడు.
మొదట అతని కుటుంబంలో ఉన్న నలుగురు వ్యక్తుల నుంచే దర్యాప్తు మొదలుపెడతాడు. థ్రిల్ తోపాటు ఫన్ కూడా పంచుతూ ఈ ట్రైలర్ సాగిపోయింది. ఈ డిటెక్టివ్ షేర్దిల్ సినిమాలో దిల్జీత్ దోసాంజ్ తోపాటు డయానా పెంటీ, బొమన్ ఇరానీ, రత్నా పాఠక్ షా, చుంకీ పాండే, సుమీత్ వ్యాస్, బనితా సంధు, కశ్మీరా ఇరానీలాంటి వాళ్లు నటించారు. రవి ఛాబ్రియా సినిమాను డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాను జూన్ 20 నుంచి జీ5 ఓటీటీలో చూడొచ్చు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper



