కేవలం 4 గంటల్లోనే హరి హర వీరమల్లు డబ్బింగ్ పూర్తి చేసిన పవన్ కల్యాణ్.. ఇదో రికార్డు
పవన్ కల్యాణ్ కేవలం 4 గంటల్లోనే ఓ మూవీలో తన డబ్బింగ్ మొత్తం పూర్తి చేశాడంటే నమ్మగలరా? తన బిజీ షెడ్యూల్లో ఈ ఏపీ డిప్యూటీ సీఎం రికార్డు టైమ్ లో ఇలా హరి హర వీరమల్లు మూవీ డబ్బింగ్ పూర్తి చేయడం విశేషం.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ హరి హర వీరమల్లు జూన్ 12న థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిపిందే. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ ఇది. ఈ మూవీ కోసం పవన్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలాంటి మూవీలో తన డబ్బింగ్ పార్ట్ ను పవన్ కేవలం 4 గంటల్లోనే పూర్తి చేయడం విశేషం.

పవనా మజాకా?
పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అవుతున్న తన తొలి మూవీ హరి హర వీరమల్లు. అతనికిదే తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా. అలాంటి సినిమా డబ్బింగ్ ను పవన్ కేవలం నాలుగే గంటల్లో ముగించాడంటే ఆశ్చర్యం కలగకమానదు. గురువారం (మే 29) ఆ మూవీ టీమ్ ఈ విషయాన్ని తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. అది కూడా అర్ధరాత్రి వేళ కావడం మరో విశేషం.
“పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారు అసలు అంతులేని ఏకాగ్రత, ఫైర్ తో హరి హర వీరమల్లు డబ్బింగ్ పూర్తి చేశాడు. బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా.. షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత రాత్రి 10 గంటలకు ఆయన డబ్బింగ్ మొదలుపెట్టారు. మొత్తం డబ్బింగ్ కేవలం 4 గంటల్లోనే పూర్తి చేశారు. పవర్ తుఫాను కోసం సిద్ధంగా ఉండండి. అడ్రినలైన్ ను ఉరకలెత్తించే రైడ్ జూన్ 12న మీకోసం చూస్తుంటుంది” అనే క్యాప్షన్ తో హరి హర వీరమల్లు టీమ్ ట్వీట్ చేసింది.
పవన్ అంకిత భావానికి ఫ్యాన్స్ ఫిదా
పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రభుత్వ వ్యవహారాల్లో మరింత బిజీ అయ్యాడు. అదే సమయంలో ఓజీ మూవీ షూటింగ్ లోనూ పాల్గొంటున్నాడు. ఇంత బిజీ షెడ్యూల్లోనూ హరి హర వీరమల్లు డబ్బింగ్ లో పాల్గొని కేవలం 4 గంటల్లోనే పూర్తి చేశాడంటే అతని అంకిత భావం అలాంటిదంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అది కూడా రాత్రి 10 గంటలకు మొదలుపెట్టి అర్ధరాత్రి దాటే వరకూ డబ్బింగ్ పనుల్లో నిమగ్నమవడం గమనార్హం.
ఈ హరి హర వీరమల్లు షూటింగ్ ను 200 రోజుల్లో పూర్తి చేశారు. ఈ చారిత్రక మూవీ పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో రిలీజ్ కాబోతోంది. క్రిష్, జ్యోతికృష్ణ మూవీని డైరెక్ట్ చేయగా.. కీరవాణి మ్యూజిక్ అందించాడు. ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఇది 17వ శతాబ్దంలో జరిగిన స్టోరీ. రెబల్ వీరమల్లు పాత్రలో పవన్ నటించాడు. మొఘల్స్ నుంచి కోహినూర్ వజ్రాన్ని తిరిగి సంపాదించే పనిలో అతడు ఉంటాడు. ఇందులో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్.. మొఘల్ చక్రవర్తి ఔరంగాజేబు పాత్రలో నటించాడు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper



