హరి హర వీరమల్లు ట్రైలర్ చూసిన పవన్ కల్యాణ్.. అతని రియాక్షన్ వైరల్.. వీడియో షేర్ చేసిన మూవీ టీమ్
హరి హర వీరమల్లు మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో పవన్ ఈ ట్రైలర్ చూస్తున్న వీడియోను మూవీ టీమ్ షేర్ చేసింది. ఇది చూసిన తర్వాత పవన్ రియాక్షన్ కూడా వైరల్ అవుతోంది.
వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హిస్టారిక్ మూవీ హరి హర వీరమల్లు ఈ నెల 24న రిలీజ్ కానున్న విషయం తెలుసు కదా. ఈ నేపథ్యంలో ట్రైలర్ ను గురువారం (జులై 3) మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. అయితే ఇప్పటికే సిద్ధమైన ట్రైలర్ ను పవన్ కల్యాణ్ చూశాడు. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలను మూవీ టీమ్ షేర్ చేసింది.

ట్రైలర్ చూసి పవన్ రియాక్షన్ ఇదే..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు కోసం ఎన్నో రోజులు అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. మొత్తానికి ట్రైలర్ రిలీజ్ సమయం దగ్గర పడుతోంది. అంతేకాదు ఈ ట్రైలర్ పవన్ కు కూడా బాగా నచ్చేసినట్లు మూవీ టీమ్ రిలీజ్ చేసిన వీడియో చూస్తే తెలుస్తోంది. ఈ హరి హర వీరమల్లు టీమ్ తోపాటు దర్శకుడు త్రివిక్రమ్ తో కలిసి పవన్ కల్యాణ్ ఈ సినిమా ట్రైలర్ చూశాడు.
ట్రైలర్ చూస్తున్నంతసేపు పవన్ బాగా ఎంజాయ్ చేసినట్లుగా వీడియో చూస్తే తెలుస్తోంది. ఇక చివర్లో దర్శుకుడు జ్యోతి కృష్ణను హగ్ చేసుకొని చాలా బాగా కష్టపడ్డావ్ అంటూ ప్రశంసించి పవన్ వెళ్లిపోవడం ఈ వీడియోలో చూడొచ్చు. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ ప్రాజెక్ట్ మొత్తానికి ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
హరి హర వీరమల్లు మూవీ గురించి..
హరి హర వీరమల్లు మూవీ ఇప్పటికే ఎన్నోసార్లు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి మళ్లీ వెనక్కి తగ్గారు. గత నెలలోనే మూవీని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించినా.. మళ్లీ వాయిదా వేశారు. మొత్తానికి జులై 24న మూవీ వస్తోంది. ట్రైలర్ కూడా సిద్ధమైపోయింది. దీంతో ఈసారి టీమ్ వెనక్కి తగ్గదని అభిమానులు భావిస్తున్నారు. ట్రైలర్ లాంచ్ తో మూవీ ప్రమోషన్ పనులు కూడా ప్రారంభం కానున్నాయి.
ఈ సినిమా మొదట క్రిష్ డైరెక్ట్ చేయగా.. మధ్యలోనే అతడు తప్పుకోవడంతో తర్వాత జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేశాడు. ఏఎం రత్నం సినిమాను నిర్మించాడు. కీరవాణి మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటించింది. ఇప్పటి వరకూ వచ్చిన సాంగ్స్, టీజర్, ఇతర ప్రమోషన్ వీడియోలు అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ట్రైలర్ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి నెలకొంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper



