ప్రైమ్ వీడియోలోని ఈ సూపర్ థ్రిల్లర్ అస్సలు మిస్ కావద్దు.. కేవలం గంటన్నర రన్‌టైమ్.. మూవీ అంతా ఒక్క రాత్రిలోనే..

ప్రైమ్ వీడియోలో వచ్చిన ఓ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు అదరగొడుతోంది. కేవలం గంటన్నర రన్ టైమ్‌తో వచ్చిన ఈ సినిమా ఒకే రాత్రిలో సాగే స్టోరీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఓ చిన్న పాప కిడ్నాప్ చుట్టూ తిరిగే కథ ఇది.

Published on: Jun 5, 2025, 14:33:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమెజాన్ ప్రైమ్ వీడియోలో బుధవారం (జూన్ 4) ఓ హిందీ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ మూవీ పేరు స్టోలెన్ (Stolen). ఈ సూపర్ థ్రిల్లర్ ఆ ఓటీటీలో టాప్ ట్రెండింగ్ సినిమాగా నిలిచింది. ఓ చిన్న పాప కిడ్నాప్, అందులో అనుకోకుండా ఇరుక్కునే ఇద్దరు అన్నదమ్ముల చుట్టూ తిరిగే ఈ మూవీ ఎలా ఉందో చూడండి.

ప్రైమ్ వీడియోలోని ఈ సూపర్ థ్రిల్లర్ అస్సలు మిస్ కావద్దు.. కేవలం గంటన్నర రన్‌టైమ్.. మూవీ అంతా ఒక్క రాత్రిలోనే..
ప్రైమ్ వీడియోలోని ఈ సూపర్ థ్రిల్లర్ అస్సలు మిస్ కావద్దు.. కేవలం గంటన్నర రన్‌టైమ్.. మూవీ అంతా ఒక్క రాత్రిలోనే..

స్టోలెన్ మూవీ స్టోరీ ఇదీ..

ప్రైమ్ వీడియో ఓటీటీలో ఉన్న స్టోలెన్ మూవీ కొన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఈ మూవీ మొదట్లోనే ఓ ఆదివాసీ మహిళకు చెందిన ఓ చిన్న పాపను కిడ్నాప్ చేయడం చూడొచ్చు. రాజస్థాన్ లోని ఓ చిన్న ఊళ్లో ఓ రాత్రి రైల్వేస్టేషన్ లో నిద్రిస్తున్న ఆమె పక్కనే ఉన్న చిన్నారిని ఓ మహిళ ఎత్తుకుపోతుంది. ఈ క్రమంలో అప్పుడే రైలు దిగి తన సోదరుడి కోసం ఎదురు చూస్తున్న రమణ్ (శుభం వర్ధన్)ను ఢీకొట్టుకుంటూ వెళ్తుంది.

అతన్ని తీసుకెళ్లడానికి స్టేషన్ కు అతని అన్న గౌతమ్ (అభిషేక్ బెనర్జీ) వస్తాడు. ఆ మహిళకు సాయం చేయాలనుకునే ఈ ఇద్దరూ.. అనుకోకుండా ఆ కిడ్నాప్ కేసులోనే ఇరుక్కుంటారు. వాళ్లు, వాళ్ల కారుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. పిల్లలను కిడ్నాప్ చేసేవాళ్లుగా వాళ్లపై ముద్ర వేస్తారు. ఓవైపు పోలీసులు, మరోవైపు బయట ఊళ్లో వాళ్ల లక్ష్యంగా మారతారు.

ఈ ప్రమాదం నుంచి ఆ ఇద్దరు అన్నదమ్ములు తప్పించుకుంటారా? అసలు ఆ పాప కిడ్నాప్ వెనుక ఉన్నది ఎవరు? ఎందుకు కిడ్నాప్ చేశారు? చివరికి ఆ పాప దొరుకుతుందా లేదా అన్నది ఈ స్టోలెన్ మూవీలో చూడొచ్చు.

స్టోలెన్ ఎందుకు చూడాలంటే?

స్టోలెన్ ఓ థ్రిల్లర్మూవీ. కేవలం గంటన్నర నిడివితోనే వచ్చింది. మొదటి సీన్ నుంచి చివరి వరకూ ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టేలా చేస్తుంది. చాలా వరకు ఒకే రాత్రిలో సాగిపోయే స్టోరీ ఇది. ఈ మూవీని కరణ్ తేజ్‌పాల్ డైరెక్ట్ చేశాడు.

అతనికి ఇదే తొలి సినిమా. అయితే గ్రిప్పింగ్ నెరేషన్ తో సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా మలిచాడు. సరోగసీ, పిల్లల కిడ్నాపింగ్ అనే ఓ నిజ జీవిత ఘటనను ఆధారంగా చేసుకొని స్టోలెన్ మూవీని తీశాడు. ఎక్కడా అనవసర సీన్లు లేకుండా గంటన్నర పాటు మొత్తం సినిమాను చాలా ఆసక్తికరంగా చూసేలా తీర్చిదిద్దాడు. థ్రిల్ అందిస్తూనే మనల్ని ఎమోషనల్ చేసే మూవీ ఇది.

ఇక ఇందులో లీడ్ రోల్ పోషించిన అభిషేక్ బెనర్జీతోపాటు చిన్నారిని కోల్పోయిన తల్లి పాత్ర వేసిన మియా మీల్జర్, శుభం వర్దన్ నటన కూడా హైలైట్. మూవీ మొత్తం ప్రధానంగా ఈ ముగ్గురి చుట్టే తిరుగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిందీ ఆడియో, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ఉన్న ఈ సినిమా ఓ మస్ట్ వాచ్ అని చెప్పొచ్చు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More