మా సినిమాలకు గణపతి, ఆది దేవుడు అల్లు అరవింద్ గారే.. పిడికిలిగా మారడానికి రెడీ.. బేబీ నిర్మాత ఎస్‌కేఎన్ కామెంట్స్

బేబీ సినిమాతో నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు ఎస్‌కేఎన్. ఇటీవల జరిగిన చిత్ర మండలి టీజర్ లాంచ్ కార్యక్రమంలో నిర్మాత ఎస్‌కేఎన్ పాల్గొన్నారు. ప్రియదర్శి, రాగ్ మయూర్, ప్రసాద్, నిహారిక ఎమ్ నటించిన చిత్ర మండలి టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Jun 15, 2025, 10:34:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బేబి మూవీతో నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్. ఇటీవల జరిగిన చిత్ర మండలి మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరయ్యారు నిర్మాత ఎస్‌కేఎన్. ఈ చిత్ర మండలి సినిమాను బన్నీ వాస్ నూతన నిర్మాణ సంస్థ బి.వి. వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించింది.

మా సినిమాలకు గణపతి, ఆది దేవుడు అల్లు అరవింద్ గారే.. పిడికిలిగా మారడానికి రెడీ.. బేబీ నిర్మాత ఎస్‌కేఎన్ కామెంట్స్
మా సినిమాలకు గణపతి, ఆది దేవుడు అల్లు అరవింద్ గారే.. పిడికిలిగా మారడానికి రెడీ.. బేబీ నిర్మాత ఎస్‌కేఎన్ కామెంట్స్

సినీ ప్రముఖుల హాజరు

ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా, నిహారిక ఎమ్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్ర మండలి సినిమాక విజయేందర్ ఎస్ దర్శకత్వం వహించారు. అయితే, రీసెంట్‌గా చిత్ర మండలి టీజర్ లాంచ్‌కు సినీ ప్రముఖులు హాజరయ్యారు. వారితోపాటు అతిథిగా హాజరైన ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ నిర్మాత అల్లు అరవింద్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఏ హోమం చేసినా

నిర్మాత ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ.. "ఏ హోమం చేసినా మనం ముందుగా వినాయకుడికి పూజ చేస్తాం. మా సినిమా వేడుకలకు గణపతి, ఆది దేవుడు అల్లు అరవింద్ గారే. నన్ను, బన్నీ వాసుని ఆయన బిడ్డల్లాగే చూసుకుంటారు. చేతి ఐదు వేళ్లు విడివిడిగా ఉన్నట్టు కనిపిస్తాయి కానీ, కలిసే ఉంటాయి" అని అన్నారు.

పిడికిలిగా మారడానికి సిద్ధం

"అరవింద్ గారు ప్రోత్సహించిన కుటుంబం మేము. మేమంతా ఎప్పుడూ కలిసే ఉంటాం. ఆయన కోసం మేము పిడికిలిగా మారడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. ఈ మిత్ర మండలి టీజర్ చూస్తుంటే జాతి రత్నాలు, మ్యాడ్, ఆయ్, సింగిల్ సినిమాల వైబ్ వస్తుంది. అవన్నీ హిట్ సినిమాలే. మిత్ర మండలి వాటిని మించిన విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని నిర్మాత ఎస్కేఎన్ తెలిపారు.

రైటింగ్ క్రేజీగా ఉంటుంది

ఇదే ఈవెంట్‌కు అతిథిగా వచ్చి దర్శకుడు అనుదీప్ కె.వి. మాట్లాడుతూ.. "ఈ మిత్ర మండలి చిత్ర దర్శకుడు విజయ్ నాకు స్నేహితుడు. అవుట్ అండ్ అవుట్ కామెడీతో ఈ స్టోరీ రెడీ చేసుకున్నాడు. రైటింగ్ క్రేజీగా ఉంటుంది. సినిమా మొదటి నుంచి చివరి వరకు మీరు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఇలాంటి యువ ప్రతిభను ప్రోత్సహిస్తున్న బన్నీ వాస్ గారికి కృతఙ్ఞతలు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్" అని అన్నారు.

ఎంతో ఎనర్జీ ఇచ్చింది

"అల్లు అరవింద్ గారు మా టీజర్ లాంచ్‌కి చాలా సంతోషంగా ఉంది. ఆయన రాక మా అందరికీ ఎంతో ఎనర్జీ ఇచ్చింది. అలాగే, అనుదీప్ గారు మాకు రైటింగ్ పరంగా ఎంతో సహాయం అందించారు. ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుందని నమ్మకంగా ఉన్నాము" అని చిత్ర మండలి నిర్మాత భాను ప్రతాప పేర్కొన్నారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More