Sooseki song lyrics pushpa: పుష్ప 2 సెకండ్ సింగిల్ సూసేకీ సాంగ్ లిరిక్స్ ఇవే.. ఈ సూపర్ మెలోడీని మీరూ పాడండి

Pushpa 2 Second Single Lyrics: పుష్ప 2 మూవీ నుంచి సూసేకీ అంటూ అదిరిపోయే మెలోడీ సాంగ్ రిలీజైన విషయం తెలుసు కదా. ఈ కపుల్ సాంగ్ ఇన్‌స్టాంట్ హిట్ అయింది.

Published on: May 29, 2024, 13:34:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Pushpa 2 Second Single Lyrics: పుష్ప 2 సెకండ్ సింగిల్ వచ్చేసింది. ది కపుల్ సాంగ్ అంటూ సూసేకి పాటను బుధవారం (మే 29) మేకర్స్ రిలీజ్ చేశారు. దేవి శ్రీ ప్రసాద్ చెవులకు ఇంపైన మ్యూజిక్, మెలోడీ క్వీన్ శ్రేయా ఘోషాల్ వాయిస్ తో ఈ పాట ఇన్‌స్టాంట్ హిట్ అయింది. దీనికితోడు అల్లు అర్జున్, రష్మిక జోడీ వేసిన స్టెప్పులు ప్రతి జంటకు ఓ కొత్త డ్యాన్స్ మూవ్ అందించిందని చెప్పాలి.

పుష్ప 2 సెకండ్ సింగిల్ సూసేకీ సాంగ్ లిరిక్స్ ఇవే.. ఈ సూపర్ మెలోడీని మీరూ పాడండి
పుష్ప 2 సెకండ్ సింగిల్ సూసేకీ సాంగ్ లిరిక్స్ ఇవే.. ఈ సూపర్ మెలోడీని మీరూ పాడండి

అదరగొడుతున్న సూసేకి సాంగ్

పుష్ప 2 మూవీలోని ఈ సూసేకి పాటను ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్ రాశాడు. రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. పుష్ప మూవీలో శ్రీవల్లి పాట దేశాన్ని ఎంతలా ఊపేసిందో తెలుసు కదా. ఇప్పుడీ మెలోడీ కూడా అదే స్థాయిలో హిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరు లేచి స్టెప్పులేసేలా ఈ సాంగ్ బీట్ అదిరిపోయింది.

ఇక గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ కూడా ఈ సూసేకి పాటకు ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు. అల్లు అర్జున్, రష్మికతో అతను వేయించి స్టెప్పులు కొన్నాళ్ల పాటు గుర్తుండిపోతాయి. పుష్ప 2 నుంచి ఫస్ట్ సింగిల్ మాస్ బీట్ తో సాగిపోగా.. ఈ సెకండ్ సింగిల్ మాత్రం మెలోడీ లవర్స్ ను కట్టి పడేస్తుందనడంలో డౌట్ లేదు. పుష్ప 2 మూవీ ఆగస్ట్ 15న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. కింద ఈ పాట లిరిక్స్ ఉన్నాయి. మీరు కూడా కాస్త మీ గొంతును సవరించి పాడటం మొదలు పెట్టండి.

సూసేకీ సాంగ్ లిరిక్స్

వీడు మొరటోడు..

అని వాళ్లు వీళ్లు ఎన్నెన్ని అన్న

పసిపిల్ల వాడు నా వాడు

వీడు మొండోడు

అని ఊరువాడ అనుకున్నగానీ..

మహరాజు నాకు నా వాడు..

ఓ.. మాట పెళుసైనా..

మనుసులో వెన్నా..

రాయిలా ఉన్నవాడిలోన

దేవుడెవరికి తెలుసును నాకన్న

సూసేకి.. అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి..

మెత్తాని పత్తి పువ్వులామరి సంటోడే నా సామి..

ఓ... ఎర్రబడ్డా కళ్లలోనా..

కోపమే మీకు తెలుసు..

కళ్లలోన దాచుకున్న

చెమ్మ నాకే తెలుసు..

కోర మీసం రువ్వుతున్న

రోషమే మీకు తెలుసు..

మీసమెనక ముసురుకున్న

ముసినవ్వు నాకు తెలుసు..

అడవిలో పులిలా సర సర సర సర

చెలరేగడమే మీకు తెలుసు..

అలసిన రాతిరి ఒడిలో చేరి తల వాల్చడమే శ్రీవల్లికి తెలుసు

సూసేకి.. అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి..

మెత్తాని పత్తి పువ్వులామరి సంటోడే నా సామి..

ఓ.. గొప్ప గొప్ప ఇనాములనే..

ఇచ్చివేసే నవాబు..

నన్ను మాత్రం

చిన్ని చిన్ని ముద్దులడిగే గరీబు

పెద్ద పెద్ద పనులు ఇట్టే..

చక్కబెట్టే మగాడు..

వాడి చొక్క ఎక్కడుందో..

వెతకమంటాడు చూడు..

బయటకు వెళ్లి ఎందరెందరినో..

ఎదిరించేటి దొరగారు..

నేనే తనకీ ఎదురెళ్లకుండా..

బయటకు వెళ్లరు శ్రీవారు..

సూసేకి.. అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి..

ఇట్టాంటి మంచి మొగడుంటే.. ఏ పిల్లయినా మహరాణి..

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More